మెదక్ జిల్లా నుంచి బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు మంగళవారం నల్లగొండ జిల్లాకేంద్రంలో నిర్వహించిన కేసీఆర్ సభకు తరలివెళ్లారు. అసెంబ్లీ ఎన్నికల అనంతరం కేసీఆర్ నిర్వహిస్తున్న నల్లగొండ సింహగర్జనకు భారీ సంఖ్యలో గులాబీ శ్రేణులు తరలివెళ్లారు.
కృష్ణా ప్రాజెక్టులను కేంద్రానికి కాంగ్రెస్ ప్రభుత్వం అప్పగించడంపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణను కాపాడుకోవడానికి నల్లగొండ జిల్లా కేంద్రంలో మంగళవారం భారీ బహిరంగ సభ నిర్వహించారు. తెలంగాణను ఆగం చేయడానికి కంకణం కట్టుకున్న కాంగ్రెస్పై బీఆర్ఎస్ శ్రేణులు పోరుబాటకు సిద్ధమయ్యాయి.