దేశంలో పువ్వులను పూజించే గొప్ప సంస్కృతి తెలంగాణ సొంతమని, ఆడపడుచుల అతిపెద్ద పండుగ బతుకమ్మ అని మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి అన్నారు. సీఎం కేసీఆర్ బతుకమ్మ పండుగను విశ్వవ్యాప్తం చేశారని ఆమె తెలిపారు. శనివారం రామాయంపేట మండలం ఎమ్మెల్యే స్వగ్రామం కోనాపూర్లో సద్దుల బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో ఎమ్మెల్యే గ్రామస్తులతో పాటు పాల్గొని ఆడిపాడారు.
– రామాయంపేట, అక్టోబర్ 21
రామాయంపేట, అక్టోబర్ 21: సీఎం కేసీఆర్ బతుకమ్మపం డుగను విశ్వవ్యాప్తం చేశారని మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి అన్నారు. ఎమ్మెల్యే స్వగ్రామమైన కోనాపూర్లో శనివారం సద్దుల బతుకమ్మ వేడుకలు జరిగాయి. వేడుకలకు ఎమ్మెల్యే హా జరై మహిళలతో బతుకమ్మ ఆడారు. ఎమ్మెల్యే స్వగ్రామానికి రావడంతో మహిళలు సంతోషం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే వెంట ఎంపీపీ భిక్షపతి, సర్పంచ్ చంద్రకళ, ఉపసర్పంచ్ దీపక్రెడ్డి, మాజీ ఎంపీటీసీ సంజీవరెడ్డి, నాయకులు కిష్టారెడ్డి, ఇంద్రసేనారెడ్డి, ఇమ్మానియేల్, జనార్దన్రెడ్డి, అశోక్రెడ్డి ఉన్నారు.