మెదక్ రూరల్, నవంబర్5: గత పాలకులు తెలంగాణ ప్రాంతంపై నిర్లక్ష్యం చూపని రంగమంటూ లేదు. రాష్ట్ర అభ్యున్నతికి బాటలు వేసే విద్యా రంగాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేశారు. గతంలో జిల్లా చాలా చోట్ల భూత్బంగ్లాను తలపిస్తూ కనిపించే భవనాల్లోనే చిన్నారులు చదువుకునేవారు. ఎప్పుడు గోడలు కూలుతాయో.. పైకప్పు ఊడి మీద పడుతుందో తెలియని స్థితిలో విద్యార్థులు బిక్కుబిక్కు మం టూ చదువుకునేవారు. కానీ తెలంగాణ రాష్ట్రం వచ్చాక పాఠశాల విద్యకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఎర్ర తివాచీ పరిచారు. పిల్లలు బడి బాట పట్టాలంటే పాఠశాల భవంతులు చక్క గా ఉండాలన్న ఉద్దేశంతో సర్కారు బళ్లలో నమోదు, హాజరు, ఉత్తీర్ణత శాతాలను పెంచేలా ‘మన ఊరు మన బడి’కార్యక్రమాన్ని తీసుకువచ్చారు. దీంతో మెదక్ మండల పరిధిలోని ‘బాలనగర్’లోని దుతమడుగు తండా ప్రభుత్వ పాఠశాల ఎన్నో ఏళ్ల తరబడి పలు అవసరాలతో కొట్టుమిట్టాడుతున్న ఈ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలకు ‘మన ఊరు-మన బడి’పరిష్కారం చూపింది. ప్రభుత్వ నిధులతో సర్పంచ్ వికాస్ ప్రభుత్వ పాఠశాలలో సమస్యలను ‘మన ఊరు మన బడి’తో పరిష్కరించి ప్రైవేట్ పాఠశాలకు దీటుగా మరమ్మతులు చేయించి రంగులతో అందంగా తీర్చిదిద్దాడు. ఇప్పు డు ఆ పాఠశాల భవనం కొత్తగా కనిపిస్తుండంతో ముఖ్యమంత్రి కేసీఆర్కు రుణపడి ఉంటామని తండావాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
విద్యారంగంలో నాటి పాలనకు, నేటి పాలనకు చాలా తేడా కనబడుతున్నది. పల్లెప్రగతి, ‘మన ఊరు-మన బడి’కార్యక్రమంతో పేద విద్యార్థుల తల రాతలు మార్చే గొప్ప నిర్ణయం తీసుకున్నందుకు కు సీఎం కేసీఆర్కు తండా ప్రజలు కృతజ్ఞతలు తెలుపుతున్నారు. కేసీఆర్ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలలు ప్రైవేట్ దీటుగా ఆంగ్ల బోధన ప్రవేశ పెట్టడం, అల్పాహారం, మధ్యాహాన భోజనం పౌష్టికాహారం లాంటి మౌలిక వసతులు సమకూర్చడంతో పాటు విద్యార్థులకు నాణ్యమైన విద్య అందుతుంది. దీంతో విద్యార్థుల సంఖ్య పెరుగుతున్నది.
రామాయంపేట, నవంబర్ 5: సమైక్యపాలనలో నాటి ప్రభుత్వాలు నిధులను కేటాయించక నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో నాడు మారుమూల గ్రామాలకు, తండాలకు కాదు కాదా.. కనీసం పట్టణాలకు వెళ్లేందుకు కూడా సరైన రోడ్లు ఉండేవి కాదు. రామాయంపేటలోని రాజేంద్రనగర్ వైపు వెళ్లే.. వ్యాపారులు, విద్యార్థులు, ఉద్యోగస్తులతోపాటు సకల జనులు సరైన రోడ్డు మార్గాలు లేక సతమతం అయ్యేవారు. కానీ, రోజులు మారాయి. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుతో కేసీఆర్ ముఖ్యమంత్రి కావడంతో సకల సమస్యలకు పరిష్కార మార్గం దొరికింది. నాడు గుంతలమయంగా ప్రతి రోడ్డు మార్గాలను సీఎం కేసీఆర్ ప్రత్యేక నిధులు రూ. 10 లక్షల నిధులు కేటాయించి రాజేంద్రనగర్ సీసీరోడ్లు వేయించారు. నాడు సరైనరోడ్డు లేక దుమ్ము, దూళితో సతమతమైన వ్యాపారులు నేడు సీసీరోడ్లతో కళకళలాడుతున్న రోడ్లను చూస్తూ.. హాయిగా తమ దుకాణల్లో ఎలాంటి ఇబ్బందులు లేకుండావిక్రయాలు జరుపుకుంటున్నారు. గట్లుంటది మరి.. సమైక్య పాలనకు.. స్వరాష్ట్ర పాలనలో తేడా అంటు జనం చర్చించుకుంటున్నారు.