కోహీర్, సెప్టెంబర్14: పేదల సంక్షేమానికి సీఎం కేసీఆర్ అనేక పథకాలను అమ లు చేస్తున్నారని ఎమ్మెల్యే కొనింటి మాణిక్రావు అన్నారు. గురువారం మండలంలోని బిలాల్పూర్ గ్రామ వార్డు సభ్యురాలు శ్యామలమ్మతోపాటు కాంగ్రెస్ కార్యకర్తలు భారీ సంఖ్యలో బీఆర్ఎస్లో చేరా రు. వారికి ఎమ్మెల్యే మాణిక్రావు గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గత ప్రభుత్వాలు కల్యాణలక్ష్మి, షాదీముబారక్, తదితర పథకాలను ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. రైతులకు ఎరువులు, విత్తనాలు పోలీస్స్టేషన్లో ఇచ్చేవారని గుర్తు చేశారు. గతంలో ఎలాంటి అభివృద్ధి చేయని వాళ్లు ఇప్పుడు ఏ ముఖం పెట్టుకొని ఓట్ల కోసం వస్తున్నారని ప్రశ్నించారు. ఊసరవెళ్లిలా రంగులు, పార్టీలు మారే నాయకులకు వచ్చే ఎన్నికల్లో ఓట్లు వేయొద్దని సూచించారు.
వేరే ప్రాంతానికి చెందిన వ్యక్తి ఇక్కడకు వచ్చి తాను స్థానికుడినేనని అంటున్నారని ఎద్దేవా చేశారు. రూ.1.70కోట్ల వ్యయంతో బిలాల్పూర్ గ్రామాన్ని అభివృద్ధి చేశామని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో తనతోపాటు సీఎం కేసీఆర్ను మరోసారి ఆశీర్వదించాలన్నారు. రాష్ట్ర పరిశ్రమల అభివృద్ధి సంస్థ చైర్మన్ తన్వీర్, ఆత్మ కమిటీ చైర్మన్ పెంటారెడ్డి, సర్పంచ్లు నర్సింహులు, రవికిరణ్, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు కోహీర్ నర్సింహులు, మాజీ అధ్యక్షుడు సురేందర్రెడ్డి, మాజీ యువత అధ్యక్షుడు నాగరాజు, గ్రా మ కమిటీ అధ్యక్షుడు భక్షు పటేల్, ఆత్మ కమిటీ మాజీ చైర్మన్ రామకృష్ణారెడ్డి, విఠల్రెడ్డి, సుభాశ్రెడ్డి, సునీల్, రత్నం, వినో ద్, సంపత్కుమార్, ఆనంద్ ఉన్నారు.