మెదక్ మున్సిపాలిటీ, డిసెంబర్ 22: ఏసుక్రీస్తు జన్మదినం సందర్భంగా క్రైస్తవులు అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకొనే క్రిస్మస్ వేడుకకు మెదక్ చర్చి ముస్తాబవుతున్నది. ఆదివారం నిర్వహించనున్న వేడుకల్లో పాల్గొనేందుకు తెలంగాణతో పాటు వివిధ రాష్ర్టాల నుంచి వేలాదిగా భక్తులు తరలిరానుండడంతో అందుకు కావాల్సిన ఏర్పాట్లు చేస్తున్నారు.
తినుబండారాలు, దుస్తులు, ఆటవస్తువులతో పాటు పలురకాల దుకాణాలు వెలిశాయి. మరోపక్క రంగుల రాట్నాలు, బైక్లు, చిన్నచిన్న రైళ్లు చిన్న పిల్లలకు కనువిందు చేయనున్నాయి. చర్చి ప్రాంగణంలో ఏర్పాటు చేసిన శాంతాక్లాజ్ బొమ్మ ఆకట్టుకుంటున్నది.