సిద్దిపేట, అక్టోబర్ 10:ప్రభుత్వ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ సీట్లు సాధించి ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కుంటున్న ఇద్దరు వైద్య విద్యార్థులకు మాజీమం త్రి ఎమ్మెల్యే హరీశ్రావు బాసటగా నిలిచారు. సిద్దిపేట మున్సిపల్ పరిధిలోని నర్సాపురానికి చెందిన కొంక శారద-రామచంద్రం దంపతులకు నలుగు రు కూతుళ్లు ఎంబీబీఎస్ సీట్లు సాధించడంపై ఎమ్మె ల్యే హరీశ్రావు సంతోషం వ్యక్తం చేస్తూ విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు అభినందనలు తెలిపారు.
దర్జీ పనిచేస్తూ నలుగురు కూతుళ్లను చదివించడం తో కుమార్తెలు అమ్మానాన్నల కలలను సాకారం చేస్తూ ఎంబీబీఎస్ సీట్లు సాధించారు. వీరిలో పెద్ద కుమార్తె మమత 2018 ఎంబీబీఎస్ ప్రవేశం పొం ది డాక్టర్ చదువును పూర్తి చేసుకుంది. రెండో కుమార్తె మాధవి 2020లో ఎంబీబీఎస్లో చల్మెడ ఆనందరావు మెడికల్ కాలేజీలో చదువుతుంది. ఈ సంవత్సరం మరో ఇద్దరు రోహి ణి, రోషిణి జగిత్యా ల ప్రభుత్వ మెడికల్ కాలేజీలోఎంబీబీఎస్ సీట్లు సాధించారు.
ఆ విద్యార్థులకు ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయని తెలుపడంతో ఎమ్మెల్యే హరీశ్రావు రూ.50వేలు సహాయం అందించి వారిలో నేనున్నాని భరోసా నిచ్చారు. అనంతరం ఎమ్మెల్యే హరీశ్రావు మాట్లాడుతూ కేసీఆర్ జిల్లాకో మెడికల్ కా లేజీని ఏర్పాటు చేయడం వల్ల అనేకమంది తెలంగాణ బిడ్డలు ఇక్కడే ఎంబీబీఎస్ పూర్తి చేస్తున్నారన్నారు. తెల్లకోటు విప్లవంతో పేద విద్యార్థులు వైద్య విద్య కలను సాకారం చేసుకుంటున్నారని చెప్పా రు. కేవలం రూ.10 వేల ఫీజులో డాక్టర్ చదువులు చదవగలుగుతున్నారన్నారు.
సిద్దిపేట తన కుటుంబం అనే మాటను హరీశ్రావు నోట ఎప్పుడూ వింటుంటాం..కానీ నేడు ప్రత్యక్షంగా చూశామని విద్యార్థులు తల్లిదండ్రులు చెప్పా రు. సిద్దిపేట కుటుంబ పెద్ద మాకు అండగా నిలిచారన్నారు. ఎంబీబీఎస్ సీట్లు వచ్చాయని సంతో షం పంచుకుందామని వచ్చామన్నారు. కానీ మా ఆర్థిక పరిస్థితి తెలుసుకొని మాకు సహాయం అం దించిన హరీశ్రావుకు కృతజ్ఞతలు తెలిపారు. ఎల్లప్పుడు రుణపడి ఉంటామన్నారు.
విద్య విషయంలో ఎప్పుడూ ముందు వరుసలో ఉంటానని హరీశ్రావు మరోసారి చాటి చెప్పారు. గతంలోనూ ఇద్దరు మెడిసిన్, ముగ్గురు నర్సింగ్ విద్యార్థులకు ఆర్థిక చేయూతను అందించారు. నేడు హరీశ్రావు మరోసారి విద్యార్థులకు ఆర్థికం గా, అండగా నిలిచి మానవత్వాన్ని చాటుకున్నారు.