సంగారెడ్డి, జూన్ 22 (నమస్తే తెలంగాణ) : ముఖ్యమంత్రి కేసీఆర్కు సంగారెడ్డి జిల్లా మొత్తం తెలుసని, మంత్రి హోదాలో పటాన్చెరులో గల్లీగల్లీ తిరిగారని ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. పటాన్చెరులో రూ.200 కోట్లతో నిర్మించే సూపర్ స్పెషాలిటీ దవాఖానకు గురువారం ముఖ్యమంత్రి కేసీఆర్ శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో మంత్రి హరీశ్రావు, ఎమ్మెల్యే మహిపాల్రెడ్డి, జిల్లా ఎం పీలు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మంత్రి మాట్లాడుతూ సంగారెడ్డి జిల్లాను అన్నిరంగాల్లో అభివృద్ధి చేస్తున్న ఘనత సీఎం కేసీఆర్ది అన్నారు. సీఎం కేసీఆర్ ప్రత్యేక చొరవ కారణంగానే పటాన్చెరులో రూ.200 కోట్లతో సూపర్ స్పెషాలిటీ దవాఖాన ఏర్పాటు అవుతున్నదన్నారు. ఏడాది కాలంలో సూపర్ స్పెషాలిటీ దవాఖాన నిర్మాణా న్ని పూర్తి చేసి ప్రజలకు వైద్యసేవలు అందుబాటులోకి తెస్తామని మంత్రి హరీశ్రావు స్పష్టం చేశారు. జిల్లాలో మంజీరా నది ఉన్నా తాగునీరు హైదరాబాద్కు వెళ్లేదని, ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఇతర పార్టీ నాయకులు మంజీరా నీళ్లు జిల్లాకు దక్కాలని నినాదాలు చేసేవారన్నారు. అధికారంలోకి వచ్చాక మంజీరా నీటి గురించి మర్చిపోయేవారన్నారు.
సీఎం కేసీఆర్ అధికారంలోకి వచ్చాక మం జీరా జలాలు పూర్తిగా జిల్లా అవసరాలకు కేటాయించినట్లు చెప్పారు. సంగారెడ్డికి రూ.510 కోట్లతో మెడికల్ కాలేజీ, నర్సింగ్ కాలేజీలు ఇచ్చినట్లు తెలిపారు. సంగారెడ్డి విద్య, వైద్యరంగంలో అభివృద్ధి చెందుతున్నట్లు మంత్రి హరీశ్రావు తెలిపారు. దేశంలో మొట్టమొదటి రెసిడెన్షియల్ లా కాలేజీ సంగారెడ్డిలో ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అందోలు నియోజకవర్గంలో 40వేల ఎకరాలకు సింగూరు ద్వారా సాగునీరు ఇస్తున్నట్లు చెప్పారు. సంగమేశ్వర, బసవేశ్వర లిప్టుల ద్వారా 4లక్షల ఎకరాలకు సాగునీరు అందనున్నట్లు చెప్పారు.
జిల్లాలో కొత్తగా 9 మండలాలు, ఐదు మున్సిపాలిటీలను ఏర్పాటు చేశారన్నారు. పటాన్చెరుకు సబ్ రిజిస్ట్రార్ ఆఫీసు మంజూరు చేశారన్నారు. నిమ్జ్, మెడికల్ డివైజ్ పార్కు, ఎల్ఈడీ పార్కుల ద్వారా పరిశ్రమల్లో యువతకు పెద్దఎత్తున ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తున్నటు చెప్పారు.ప్రభుత్వ దవాఖానల్లో ప్రసవాల్లో సంగారెడ్డి జిల్లా రాష్ట్రంలోనే అగ్రస్థానంలో ఉన్నట్లు తెలిపారు. 82శాతం ప్రసవాలు ప్రభుత్వ దవాఖానల్లో జరుగుతున్నట్లు చెప్పారు. పటాన్చెరు నియోజకవర్గంలో 11 బస్తీ దవాఖానలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
పటాన్చెరులోని పారిశ్రామికవాడ ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని రూ.184 కోట్లతో 200 పడకల సూపర్ స్పెషాలిటీ దవాఖానను మం జూరు చేసినందుకు సీఎంకు ధన్యవాదాలు. ఇం దుకు పటాన్చెరు ప్రజల తరఫున శిరస్సు వంచి కృతజ్ఞతలు చెబుతున్నా. దశాబ్దాల కాలుష్యం నుంచి ప్రజలను కాపాడేందుకు సీఎం కేసీఆర్ తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలు ఇస్తున్నాయి. సీఎంకు పటాన్చెరులోని ప్రతి గల్లీ తెలుసు. పటాన్చెరులో పరిశ్రమలు ఉండడంతో లక్షలాది మంది ఉపాధికోసం వస్తున్నారు. పటాన్చెరు నియోజకవర్గంలో నూతనంగా అనేక కాలనీలు ఏర్పాటు అవుతున్నాయి. వాటికి మౌలిక వసతులు కల్పించడం అత్యవసరం. ఉస్మాన్నగర్, కొల్లూరులో ఐటీ పరిశ్రమలు ఏర్పాటు చేస్తే స్థానిక నిరుద్యోగులకు ఉపాధి లభిస్తుంది. మూడు మున్సిపాలిటీలు ఏర్పాటు చేశారు. వాటిలో కొత్త కాలనీలు వస్తున్నాయి. శివనగర్ ఎల్ఈడీ పార్కు, సుల్తాన్పూర్ మెడికల్ డివైజ్ పార్కు లు కాలుష్య రహితం. కొన్నేండ్లల్లోనే పదిహేను వేల మందికి ఉపాధి లభించింది. పరిశ్రమలకు నాణ్యమైన విద్యుత్ కల్పించడంతో పారిశ్రామిక వాడల్లో అందరికీ ఉపాధి లభిస్తున్నది. మంత్రులు హరీశ్రావు, కేటీఆర్ పటాన్చెరు అభివృద్ధికి పూర్తిగా సహకారం అందిస్తున్నారు. మంత్రి హరీశ్రావు సిద్దిపేటతో సమానంగా పటాన్చెరు అభివృద్ధికి అండగా నిలుస్తున్నారు. అందరి సహకారంతో పటాన్చెరును అన్ని రంగాల్లో అభివృద్ధి చేసుకుంటున్నాం.
ముఖ్యమంత్రి చంద్రశేఖర్రావు పటాన్చెరు పర్యటన సందడిగా సాగింది. సూపర్ స్పెషాలిటీ దవాఖాన శంకుస్థాపన చేసిన సీఎం బహిరంగ సభలో ప్రసంగించారు. సీఎం సభకు నియోజకవర్గం నలుమూలల నుంచి బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు భారీగా తరలివచ్చారు.