సిద్దిపేట, ఫిబ్రవరి 7: ‘బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్రావుపై వ్యక్తిగత విమర్శలు చేస్తే సహించేది లేదని, మైనంపల్లి హన్మంతరావు ఒళ్లు దగ్గర పెట్టుకొని మాట్లాడాలని బీఆర్ఎస్ సీనియర్ నాయకులు పాల సాయిరామ్, మచ్చ వేణుగోపాల్రెడ్డి, మెరుగు మహేశ్, నిమ్మ రజినీకాంత్రెడ్డి, ప్రభాకర్రెడ్డి హెచ్చరించారు. సిద్దిపేటలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బుధవారం విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. మైనంపల్లి అంటేనే ఒక బ్రాండ్ అని గొప్పలు చెప్పుకుంటున్న హన్మంతరావు వాస్తవానికి ఒక పెద్ద గుండా అని, ఏ హోదాలో సిద్దిపేటలో పర్యటించారని ప్రశ్నించారు. మలాజిగిరిలో ప్రజలు కర్రుకాల్చి వాత పెట్టారని గుర్తుచేశారు. రాజకీయాల్లో రౌడీయిజం పనికి రాదని, మంగళవారం సిద్దిపేటకు ఎందుకు వచ్చారు, ఎందుకు వెళ్లారో కాంగ్రెస్ నాయకులకే తెలియని పరిస్థితి ఉందని ఎద్దేవా చేశారు. క్రమశిక్షణకు మారుపేరు బీఆర్ఎస్ అని, మీలాగా గుండాయిజం చేసే నాయకులు మా పార్టీలో లేరన్నారు. ప్రభుత్వం తరఫున వస్తే సిద్దిపేటలో అభివృద్ధికి నిధులు కేటాయిస్తారేమో అనుకున్నామని, అవేమీ చెప్పకుండానే వ్యక్తిగత విమర్శలు చేసి రాజకీయ లబ్ధి పొందాలని చూడడం సిగ్గు చేటన్నారు.
నిత్యం 18 గంటలు ప్రజాక్షేత్రంలో తిరిగే గొప్ప నాయకుడు హరీశ్రావుపై వ్యక్తిగతంగా విమర్శలు చేస్తే సహించే లేదని, మళ్లీ ఇలాంటి వ్యాఖ్యలు చేసేముందు ఒళ్లు దగ్గర పెట్టుకొని మాట్లాడాలని హెచ్చరించారు. పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలపై దాడులు చేశామా అని ప్రశ్నించారు. హైదరాబాద్ గుండా మైనంపల్లి సిద్దిపేటకు వచ్చి ఇకడ అభద్రతా భావాన్ని సృష్టించేలా మాట్లాడడం సిగ్గుచేటన్నారు. బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్పై అనాలోచిత, అవాస్తవ వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. కేటీఆర్కు ఏమి తెలియదన్నప్పుడు గతంలో అతడి కాళ్లు ఎందుకు మొక్కావంటూ ప్రశ్నించారు. హన్మంతరావు బెదిరింపులకు బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు భయపడేదిలేదన్నారు. బీఆర్ఎస్ నాయకుడు, ఫుట్బాల్ కోచ్ అక్బర్ నవాబ్పై దాడి పిరికిపంద చర్య అన్నారు. సిద్దిపేట అభివృద్ధిని చూసేందుకు రెండు రోజులు సరిపోవని, వారం రోజులు ఇక్కడ ఉంటే తెలుస్తుందన్నారు. సమావేశంలో కౌన్సిలర్ వజీర్, బీఆర్ఎస్ నాయకులు మోయిజ్, అక్బర్ నవాబ్, రెబల్ రమేశ్, పెర మధు, శ్యామ్యాదవ్, రాజు, స్వామి, సాయిచరణ్గౌడ్, షాదుల్ పాల్గొన్నారు.