సిద్దిపేట, నవంబర్ 30 : అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా సిద్దిపేట నియోజకవర్గానికి చెందిన ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. సీఎం కేసీఆర్ దంపతులు తమ ఓటు హక్కును సిద్దిపేట రూరల్ మండలం చింతమడక ఉపయోగించుకున్నారు. మంత్రి హరీశ్రావు దంపతులు పట్టణంలోని అంబిటాస్ స్కూల్లో ఓటు హక్కును వినియోగించుకోగా, టీఎస్ ఐఐసీ చైర్మన్ గ్యాదరి బాలమల్లు అంబేద్కర్ నగర్లోని పోలింగ్ కేంద్రంలో ఓటు వేశారు.
ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ పట్టణంలోని నారాయణ స్కూల్లో ఓటు వేశారు. మున్సిపల్ చైర్పర్సన్ మంజులారాజనర్సు దంపతులు అంబిటాస్ స్కూల్లో ఓటు వేశారు. మాజీ ఎమ్మెల్సీ ఫరూక్ హుస్సేన్ న్యూజనరేషన్ కాలేజీలో ఓటు వేశారు. బీజేపీ అభ్యర్థి దూది శ్రీకాంత్రెడ్డి కృష్ణవేణి టాలెంట్ స్కూల్లో, కాంగ్రెస్ అభ్యర్థి పూజల హరికృష్ణ సెంట్ జాన్స్ హైస్కూల్లో ఓటు వేశారు.