చిన్నశంకరంపేట, ఏప్రిల్ 28: మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్కు పార్లమెంట్ ఎన్నికల్లో సరైన బుద్ధి చెప్పాలని మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీశ్రావు పిలుపునిచ్చారు. ఆదివారం చిన్నశంకరంపేటలో ఐబీ నుంచి స్థానిక బస్టాండ్ వద్ద ఏర్పాటు చేసిన కార్నర్ మీటింగ్లో మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు మాట్లాడుతూ రూ.4 వేల పింఛన్ను కాంగ్రెస్ అటకెక్కించిందన్నారు. రూ. 2వేల పింఛన్ వచ్చే వారంతా బీఆర్ఎస్ కారు గుర్తుకు ఓటేయాలని సూచించారు. వంద రోజుల్లో 6 గ్యారెంటీలు అమలుచేస్తామన్న సీఎం రేవంత్రెడ్డి 150 రోజులు గడుస్తున్నా ఏమీ చేయడం లేదని, కల్యాణలక్ష్మి పథకంలో రూ.లక్ష, తులం బంగారం అన్నాడు ఏమైందని ప్రశ్నించారు. రైతులకు రూ. 500 బోనస్ ఇస్తామని బోగస్ మాటలు చెప్పాడన్నారు. మహిళలకు నెలకు రూ.2500 ఇస్తామని ఎందుకు ఇవ్వడం లేదన్నారు.
కేంద్రంలోని బీజేపీ తెలంగాణకు చేసిందేమీ లేదన్నారు. గ్యాస్, పెట్రో ధరలు పెంచిందే తప్పా, ఒరగబెట్టిందేమీ లేదన్నారు. జీఎస్టీ పేరుతో నిత్యావసరాల ధరలు పెంచి సామాన్యుల నడ్డి విరిచిందన్నారు. బీఆర్ఎస్ కారు గుర్తుకు ఓటేసి వెంకట్రామిరెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు ఏడుపాయల అభివృద్ధికి రూ.100 కోట్లు కేటాయిస్తే ఆ నిధులను కాంగ్రెస్ రద్దు చేసిందని పార్టీ జిల్లా అధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి ఆరోపించారు. జిల్లాకు కేటాయించిన 50 కోట్ల నిధులు కూడా ఎందుకు రద్దు చేశారని ప్రశ్నించారు. ఇప్పటికైనా ఆలోచించి కారు గుర్తుకు ఓటేసి వెంకట్రామిరెడ్డిని అధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు దేవేందర్రెడ్డి, ఏకే గంగాధర్రావు, తిరుపతిరెడ్డి, జడ్పీటీసీ మాధవి, పార్టీ మండలాధ్యక్షుడు రాజు, వైస్ ఎంపీపీ సత్యనారాయణగౌడ్, ఎంపీటీసీలు రాణమ్మ, సక్కుబాయి, సునీత, నాయకులు కుమార్గౌడ్, యాదగిరి యాదవ్, లక్ష్మణ్, ప్రభాకర్, హేమచంద్రం, స్వామి, సుధాకర్ పాల్గొన్నారు.