కేసీఆర్తోనే బంగారు భవిష్యత్
సీఎం కేసీఆర్తో దేశంలోని మైనార్టీలకు మంచి భవిష్యత్ ఉంటుందని, అందుకు అందరూ బీఆర్ఎస్ను స్వాగతిస్తున్నారు. మోదీ పాలనలో మైనార్టీలపై వివక్షత చూపిస్తున్నారు. సీఎం కేసీఆర్ తెలంగాణలో మైనార్టీల సంక్షేమం కోసం అమలు చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను దేశవ్యాప్తంగా ప్రతి ఒక్కరూ స్వాగతిస్తున్నారు. నేడు టీఆర్ఎస్ను విస్తరించి బీఆర్ఎస్ పార్టీగా ఏర్పాటు చేయడంపై అన్ని వర్గాల ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. త్వరలోనే దేశంలో మరో ప్రభంజనం రావడం ఖాయం. కేసీఆర్తోనే బంగారు భవిష్యత్ ఉంటుందని దేశప్రజలు అంటున్నారు. కేసీఆర్ అనుకున్న గమ్యానికి చేరుకునే వరకు నిద్రపోరు.
– నవాజ్మీరా, టీఆర్ఎస్ (బీఆర్ఎస్)
గజ్వేల్ పట్టణ అధ్యక్షుడు
ప్రజలందరికీ లబ్ధి
సీఎం కేసీఆర్ ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ పార్టీ ద్వారా ప్రజలందరికీ లబ్ధి చేకూరడం ఖాయం. ఆయన ముందస్తు ఆలోచనల వల్ల రాష్ట్రంలో అనేక రంగాల్లో అభివృద్ధి చెందింది. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం అనేది ప్రపంచ గుర్తింపు పొందింది. సాగు, తాగునీటి కల్పనలో రాష్ట్రం ముందంజలో ఉంది. పంటలు పండించి దేశ ప్రజలకు అన్నం పెడుతున్న రైతులపై సీఎం కేసీఆర్కు ప్రత్యేక ప్రేమ ఉన్నది. ఇది గుర్తించిన దేశంలోని రైతులందరూ సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి రావాలని ఆశించారు. దేశంలోని ప్రజల ఆకాంక్షలను నెరవేర్చేందుకే సీఎం కేసీఆర్ బీఆర్ఎస్పార్టీని స్థాపించారు. సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో తెలంగాణ మరింత అభివృద్ధి సాధిస్తుందనే నమ్మకం ప్రజలకు ఉంది. బీఆర్ఎస్ దేశం మొత్తంలో ఆదరణ పొందాలని ఆశిస్తున్నా.
– చంద్రయ్య, మున్సిపల్ మాజీ చైర్మన్, హుస్నాబాద్
తెలంగాణ తరహా అభివృద్ధి
సీఎం కేసీఆర్ టీఆర్ఎస్ (బీఆర్ఎస్పార్టీగా)ను విస్తరించడం శుభపరిణామం. తెలంగాణలో అమలవుతున్న సంక్షమ పథకాలు దేశంలో ఎక్కడా అమలు కావడంలేదు. పీఎం , కేంద్రమంత్రులు కూడా కేసీఆర్ పాలనపై కితాబిచ్చారు. ప్రధాన మంత్రి మోదీ సొంత రాష్ట్రంలో కూడా అమలు కాని పథకాలు తెలంగాణలో అమలవుతున్నాయి. విజన్ ఉన్న నాయకుడు కేసీఆర్ అన్నమాట నిలబెట్టుకుంటాడు. దేశరాజకీయాలను ప్రభావితం చేస్తాడు. తెలంగాణ తరహా పాలనను దేశమంతా చేసి చూపుతాడు.
– ఎల్కంటి సంతోష, సర్పంచుల ఫోరం అధ్యక్షురాలు, వర్గల్ మండలం
దేశానికి కేసీఆర్ విజన్ అవసరం
భారతదేశానికి స్వాతం త్య్రం వచ్చి 75 ఏండ్లు దాటినా ‘ఎక్కడ వేసిన గొంగడి అక్కడే’ అన్న చందంగా మారింది. ముఖ్యమంత్రి కేసీఆర్ విజన్ దేశానికి చాలా అవసరం. కేంద్రం రాష్ర్టాల హక్కులను హరించడంతో పాటు అభివృద్ధికి ఆటంకం కలిగిస్తోంది. కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ఇప్పటికే అనేక సంస్థలను పెద్ద పారిశ్రామికవేత్తల చేతుల్లో పెట్టింది. కేసీఆర్ ప్రధాన మంత్రి అయితే ఆయనకు ఉన్న అనుభవంతో భారతదేశం రానున్న రోజుల్లో సూపర్గా మారడం ఖాయం. కేంద్రం మెడలు వంచి తెలంగాణ రాష్ర్టాన్ని సాధించిన కేసీఆర్ దేశాన్ని అభివృద్ధిలో ముందు వరుసలో ఉంచుతారనే నమ్మకం ఉంది.
– రమేశ్, సర్పంచ్, పందిల్ల, హుస్నాబాద్ మండలం
కాబోయే పీఎం కేసీఆర్
దేశరాజకీయాల్లో సత్తా చాటడానికి సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీని ఏర్పాటు చేశారు. అన్ని రాష్ర్టాల్లోని పార్టీలు, ప్రజలు దీనిని స్వాగతిస్తున్నారు. ఇప్పటి వరకు ఉత్తర భారత దేశానికి చెందినవారే ప్రధానమంత్రులవుతు న్నారు. దక్షిణ ప్రాంతం వారిని అన్ని రంగాల్లో చిన్నచూపు చూస్తున్నారు. దేశాన్ని అభివృద్ధి చేయడానికి, అన్ని వర్గాల వారికి ఉపాధి కల్పించేందుకు, తెలంగాణలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను దేశ ప్రజలకు చేరవేయాలన్న పట్టుదలతో సీఎం కేసీఆర్ దసరా పండుగరోజు బీఆర్ఎస్పార్టీకి శ్రీకారం చుట్టారు. బీఆర్ఎస్తో విజయం సాధిస్తారన్న విశ్వాసం రాష్ట్ర ప్రజలకు ఉంది.
– సద్ది విజయభాస్కర్రెడ్డి, టీఆర్ఎస్ (బీఆర్ఎస్)
జిల్లా నాయకుడు, గుమ్మడిదల మండలం
పేదలు, రైతుల పక్షపాతి
పేదలు, రైతుల పక్షపాతి సీఎం కేసీఆర్. అనేక సార్లు ఎమ్మెల్యేగా, ఎంపీగా గెలిచారు. నీళ్లు, నిధులు, నియామకాల పేరుతో తెలంగాణ రాష్ర్టాన్ని సాధించి ప్రజల కష్టాలు తీర్చిండు. తెలంగాణ ప్రజలకు దేవుడయ్యాడు. ఇప్పుడు దేశ ప్రజల గోస చూస్తండు. ప్రజల కష్టాలు తీర్చేందుకు భారత్ రాష్ట్ర సమితి పెట్టాడు. పార్టీకి ప్రజల మద్దతు వస్తున్నది. ఇప్పటికే ప్రతిపక్షాల మద్దతు ఇచ్చాయి.దేశ రాజకీయాల్లో ఉన్న ప్రతిపక్ష పార్టీలు కలిసి వస్తున్నాయి. దేశంలో బీఆర్ఎస్ విజయం ఖాయం. జై కేసీఆర్.. జై బీఆర్ఎస్.
–కొక్కుల కీర్తి, ఎంపీపీ, కోహెడ
ప్రతిఒక్కరూ స్వాగతిస్తున్నారు
సీఎం కేసీఆర్ ఎన్నో పోరాటాలు చేసి అసాధ్య ం అనుకున్న తెలంగాణ రాష్ర్టాన్ని సాధించి, ఎనిమి దేండ్లలో ఎంతో అభివృద్ధి చేశారు. పేద రైతులకు రైతుబంధు అందజేసి లక్షలాది మంది వరిసాగు చేస్తూ రాష్ర్టాన్ని ధాన్యాగారంగా మార్చారు. ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టారు. మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికీ నీళ్లు అందించారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా అభివృద్ధి చేస్తున్నారు. జాతీ య రాజకీయాల్లోకి వస్తున్న బీఆర్ఎస్ పార్టీని దేశం లోని ప్రతి ఒక్కరూ స్వాగతిస్తున్నారు. సీఎం కేసీఆర్ ప్రధాని అయితే బడుగు, బలహీన వర్గాల ప్రజలకు వందశాతం న్యాయం జరుగడం ఖాయం.
– మార్గం ఆంజనేయులు, వైస్ఎంపీపీ, మెదక్
బీఆర్ఎస్తోనే సుస్థిర పాలన
దేశంలో సుస్థిర పాలన అవసరం ఎంతైనా ఉంది. అన్ని రాష్ర్టాల్లో ప్రతి నిరుపేదకు ప్రభుత్వ పథకాలు అందాలంటే సీఎం కేసీఆర్ వంటి నాయకుడు కావాలని ప్రజలు కోరుకుంటున్నారు. రాష్ట్రంలో పేదల సంక్షేమమే లక్ష్యంగా రైతుబంధు, రైతుబీమా, ఉచిత విద్యుత్, తాగు, సాగునీరు, కల్యాణలక్ష్మి వంటి ఎన్నో పథకాలను సీఎం కేసీఆర్ అమలు చేస్తున్నారు. దీంతో అట్టడుగు ప్రజల జీవన శైలి పూర్తిగా మారిపోయి ఆర్థికంగా, సామాజికంగా ఎంతో ఉన్నతస్థానాలకు చేరారు. తెలం గాణలో అమలవుతున్న పథకాలు దేశంలోని అన్ని రాష్ర్టాల్లో అమలు కావాలంటే బీఆర్ఎస్ పార్టీ అధికా రంలోకి రావాలి.
– చిందం సబిత, ఎంపీపీ, నార్సింగి
సీఎం కేసీఆర్ నాయకత్వం అవసరం
ప్రస్తుత పరిస్థితుల్లో సీఎం కేసీఆర్ నాయకత్వం దేశానికి అవసరం. తెలంగాణ అన్ని రంగాల్లో అభివృద్ధి చేసిన సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి రావడం శుభపరిణామం. దేశానికి సీఎం కేసీఆర్ దిక్సూచి. ఇప్పుడు జాతీయ పార్టీ బీఆర్ఎస్తో దేశ ప్రజలకు మేలు జరగడం ఖాయం. కేసీఆర్ దేశానికి నాయకత్వం వహిస్తే భారతదేశ రూపురేఖలే మారిపోతాయి. తెలంగాణలో ఏ విధంగా అభివృద్ధి జరిగిందో కేసీఆర్ దేశానికి నాయకత్వం వహిస్తే అదే విధంగా అభివృద్ధి చెందడం తథ్యం.
– మెరుగు కృష్ణాగౌడ్, కొమురవెల్లి మండల గౌడసంఘం అధ్యక్షుడు
బీఆర్ఎస్తో దేశానికి మంచిరోజులు
అందరికీ మంచి చేసే నాయకుడినే ప్రజలు ఆదరిస్తారు. తెలంగాణలో సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలే ఇందుకు నిదర్శనం. బడుగు, బలహీన వర్గాలకు ఆయన ప్రవేశపెట్టిన పథకాలే శ్రీరామరక్ష. దేశ ప్రజలు మెచ్చే నాయకుడిగా సీఎం కేసీఆర్ నిలుస్తారు. దేశాన్ని ప్రగతిపథం వైపు నడిపించాలన్నా, అన్ని వర్గాల ప్రజలకు న్యాయం జరగాలన్నా సీఎం కేసీఆర్ స్థాపించిన బీఆర్ఎస్ పార్టీతోనే సాధ్యమవుతుంది తప్ప వేరే ప్రత్యామ్నాయం లేదు. బీఆర్ఎస్తోనే దేశానికి మంచిరోజులు వస్తాయి.
– గుండ్ల సుజాత మహేందర్రెడ్డి
(కౌన్సిలర్ బొల్లారం)