Uttarpradesh | వారిద్దరు పెద్దలను ఎదురించి 21 ఏళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు. వారి ప్రేమకు గుర్తుగా ఐదుగురు పిల్లలు జన్మించారు. సజావుగా సాగిపోతున్న వారి కుటుంబంలో ఊహించని మలుపు చోటు చేసుకుంది. కట్టుకున్న భర్త, రక్తం పంచుకుని పుట్టిన బిడ్డలను కాదనుకొని రెండు నెలల క్రితం తనకంటే 13 ఏళ్లు చిన్నవాడితో కలిసి సదరు మహిళ వెళ్లిపోయింది. ఈ సంఘటన ఉత్తర్ ప్రదేశ్లోని సంత్ కబీర్నగర్లోచోటు చేసుకుంది. అదే గ్రామానికి చెందిన యువకుడితో వెళ్లిన ఆమె తిరిగి రాగా భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది. భార్య ప్రియుడితోనే ఉంటానని పట్టుబట్టింది. ఈ నేపథ్యంలో సదరు భర్త చివరికి మూడు కుటుంబాల సమక్షంలో ప్రియుడితో భార్యకు పెళ్లి చేసి(Woman elopes with lover) సంతోషంగా సాగనంపాడు. ఇప్పుడు ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
భార్యకు ప్రియుడితో పెళ్లి చేసి పంపిన భర్త
యూపీలోని సంత్ కబీర్నగర్లో ఘటన
21 ఏళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్న ఓ జంటకు ఐదుగురు పిల్లలు ఉండగా.. అదే గ్రామానికి చెందిన తనకంటే 13 ఏళ్లు చిన్నవాడితో కలిసి రెండు నెలల క్రితం వెళ్లిపోయిన భార్య
ఇటీవల తిరిగి రాగా భార్యాభర్తల మధ్య గొడవ… pic.twitter.com/DQ993LUttM
— Telugu Scribe (@TeluguScribe) August 6, 2026