సీఎం కేసీఆర్ బ్రాహ్మణ సమాజంపై వరాల జల్లు కురిపించడంతో ఆ వర్గంలో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. సీఎం కేసీఆర్కు తమ ఆశీర్వచనాలు ఎప్పుడూ ఉంటాయని చెబుతున్నారు. ‘విప్రహితా.. విజయోస్తు’ అంటూ దీవిస్తున్నారు. ఉమ్మడి మెదక్ జిల్లాలోని పలువురు పురోహితులు, వేద పండితులు తమ ఆనందాన్ని ‘నమస్తే తెలంగాణ’తో పంచుకున్నారు. వారి అభిప్రాయ మాలిక చదవండి…
– సంగారెడ్డి/నర్సాపూర్/అందోల్/రామాయంపేట/ వెల్దుర్తి/నిజాపేట/కోహీర్/కొల్చారం/ రామచంద్రాపురం/శివ్వంపేట/సిద్దిపేట రూరల్/ మిరుదొడ్డి/ చేర్యాల/హుస్నాబాద్ టౌన్/మద్దూరు/మర్కూక్/తొగుట/ దుబ్బాక టౌన్/రాయపోల్/కొమురవెల్లి/జగదేవ్పూర్, జూన్ 1
వేద పండితులకు అండగా ఉండటం అభినందనీయం
65 ఏళ్ల స్వాతంత్య్ర భారతంలో అర్చకులను పట్టించుకున్నవారే లేరు. బీజేపీ పాలిత రాష్ర్టాల్లో కూడా అర్చకులను పట్టించుకోవడం లేదు. తెలంగాణలో మాత్రం సీఎం కేసీఆర్ అండగా నిలుస్తున్నారు. ఇన్నేండ్లకు సీఎం కేసీఆర్ రూపంలో బ్రాహ్మణులను అక్కున చేర్చుకునే పాలకుడు దొరికినందుకు ఆనందంగా ఉంది. సీఎం కేసీఆర్ విప్రహిత బ్రాహ్మణ సదనం ప్రారంభించి, అర్చకుల సంక్షేమం కోసం వరాలు కురిపించినందుకు కృతజ్ఞతలు. ఆలయాల్లో అర్చక వృత్తి నిర్వహిస్తూ దుర్భర జీవితం గడుపుతున్న అర్చకులకు సీఎం కేసీఆర్ ధూపదీప నైవేద్యం కోసం రూ.10 వేలకు పెంచడం ఆనందదాయకం. కొల్చారంలో వేద సాంస్కృతిక పాఠశాలను ఏర్పాటు చేయడం సంతోషదాయకం.
– జీడికంటి సత్యనారాయణాచార్య, అర్చకుడు, వేణుగోపాల స్వామి ఆలయం (వెంకట్రావుపేట, తొగుట మండలం)
అందరివాడు కేసీఆర్…
సీఎం కేసీఆర్ అందరివాడు. అన్ని కులాల వారి సంక్షేమానికి పాటుపడుతున్నారు. పేదవాళ్లను ఆదరించి ఉన్నత స్థాయికి తీసుకెళ్లాలనే తపన సీఎం కేసీఆర్లో కనిపిస్తుంది. బ్రాహ్మణులు అనేక ఏళ్లుగా ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కేసీఆర్తోనే అవుతుంది. అనువంశిక అర్చకుల సమస్యలపై కేబినెట్లో చర్చిస్తామని చెప్పడం హర్షదాయకం. హైదరాబాద్లో బ్రాహ్మణ సదనం ప్రారంభిచండం, వేద పాఠశాలలకు గ్రాంట్ రెట్టింపు చేయడం ఆనందదాయకం. గౌరవ భృతికి అర్హత వయసు 65 ఏళ్లకు తగ్గించడం చాలా సంతోషకరం.
– కలకుంట్ల కృష్ణమాచార్య, జిల్లా అధ్యక్షుడు, అర్చక సమాఖ్య, సిద్దిపేట
ఆలయాలకు నిధులు హర్షణీయం…
బ్రాహ్మణ సదనం ప్రారంభం శుభదాయకం. తెలంగాణలో ఆదరణకు నోచుకోని ఆలయాలు చాలా ఉన్నాయి. వాటిని పరిగణలోకి తీసుకొని అభివృద్ధి చేయాలనే ఆలోచన సీఎం కేసీఆర్లో ఉంది. ముందుగా వాటికి ధూపదీప నైవేద్యం అమలు చేస్తున్నారు. కానీ, ప్రస్తుతం ఇస్తున్న డబ్బులు సరిపోవడం లేదని గుర్తించిన సీఎం కేసీఆర్ రూ.10 వేలకు పెంచుతామనడం నిజంగా మెచ్చుకోదగిన విషయం. గుడి బాగుంటే ఊరు బాగుంటుంది. వేదశాస్త్ర పండితులకు ఇస్తున్న గౌరవ భృతి చాలడం లేదని గుర్తించిన సీఎం దాన్ని రూ.5 వేలకు పెంచుతున్నట్లు ప్రకటించడం సంతోషదాయకం.
– కలకుంట్ల వెంకటనర్సింహాచార్య, జిల్లా అధ్యక్షుడు, ధూపదీప నైవేద్యాల కమిటీ, సిద్దిపేట
సీఎం కేసీఆర్ కృషి గర్వకారణం…
సీఎం కేసీఆర్ పేద పండితుల కుటుంబాలను ఆదుకోవాలనే ఆలోచన చేయడం గర్వించదగ్గ విషయం. బ్రాహ్మణ సదనం ప్రారంభించడం బాగుంది. బ్రాహ్మణ కుటుంబాల బాగు కోసం వరాలు కురిపించడం ఒక్క కేసీఆర్కే సాధ్యం. ఊరిలో ఆలయం ఉంటే ఆధ్యాత్మికంగా ప్రశాంతత ఉంటుంది. ఇప్పటివరకు ఆదరణకు నోచుకోని ఆలయాలను పునరుద్ధరించాలి. – రామాచారి, జిల్లా ఉపాధ్యక్షుడు, ధూపదీప నైవేద్యాల కమిటీ, సిద్దిపేట
సీఎం కేసీఆర్ కారణ జన్ముడు…
బ్రాహ్మణులు నిత్యం పౌరోహిత్యం చేస్తూ పురహితాన్ని కోరుకుంటారు. వారి మేలును కోరుతున్న సీఎం కేసీఆర్ కారణజన్ముడు. బ్రాహ్మణుల కోసం కోట్లాది రూపాయలు వెచ్చించి సదనం నిర్మించడం, వేద పండితులకు గౌరవ వేతనం పెంచడం హర్షనీయం. హిందూధర్మ పరిక్షణలో భాగంగా సీఎం కేసీఆర్ ఆలయాలను అభివృద్ధి చేస్తున్నారు. నిత్య పూజలకు ధూపదీప నైవేద్యాల కోసం డబ్బులు మంజూరు చేస్తున్నారు.
-మర్మాముల రామచంద్రమూర్తి (చేర్యాల), రాష్ట్ర ఉపాధ్యక్షుడు, బ్రాహ్మణ సంఘం
సమాజ సంక్షేమ సారథి సీఎం కేసీఆర్…
సీఎం కేసీఆర్ సమాజ సంక్షేమ సారథి. సమాజ సంక్షేమమే ధ్యేయంగా ముఖ్యమంత్రి కేసీఆర్ అవిరళ కృషి చేస్తున్నారు. ఆర్థికంగా వెనుకబడి ఉన్న చాలా మంది పేద బ్రాహ్మణుల కోసం బ్రాహ్మణ భవన్ ఉపయోగపడుతుంది. పౌరోహిత్యమే వృత్తిగా స్వీకరించి ఎన్నో ఏళ్లుగా గ్రామాల్లో నివసిస్తున్న పురోహితులకు, కొన్ని తరాలుగా ఒక్క రూపాయి ఆశించకుండా ఆలయాల్లో పూజ చేస్తున్న అర్చకులకు గతంలో ఉన్న రూ.6 వేల భృతిని రూ.10 వేలకు పెంచడం ముఖ్యమంత్రి కేసీఆర్ గొప్పదనానికి, ధర్మ పరిరక్షణ పట్ల ఆయనకు ఉన్న శ్రద్ధాసక్తులకు తార్కాణం. యావత్ భారతావని గర్వపడేలా యాదాద్రిలో అద్భుత కృష్ణశిల నిర్మాణం చేయడం, ఎవరూ ఊహించనట్లుగా కాళేశ్వరం నిర్మించిన అపర చాణక్యుడు కేసీఆర్. ఆర్థికంగా వెనుకబడి ఉన్న ఎంతో మంది పేద బ్రాహ్మణులు ఉన్నత విద్యాభ్యాసం కోసం విదేశాలకు వెళ్లేందుకు బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ ద్వారా స్కాలర్షిప్ మంజూరు చేయడం ముఖ్యమంత్రి ఔదార్యాన్ని గుర్తు చేస్తుంది. ఏ రాష్ట్రంలోనూ లేనివిధంగా 65 ఏళ్ల వయస్సు పైబడిన వేద పండితులకు రూ.ఐదు వేల జీవన భృతి ఇచ్చి సత్కరించడం తెలంగాణ ప్రభుత్వ ధర్మ నిబద్ధతకు సూచిక.
-మాధవ శర్మ, మర్కూక్ (జ్ఞానగుణ సాగర చారిటబుల్ ట్రస్టు వ్యవస్థాపకుడు)
మహోన్నత వ్యక్తి కేసీఆర్…
యజ్ఞ యాగాది క్రతువులు నిర్వహించడమే కాకుండా అణగారిన బ్రాహ్మణుల జీవితాల్లో వెలుగుల నింపిన మహోన్నత వ్యక్తి, మూడు కోట్ల ప్రజల ఆరాధ్య దైవం తెలంగాణ ముద్దబిడ్డ ముఖ్యమంత్రి కేసీఆర్. వేద పాఠశాలలకు గ్రాంట్లు ఇవ్వడం వృద్ధ వేద పండితులకు పెన్షన్లు ఇవ్వడం సంతోషదాయకం. ఎన్నో గ్రామాల్లో నిత్య పూజలకు నోచుకోని ఆలయాల కోసం ధూపదీప నైవేద్యాల ఖర్చులను రెట్టింపు చేసి ఇస్తున్న మహోన్నత వ్యక్తి కేసీఆర్. మన సంప్రదాయాలను, సంస్కృతిని కాపాడటానికి నిరంతరం తపిస్తున్న ధార్మికవేత్త కేసీఆర్. విప్రహిత బ్రాహ్మణ సదనం ప్రారంభించడం, చాలా హర్షదాయకమైన విషయం. నిజంగా కేసీఆర్ లాంటి దార్శినికుడు ముఖ్యమంత్రిగా ఉండడం మన రాష్ట్ర ప్రజలు చేసుకున్న అదృష్టం. కేసీఆర్ బ్రాహ్మణ పక్షపాతి అనడంలో ఎలాంటి సందేహం లేదు. అన్ని వర్గాలను కులాలను అభివృద్ధి చేయడమే లక్ష్యంగా తెలంగాణ రాష్ర్ర్టాన్ని అన్ని రంగాల్లో దేశంలోనే నంబర్ వన్గా నిలిపిన గొప్ప నాయకుడు కేసీఆర్.
– అదరాసుపల్లి శ్రీధర్శర్మ, జగదేవ్పూర్
బ్రాహ్మణుల అభ్యున్నతికి సీఎం కేసీఆర్ కృషి అమోఘం
గత ప్రభుత్వాలు బ్రాహ్మణులను పట్టించుకోలేదు. స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ బ్రాహ్మణుల అభ్యున్నతికి కృషి చేస్తుండడం అమోఘం. రాష్ట్రంలో హిందూ ధర్మాన్ని కాపాడడానికి ఆలయాల్లో ధూపదీప నైవేద్యాలకు సీఎం కేసీఆర్ ప్రతి నెలా రూ.10 వేలు చెల్లిస్తామని ప్రకటించడం హర్షణీయం. తెలంగాణలోని యాదాద్రి శ్రీ లక్ష్మీ నర్సింహస్వామి దేవస్థానాన్ని సకల హంగులతో ప్రపంచ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్ది హిందూ ధర్మాన్ని చాటిన చెప్పిన అపర చాణక్యుడు సీఎం కేసీఆర్ సార్. రాష్ట్రంలోని బ్రాహ్మణుల కోసం సీఎం కేసీఆర్ విప్రహిత సదనాన్ని నిర్మించి సనాతన ధర్మాభివృద్ధికి కృషి చేస్తున్నారు. రాష్ట్రంలో ఆలయాలను అభివృద్ధి చేస్తూ, హిందూ ధర్మాన్ని కాపాడుతూ ప్రజల సంక్షేమానికి కృషి చేస్తున్న సీఎం
కేసీఆర్కు కృతజ్ఞతలు.
– విఠాల రాజపున్నయ్య శర్మ, (మిరుదొడ్డి), జిల్లా సహాయ కార్యదర్శి, బ్రాహ్మణ సంఘం, సిద్దిపేట
విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ బాగుంది…
బ్రాహ్మణుల పిల్లల ఐఐటీ, ఐఐఎంల చదువులకు ఫీజు రీయింబర్స్మెంట్ ఇస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించడం చాలా సంతోషకరమైన విషయం. సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న ప్రస్తుత పథకాలకు రెట్టింపు నిధులు ఇస్తామని చెప్పడం ఆనందదాయకం. కేసీఆర్ అన్ని వర్గాలను కలుపుకొని పాలిస్తున్నారు. ఇలాంటి సీఎంకు మా ఆశీర్వచనాలు ఎల్లప్పుడు ఉంటాయి. ఇకపోతే బ్రాహ్మణ సదనం ప్రారంభించడం బాగుంది. సర్వజన హితం కోరే ఇలాంటి సీఎం తెలంగాణకు ఉండడం అదృష్టం. కేసీఆర్ పేరు చరిత్రలో నిలిచిపోతుంది.
– చిలకమర్రి వెంకటరమణాచార్య (ప్రసన్నాంజనేయస్వామి ఆలయ పూజారి), జిల్లా అధ్యక్షుడు, శ్రీవైష్ణవ సంఘం, సిద్దిపేట
బ్రాహ్మణుల ఆశీర్వాదం కేసీఆర్కు ఎల్లప్పుడూ ఉంటుంది…
బ్రాహ్మణుల పరిస్థితులను అర్థం చేసుకొని వారి జీవితాలను నిలబెట్టిన మహా నేత సీఎం కేసీఆర్. ఒకనాడు భక్తులు ఇచ్చిన విరాళాలతోనే ఆలయాలు నడిచేవి. భక్తులు ఇస్తేనే పూజారుల కడుపు నిండేది. ఏ ప్రభుత్వం కూడా ఆలోచించని రీతిలో సీఎం కేసీఆర్ ప్రభుత్వం వేద పండితులకు గౌరవ వేతనం పెంచడం సంతోషకరం. ఆలయాలను ధూపదీప నైవేద్య పథకం కింద చేర్చి దీపాలు వెలిగేలా చేస్తున్నారు. మొదటి నుంచి బ్రాహ్మణులపై సీఎం కేసీఆర్కు ప్రేమాభిమానాలు ఎక్కువ. సీఎం బ్రాహ్మణులకు మరిన్ని వరాలు ప్రకటించడం సంతోషకరం. ఆయనకు మా ఆశీర్వాదం, మద్దతు ఎల్లప్పుడూ ఉంటుంది.
– రామక రామ్మోహన్, పురోహితుడు, హుస్నాబాద్
భవిష్యత్తు తరాలకు కేసీఆర్ ఆదర్శం…
తెలంగాణలో అన్ని మతాలను సమానంగా చూస్తున్న ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుంది. తెలంగాణలో సీఎం కేసీఆర్ ధర్మ సంస్కృతి పునరుద్ధరణకు కృషి చేస్తున్నారు. దేశంలో ఎక్కడ లేనివిధంగా బ్రహ్మణుల సంక్షేమం కోసం ఆలోచించిన ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్. ధూప, దీప, నైవేద్య పథకం కింద ఇచ్చే రూ.6 వేలను రూ.10 వేలకు పెంచడం, వేద పండితులకు ఇచ్చే గౌరవ భృతిని రూ.2500 నుంచి రూ.5 వేలకు పెంచడం, పేద బ్రహ్మణ విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని అమలు చేస్తామని సీఎం ప్రకటించడం నిజంగా గర్వకారణం. మానవీయ కోణంలో ఆలోచన చేసే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ భవిష్యత్తు తరాలకు కేసీఆర్ ఆదర్శంగా నిలుస్తారు.
– మహదేవభట్ల ఆనంద్శర్మ, వేద పండితుడు (గురువన్నపేట గ్రామం, కొమురవెల్లి మండలం)
ధర్మ రక్షణ వైపు కేసీఆర్ అడుగులు శుభ పరిణామం…
సనాతన హిందూ మతానికి వేదాలే మూల స్తంభాలు. ఆ వేదాలను తరతరాలుగా సమాజానికి అందిస్తూ వేదాధ్యయన సాగిస్తున్న వేద పండితుల గౌరవ భృతిని రూ.5 వేలకు, అర్హత పరిమితిని 65 సంవత్సరాలకు తగ్గించి, వేదం పట్ల, మన సంస్కృతి పట్ల తనకున్న గౌరవాన్ని ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు చేతల్లో చూపుతున్నారు. సమాజానికి విలువైన సంపదులుగా సంస్కృతికి విలువలు పంచే కల్పవృక్షాల్లా వెలిగే ఆలయాల పోషణకు నిత్య ధూపదీప నైవేద్యం పథకాన్ని రూ.10 వేలకు పెంచి మరో రెండు వేలకుపైగా ఆలయాలను ఇందులో చేర్చడం శుభదాయకం. వేద రక్షణ, ఆలయ పోషణ ఈ రెండు సమాజానికి అత్యంత అవసరాలుగా మారుతున్న ఈ తరుణంలో కేసీఆర్ అడుగు శుభపరిణామం.
– సాత్విక్ శర్మ, మాసాయిపేట
దేశాన్ని నడిపే సత్తా ఉన్న నాయకుడు…
దార్శనికుడు, ధార్మికవేత్త అన్ని వర్గాల కష్టాలు తెలిసిన సీఎం కేసీఆర్ అర్చకులకు అన్ని రంగాల్లో పెద్దపీట వేస్తున్న ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుంది. గత ప్రభుత్వాలు బ్రాహ్మణులను పట్టించుకోలేదు. తెలంగాణ స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ ముఖ్యమంత్రి అర్చకులకు సముచిత స్థానం కల్పించారు. పేద బ్రహ్మణులకు చేయూత అందించారు. దేశంలోనే తెలంగాణను అభివృద్ధిలో నెంబర్ వన్గా తీర్చిదిద్దిన ఘనత ఆయనకే దక్కింది. దేశాన్ని నడిపే సత్తా ఉన్న నాయకుడు ఆయనే. సీఎం కేసీఆర్ రాష్ట్రంలో హ్యాట్రిక్ విజయం, దేశ రాజకీయాల్లో క్రియాశీల పాత్ర పోషించడం ఖాయం. సీఎం కేసీఆర్కు బ్రాహ్మణ సమాజం ఎప్పుడూ అండగా ఉంటుంది.
– వెంకటేశ్వరశర్మ, పురోహితుడు, రాయపోల్
ముఖ్యమంత్రి ఆదర్శప్రాయుడు…
ప్రభుత్వం ఆలయాల్లో పూజలు చేసే వేద పండితుల అర్హత వయస్సును 65 ఏండ్లకు తగ్గించడం సంతోషకరం. పురాతన ఆలయాల పునరుద్ధరణకు ప్రభుత్వం నిధులు మంజూరు చేసి అందుబాటులోకి తేవాలి. పూజారులకు గౌరవ భృతిని రూ.5 వేలకు పెంచడం ఆనందకరం. వేద పాఠశాలలను పెంచి వేద విద్యకు తోడ్పాటు అందించడంతోపాటు అభివృద్ధికి రూ.2 లక్షలు కేటాయించిన ముఖ్యమంత్రి కేసీఆర్కు బ్రాహ్మణ సంఘం రుణపడి ఉంటుంది. కులమతాలకు అతీతంగా అన్ని వర్గాల ప్రజల సంక్షేమమే పరమావధిగా పాలన చేస్తున్న ముఖ్యమంత్రి ఆదర్శప్రాయుడు. ప్రజల ఆశీస్సులు సీఎం కేసీఆర్కు నిరంతరం ఉంటాయి.
– ప్రశాంత్ శర్మ, పూజారి, సంగారెడ్డి
విప్రబంధువతడు వేదరక్షణసేయు దారిలోపొందును తన్మయంబు బ్రాహ్మలవృద్ధియే భవితకు చక్కని బాటవేయుననుచు మాటలాడు దైవవిశ్వాసంబు భావమేమనసుకు బలమని సతతము పలుకునతడు శక్తిపూజలలోన భక్తితోనుండును పురహితంబులగూర్చి ముచ్చటించు ధూపదీపంబుల దోవలోవైభోగ ములనిల్పుదేవుళ్ల మోదమొందు అగ్రవర్ణంబులోనుండియార్థికముగ స్థాయి తక్కువగానున్న జనులగాంచి విద్య నందగానందించు విత్తములను భూసురుల క్షేమమునుగోరు ముఖ్యమంత్రి యజ్ఞయాగాదులు నార్షధర్మముగూర్చి గ్రంథరాజంబుల గతినిదెలియ పుస్తకాలయమును భువిపైనతానిల్పి ధర్మరక్షణగూర్చి దారిజూపి సాధుసన్యాస విశ్రాంతికై చక్కని వసతికైనందించి భవనములను యాదాద్రిభద్రాద్రి నాంజనేయునిదివ్య మందిరంబులగూర్చి మాటనిచ్చి మాటలేకాదు జూపుదుబాటననుచు సతతమానందముగనుంచు సత్పథంబు విప్ర హితమనినమ్మిన విజ్ఞడతుడు చంద్రశేఖరనామంబుసతమువెలుగు
-మల్లావఝల చంద్రశేఖర్శర్మ, అర్చకుడు, (నర్సాయపల్లి గ్రామం, మద్దూరు మండలం, సిద్దిపేట జిల్లా)
సీఎం కేసీఆర్ చొరవతో అర్చకుల కుటుంబాల్లో వెలుగులు…
ఆలయాల్లో పనిచేసే అర్చకులను గుర్తించి ప్రభుత్వ ఉద్యోగులు మాదిరి ప్రతినెలా జీతభత్యాలు ఇస్తున్న రాష్ట్రం దేశంలో ఒక్కతెలంగాణ రాష్ట్రమే. సీఎం కేసీఆర్ హైదరాబాద్లో బ్రాహ్మణ సదనం నిర్మించడం సీఎం కేసీఆర్కే చెల్లింది. సీఎం కేసీఆర్ గొప్ప ఆధ్యాత్మికవేత్త, భక్తిభావం కలిగిన వ్యక్తి. మిగతా రాష్ర్టాలతో పోలిస్తే తెలంగాణ రాష్ట్రంలో ఆలయాలు చాలా మెరుగుపడ్డాయి. ఇవాళ అర్చకుల కుటుంబాల్లో వెలుగులు నిండాయంటే సీఎం కేసీఆర్ చొరవనే. ప్రభుత్వ ఆలయాలకు సంబంధించిన భూములను పరిక్షించడంతోపాటు క్రమబద్ధీకరించి రక్షణగా నిలిచిన సీఎం కేసీఆర్కు అర్చకుల అందరి తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు.
-ధనుంజయశర్మ, శివ్వంపేట (సికింద్లాపూర్ శ్రీలక్ష్మీనర్సింహస్వామి ఆలయ ప్రధాన అర్చకుడు)
స్వాతంత్య్రం వచ్చిననుంచి ఇదే మొదటిది…
స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు సీఎం కేసీఆర్ తప్పా ఏ ముఖ్యమంత్రి కూడా అర్చకులను పట్టించుకోలేదు. హైదరాబాద్ నగరం నడిబొడ్డున బ్రాహ్మణ సదనం ప్రారంభించి బ్రాహ్మణ జాతికి అంకితం చేయడం అద్భుతం. బ్రాహ్మణ సమాజం నుంచి సీఎం కేసీఆర్కు నిండుగా ఆశీస్సులు ఉంటాయి. అర్చకులకు, ధూప, దీప, నైవేద్యాలకు భత్యాలు పెంచడం దేశంలో రాష్ర్టానికి సాధ్యం కాలేదు. ఇలాంటి గొప్ప ధార్మికవేత్త అయిన సీఎం కేసీఆర్కు ప్రజల ఆశీస్సులు, భగవంతుడి ఆశీస్సులు ఉంటాయి.
– ఆంజనేయశర్మ (చాకరిమెట్ల ఆంజనేయస్వామి ఆలయ ఫౌండర్) శివ్వంపేట మండలం
ఇన్నేండ్లు బ్రాహ్మణులను పట్టించుకునే నాయకుడే లేకుండే..
ఇన్నేండ్లు బ్రాహ్మణుల గురించి పట్టించుకునే నాయకుడే లేకుండే. మొదటిసారి సీఎం కేసీఆర్ బ్రాహ్మణుల సంక్షేమం కోసం ఆలోచిస్తుండ్రు. వేద పండితులకు గౌరవ భృతిని పెంచడం చాలా సంతోషకరం. వేద పాఠశాలలకు ఏటా రూ.2 లక్షల వార్షిక గ్రాంట్ ఇస్తామని చెప్పడం మంచి పరిణామం. రాష్ట్రంలో సీఎం కేసీఆర్ ఆలయాల విస్తరణ చేసి ఆధ్యాత్మిక వైభవం వెల్లివిరిసేలా హిందూ సమాజం గర్వపడేలా చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 6,441 ఆలయాలకు ధూపదీప నైవేద్యం కోసం రూ.10 వేలకు పెంచడం బ్రాహ్మణ లోకం సంతోషిస్తుంది. బ్రాహ్మణ వర్గంలో ఎంతో మంది పేదరికాన్ని అనుభవిస్తున్నారు. బ్రాహ్మణుల సంక్షేమం కోసం బ్రాహ్మణ సదనాన్ని సీఎం ప్రారంభించడం బ్రాహ్మణ లోకానికి మేలు జరుగుతుంది.
– కిషన్ పూజారి, ఆర్సీపురం
బ్రాహ్మణుల పాలిట ఆశాకిరణం కేసీఆర్…
బ్రాహ్మణ సమాజానికి అనేక విధాలుగా మేలు చేస్తున్న కేసీఆర్ వారి పాలిట ఆశాకిరణంగా మారారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న బ్రాహ్మణుల కోసం బ్రాహ్మణ సదనం నిర్మించిన ఆయన వారి ఆశీర్వచనాలు పొందుతున్నారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన బ్రాహ్మణులు, అర్చకులకు భోజన వసతులు కల్పించేలా, బస చేయడానికి బ్రాహ్మణ సదనం నిర్మించడం హర్షణీయం. బ్రాహ్మణులము బయటకు వెళ్లితే బయట ఆహారం తినలేము, బ్రాహ్మణ సదనంతో ఈ ఇబ్బంది మాకు తీరినట్టే. బ్రాహ్మణ సదనంలో సశాస్త్రీయంగా మడితో వంట చేసి పెడతారు. రెండు మూడు రోజులు అక్కడ ఉన్నవాళ్లకు వసతులు కల్పించేలా సంక్షేమ భవనం ఏర్పాటు చేశారు. కేసీఆర్ తీసుకువచ్చిన బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ ద్వారా పేద బ్రాహ్మణులు ఉపాధి పొందుతున్నారు.
– హరిప్రసాద్శర్మ, రాజ పురోహితుడు, నర్సాపూర్
పరిపూర్ణ హిందూ ధర్మ పరిరక్షకుడు కేసీఆర్
సీఎం కేసీఆర్ పరిపూర్ణ హిందూ ధర్మ పరిరక్షకుడు. బ్రాహ్మణుల హితం కోరే ముఖ్యమంత్రి కేసీఆర్ బ్రాహ్మణ సదనం ప్రారంభించడం, ధూపదీప నైవేద్యాలకు ఇచ్చే గౌరవ వేతనం పెంచడం వారికి బ్రాహ్మణులపై ఉన్న గౌరవాన్ని ప్రతిబింబిస్తాయి. వేద పండితులకు గౌరవ భృతి రూ.5 వేలకు పెంపు, బ్రాహ్మణ విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ ప్రకటించడం సంతోషయదాయకం. కోలాచల మల్లినాథ సూరి విశ్వవిద్యాలయం ఏర్పాటు చేస్తుండడం శుభపరిణామం.
– కోలాచల శ్రీనివాస శర్మ, కొల్చారం
ధీరోధాత్తుడు ముఖ్యమంత్రి కేసీఆర్…
సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణను ఆచరణలో చేసి చూపించిన ధీరోధాత్తుడు ముఖ్యమంత్రి కేసీఆర్. బ్రాహ్మణుల మేలుకోరి వేద పండితుల గౌరవ భృతిని రూ.5 వేల వరకు పెంచడం, ఆలయాల నిర్వహణం వ్యయం ధూపదీప నైవేద్య పథకం రూ.6 వేల నుంచి రూ.10 వేలకు పెంచడం హర్షణీయం.
– కాసుల హరిరంజన్ శర్మ, రుక్మిణీ పాండురంగస్వామి దేవాలయ నిర్వాహకులు, మాసాయిపేట