వెల్దుర్తి, ఫిబ్రవరి 25: కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా గజ్వేల్ సమీపంలో నిర్మించిన కొండపోచమ్మసాగర్ నుంచి ఎనిమిది రోజుల క్రితం వదిలిన గోదావరి జలాలు మూడు రోజుల క్రితం మెదక్ జిల్లా మాసాయిపేట మండలంలో ప్రవేశించాయి. రెండు రో జుల నుంచి మాసాయిపేట మండల పరిధిలో ని హక్కీపేట గ్రామశివారులో ఉన్న చిన్ననీటి తరహా ప్రాజె క్టు హల్దీ ప్రాజెక్టులోని నీళ్లు రాగా, రెండు రోజు ల నుంచి ప్రాజెక్టు నిండి ఆదివారం మధ్యా హ్నం సమయంలో నీళ్లు కిందకు పారడం ప్రా రంభమైంది.
బీఆర్ఎస్ ప్రభు త్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా మూడేండ్ల నుంచి మండుటెండల్లోనూ హల్దీవాగులో నీళ్లు ప్రవహిస్తుండడంతో పరీవాహక రైతులకు సాగుకు ధీమా ఏర్పడింది. వాగు వెంబడి ఉన్న గ్రామాలకు తాగునీటి కష్టాలు సైతం తీరాయి. పది రోజుల క్రితం నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి విజ్ఞప్తి మేరకు ప్రభుత్వం కొండపోచమ్మసాగర్ నుంచి నీటిని విడుదల చేయడంతో హల్దీవాగులో గోదావరి నీళ్లు ప్రవహిస్తుండడంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. నీటి విడుదల కోసం కృషిచేసిన ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డికి రైతులు కృతజ్ఞతలు తెలుపుతున్నారు.