నిజాంపేట,ఫిబ్రవరి 8 : మెదక్ జిల్లా నిజాంపేట మండల కేంద్రంలోని పోచమ్మ అమ్మవారికి మాల సంఘం సభ్యులు ఆదివారం బోనాలను సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి ఏటా పోచమ్మ అమ్మవారికి దూప దీప నైవేద్యాలు, బోనాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహిస్తామన్నారు. ఇలా చేయడం వల్ల పాడిపంటలు, గ్రామస్తులు సుభిక్షంగా ఉంటారని వారు తెలిపారు. గ్రామ ప్రధాన వీధుల నుండి అమ్మవారికి సమర్పించేందుకు మహిళలు తీసుకొస్తున్న బోనాల ఊరేగింపు కార్యక్రమం అందర్నీ అలరించాయి. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు టంకరి ప్రశాంత్, బండారి ఎల్లం, మాల సంఘం సభ్యులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..
Fitness | 35 ఏండ్లు దాటితే ఫిట్నెస్ క్షీణత!..వ్యాయామంతో అడ్డుకోవచ్చు అంటున్న నిపుణులు
Inter caste marriage | కూతురు కులాంతర వివాహం చేసుకుందని ఇంటిని తగలబెట్టిన తండ్రి
Seetha Payanam | ఎమోషన్ అండ్ యాక్షన్ కలయికగా ‘సీతా పయనం’.. ఆకట్టుకుంటున్న ట్రైలర్!