సంగారెడ్డికి మెట్రోరైలు, ఐటీ హబ్ తీసుకువస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ హామీ ఇచ్చారు. సోమవారం సంగారెడ్డి పట్టణంలోని తారా కాలేజీ గ్రౌండ్లో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలో ఆయన మాట్లాడారు. మియాపూర్ నుంచి ఇస్నాపూర్ వర కు మెట్రోరైలు వస్తుందని, అక్కడ నుంచి సంగారెడ్డి పట్టణానికి మెట్రోరైలు తీసుకు వస్తామన్నారు. సంగారెడ్డి నియోజవర్గంలో పెద్దఎత్తున కాలుష్యరహిత పరిశ్రమలు ఏర్పాటు చేసి స్థానిక యువతకు ఉపాధి కల్పిస్తామని భరోసా ఇచ్చారు. హైదరాబాద్కు సమీపంలో ఉన్నందున సంగారెడ్డి నియోజకవర్గానికి మంచి భవిష్యత్తు ఉందన్నారు. ఈ పట్టణ అభివృద్ధికి మరింత కృషి చేస్తామని, అవసరమైన మౌలిక వసతులు కల్పిస్తానని తెలిపారు. సంగమేశ్వర, బసవేశ్వర ఎత్తిపోతలతో జిల్లా మొత్తం సస్యశ్యామలం అవుతదన్నారు. సంగారెడ్డి అభివృద్ధి చెందాలంటే సౌమ్యుడు, ప్రజలకు అందుబాటులో ఉండే బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి చింతా ప్రభాకర్ను భారీ మెజార్టీతో గెలిపించాలని ఓటర్లకు సీఎం పిలుపునిచ్చారు.
సంగారెడ్డి నవంబర్ 27 (నమస్తే తెలంగాణ): సంగారెడ్డికి మెట్రో రైలు, ఐటీ హబ్ తీసుకువస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. సోమవారం సంగారెడ్డిలోని తారా కాలేజీ గ్రౌండ్లో ప్రజాఆశీర్వాద బహిరంగసభ నిర్వహించారు. సభకు ముఖ్యఅతిథిగా హాజరైన సీఎం కేసీఆర్ ప్రసంగిస్తూ మియాపూర్ నుంచి ఇస్నాపూర్ వరకు మెట్రో రైలు వస్తుందని, అక్కడ నుంచి సంగారెడ్డి పట్టణానికి మెట్రో రైలు తీసుకువస్తామని తెలిపారు. మెట్రో రైలుతో సంగారెడ్డి నియోజకవర్గ దశాదిశ మారుతుందని తెలిపారు. సంగారెడ్డి నియోజవర్గంలో పెద్దఎత్తున కాలుష్య రహిత పరిశ్రమలు ఏర్పాటు చేస్తామని తెలిపారు. కాలుష్యరహిత పరిశ్రమల ఏర్పాటు చేసి స్థానిక యువతకు ఉపాధి కల్పిస్తామన్నారు. సంగారెడ్డి నియోజకవర్గంలో అనేక పెద్దపెద్ద విద్యాసంస్థలు ఉన్నాయని, మరిన్ని పెద్ద విద్యాసంస్థలు తీసుకువచ్చిన సంగారెడ్డిని ఎడ్యుకేషనల్ హాబ్గా తీర్చిదిద్దుతామని సీఎం కేసీఆర్ అన్నారు. చింతా ప్రభాకర్ కోరిక మేరకు మెడికల్ కాలేజీ ఏర్పాటు చేసినట్లు వివరించారు. మెడికల్ కాలేజీతోపాటు నర్సింగ్ కాలేజీ, పారా మెడికల్ కాలేజీ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. సంగారెడ్డి ప్రాంత అభివృద్ధికి మరింత చర్యలు చేపడుతామని తెలిపారు. హైదరాబాద్కు సమీపంలో ఉన్నందున సంగారెడ్డి నియోజకవర్గానికి మంచి భవిష్యత్తు ఉందని తెలిపారు. సంగారెడ్డి పట్టణ అభివృద్ధికి మరింత కృషి చేస్తామని, అవసరమైన మౌలిళిక వసతులు కల్పిస్తామని తెలిపారు. గోదావరి జలాలు తీసుకువచ్చి సంగారెడ్డిని సస్యశ్యామలం చేస్తున్నట్లు చెప్పారు. సంగమేశ్వర ఎత్తిపోతల పథకంతో సంగారెడ్డి నియోజకవర్గంలోని రైతులకు సాగునీరు అందజేయనున్నట్లు చెప్పారు. సంగమేశ్వర, బసవేశ్వర ఎత్తిపోతల పథకంతో సంగారెడ్డి జిల్లా మొ త్తం సస్యశ్యామలం కానున్నట్లు చెప్పారు. సంగారెడ్డిలో మంచి ఎమ్మెల్యే అవసరం ఉందని, సంగారెడ్డి అభివృద్ధి చెందాలంటే సౌమ్యుడు, ప్రజలకు అందుబాటులో ఉండే బీఆర్ఎస్ ఎమ్మె ల్యే అభ్యర్థి చింతా ప్రభాకర్ను భారీ మెజార్టీతో గెలిపించాలని ఓటర్లకు పిలుపునిచ్చారు.
గత ఎన్నికల్లో చింతాను ఓడిస్తే అలగలేదు..
గత ఎన్నికల్లో చింతా ప్రభాకర్ను ఓడిస్తే నేను అలగలేదు. ఈ సారి ఎన్నికల్లో మరోమారు అలిగేటట్లు చేయవద్దని సీఎం కేసీఆర్ సంగారెడ్డి ప్రజలను కోరారు. సంగారెడ్డితో తనకు ప్రత్యేకమైన అనుబంధం ఉన్నదన్నారు. ఉమ్మడి జిల్లా బిడ్డను అయినా తనకు సంగారెడ్డి ఎంతో ప్రత్యేకమని తెలిపారు. సంగారెడ్డి పట్టణంలోని ప్రతిగల్లీలో పాదయాత్ర చేసినట్లు తెలిపారు. గతంలో తాను సంగారెడ్డిలోని నాల్సాబ్గడ్డ మొదలుకుని ప్రతి గల్లీ పాదయాత్ర చేసి పట్టణాన్ని అభివృద్ధి చేసినట్లు చెప్పారు. సంగారెడ్డిలో మంచినీటి బాధ ఎక్కువగా ఉండేదన్నారు. మిషన్భగీరథతో సంగారెడ్డితోపాటు నియోజకవర్గం అంతటా ఇంటింటికీ తాగునీరు ఇచ్చినట్లు చెప్పారు. గత ఎన్నికల్లో చింతా ప్రభాకర్ను ఓడించినా అలగకుండా తాను సంగారెడ్డి అభివృద్ధికి పెద్దఎత్తున నిధులు కేటాయించి, సంగారెడ్డిలో మెడికల్ కాలేజీ ఏర్పాటు చేసినట్లు వివరించారు. సంగారెడ్డి ఎమ్మెల్యే అభ్యర్థి చింతాప్రభాకర్
సంగారెడ్డి ప్రజలు ఓడించినా ప్రజల మద్యే ఉంటూ సేవలు చేసినట్లు చెప్పారు. కరోనా సమయంలో అందరికీ అండగా నిలిచినట్లు చెప్పారు. ప్రజలకు మేలు చేసే ప్రభాకర్ను భారీమెజార్టీతో గెలిపించాలని కోరారు. ప్రజలు బీజేపీకి ఓటు వేయవద్దని, బీజేపీకి వేసే ఓటును చింతా ప్రభాకర్కు వేయాలన్నారు. సంగారెడ్డి నియోజకవర్గం సమగ్ర అభివృద్ధి చెందాలంటే, రైతుబంధు, 24గంటల కరెంటు కొనసాగాలంటే చింతా ప్రభాకర్ను గెలిపించాలని సీఎం కేసీఆర్ ప్రజలను కోరారు.
కాంగ్రెస్ అభ్యర్థి జగ్గారెడ్డి తెలంగాణ ద్రోహి అని సీఎం కేసీఆర్ విమర్శించారు. టీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన జగ్గారెడ్డి పైసల కోసం అమ్ముడు పోయారని తెలిపారు. తెలంగాణకు ద్రోహం చేసిన జగ్గారెడ్డికి ఎలా ఓట్లు వేస్తారని ప్రజలను ప్రశ్నించారు. తాను ఇటీవలే జగ్గారెడ్డి వ్యాఖ్యలు సోషల్ మీడియా చూసి ఆశ్చర్యపోయానన్నారు. ఎన్నికల సమయం లో ఎస్పీ కారును ఢీకొట్టానని, బూత్లు క్యాప్చర్ చేశానని, దొంగ ఓట్లు గుద్దుకున్నాని జగ్గారెడ్డి చెప్పుకున్నట్లు తెలిపారు. బూత్లను క్యాప్చర్ చేసే ఎమ్మెల్యే సంగారెడ్డి నియోజకవర్గానికి కావాలా? ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉం టూ నియోజకవర్గ అభివృద్ధికి పాటుపడుతున్న బీఆర్ఎస్ అభ్యర్థి చింతా ప్రభాకర్ను గెలిపించాలని ఓటర్లను కోరారు. సమావేశంలో మంత్రి హరీశ్రావు, ఎమ్మెల్యే అభ్యర్థి చింతా ప్రభాకర్, మాజీ స్పీకర్ మధుసూదనాచారి, కార్పొరేషన్ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్, మున్సిపల్చైర్పర్సన్స్ బొంగుల విజయలక్ష్మి, వైస్చైర్పర్సన్ లతావిజయేందర్రెడ్డి, బీఆర్ఎస్ నా యకులు మామిళ్ల రాజేందర్, మాణిక్యం, కాసాల బుచ్చిరెడ్డి, నరహరిరెడ్డి, శివరాజ్పాటిల్,రాజేశ్వర్రావుదేశ్పాండే, హీకం, ముఖీమ్, బీరయ్యయాదవ్ తదితరులు పాల్గొన్నారు.
సాయంత్రం 4:50 గంటలకు సంగారెడ్డికి చేరుకున్న సీఎం కేసీఆర్ హెలిక్యాప్టర్
4:52 గంటలకు సభావేదికవైపుగా మహిళా ప్రాంగణం వద్ద సీఎం కేసీఆర్ హెలిక్యాప్టర్ ల్యాండింగ్
4:53 గంటలకు హెలిక్యాప్టర్ నుంచి దిగిన సీఎం కేసీఆర్కు స్వాగతం పలికిన డీసీసీబీ వైస్ చైర్మన్ పట్నం మాణిక్యం
4:54 గంటలకు హెలిప్యాడ్ వద్ద ఏర్పాటు చేసిన బస్సులో సభా వేదికకు బయలుదేరిన సీఎం కేసీఆర్
4:58 గంటలకు సభావేదిక వద్దకు చేరుకున్న సీఎం కేసీఆర్
5:05 గంటలకు (7 నిమిషాల తర్వాత) సభా వేదికపైకి సీఎంను స్వాగతిస్తూ తీసుకొచ్చిన టీఎస్ఎంఎస్ఐడీసీ చైర్మన్ ఎర్రొళ్ల శ్రీనివాస్
5:06 వరకు కరతాల ధ్వనులతో సీఎంకు స్వాగతం పలికిన ప్రజలు, అభివాదం చేసిన సీఎం కేసీఆర్
5:07 గంటలకు ప్రజా ఆశీర్వాద సభకు వచ్చిన ప్రజలనుద్దేశించి మాట్లాడిన మంత్రి హరీశ్రావు
5:09 గంటలకు తనను ఆశీర్వదించాలని ప్రసంగించిన బీఆర్ఎస్ అభ్యర్థి చింతా ప్రభాకర్
5:14 గంటలకు ప్రారంభమైన సీఎం కేసీఆర్ ప్రసంగం. 36 నిమిషాలపాటు మాట్లాడిన సీఎం, ప్రజల హర్షాతిరేకాలు
5:50 గంటలకు ముగిసిన సీఎం కేసీఆర్ ప్రసంగం
5:51: గంటలకు సీఎంకు మెమోంటో అందజేసిన బీఆర్ఎస్ అభ్యర్థి చింతా ప్రభాకర్, తదితర బీఆర్ఎస్ నాయకులు
5:52 గంటలకు వేదిక నుంచి హైదరాబాద్కు రోడ్డు మార్గంలో బయలుదేరిన సీఎం కేసీఆర్.