కొల్చారం/చిలిపిచెడ్/నర్సాపూర్, నవంబర్ 26: నర్సాపూర్లో ఆదివారం నిర్వహించిన మంత్రి కేటీఆర్ రోడ్ షోకు కొల్చారం మండల వ్యాప్తంగా పలు గ్రామాల నుంచి పెద్ద ఎత్తున బీఆర్ఎస్ శ్రేణులు తరలివెళ్లారు. పలు గ్రామాల నుంచి బీఆర్ఎస్ శ్రేణులు మోటార్ సైకిళ్లు, డీసీఎంల్లో తరలివెళ్లారు. కొల్చారం నుంచి సర్పంచ్ కరెంటు ఉమ, ఎంపీటీసీ పల్వంచ అరుణ, బీఆర్ఎస్ నాయకుడు ముత్యం ప్రవీణ్కుమార్ ఆధ్వర్యంలో తరలివెళ్లారు. తుక్కాపూర్ నుంచి సర్పంచ్ మాధవీశ్రీశైలం, ఆత్మ డైరెక్టర్ దొడ్ల ఆంజనేయులు, కోనాపూర్ నుంచి మండల బీఆర్ఎస్ యువత అధ్యక్షుడు సంతోశ్రావు, మాజీ సర్పంచ్ మల్లే శం, చిన్నాఘన్పూర్ నుంచి సీడీసీ మాజీ డైరెక్టర్ నరేందర్రెడ్డి, బాగారెడ్డి, పిల్లెల రాజాగౌడ్, సోమ నర్సింహులు, అంసాన్పల్లిలో సర్పంచ్ మన్నె శ్రీనివాస్, సొసైటీ చైర్మన్ మన్నె రాములు, డీసీఎంఎస్ మాజీ వైస్ చైర్మన్ ఇంద్రసేనారెడ్డి, ఎనగండ్ల నుంచి ఎంపీపీ మంజుల, సర్పంచ్ వీరారెడ్డి, పైతర నుంచి రవితేజరెడ్డి, సర్పంచ్ సంతోష, ఎంపీటీసీ ఎల్లయ్య, కిష్టాపూర్నుంచి సర్పంచ గోదావరి, బీఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షుడు రవి, నాయకులు నాగరాజు, అప్పాజిపల్లి నుంచి సర్పంచ్ చలం ఝాన్సీరాణి యాదగిరి, మండల గౌడ సంఘం అధ్యక్షుడు వెంకట్గౌడ్, ఏటిగడ్డమాందాపూర్ నుంచి సర్పంచ్ విష్ణువర్ధన్రెడ్డి ఆధ్వర్యంలో భారీగా తరలివెళ్లారు.
* నర్సాపూర్ పట్టణంలో నిర్వహించిన రాష్ట్ర మంత్రి కేటీఆర్ రోడ్ షో, సభకు చిలిపిచెడ్ మండలం నుంచి భారీ సంఖ్యలో బీఆర్ఎస్ శ్రేణులు తరలివెళ్లారు. మండలంలోని అజ్జమర్రి, చిలిపిచెడ్, చండూర్, సోమక్కపేట, చిట్కుల్ ఆయా గ్రామాల్లో పెద్ద ఎత్తున్న బైక్ ర్యాలీతో బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు అశోక్రెడ్డి ఆధ్వర్యంలో తరలివెళ్లారు. కార్యక్రమంలో ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు తరలివెళ్లారు.
* నర్సాపూర్ మున్సిపాలిటీతోపాటు మండలంలోని ఆయా గ్రామాల నుంచి బీఆర్ఎస్ కార్యకర్తలు, ప్రజలు పెద్ద సంఖ్యలో మంత్రి కేటీఆర్ పాల్గొన్న రోడ్ షోకు తరలివెళ్లారు. నర్సాపూర్ మండలంలోని ఆయా గ్రామాల నుంచి ప్రజలు పెద్ద సంఖ్యలో రోడ్ షోకి తరలివచ్చారు. కార్యక్రమంలో ముఖ్యనాయకులు, సర్పంచులు, ఎంపీటీసీలు, బీఆర్ఎస్ శ్రేణులు పాల్గొన్నారు.