హైదరాబాద్ : తన బిడ్డ కులాంతర వివాహం చేసుకుందని ఆగ్రహించిన తండ్రి పెట్రోల్ పోసి ఇంటిని తగలబెట్టిన సంఘటన మంచిర్యాల జిల్లా భీమారం మండలం దాంపూర్లో చోటు చేసుకుంది. ఈ ఘటనకు సంబంధించి ఏసీపీ, వెంకటేశ్వర్, ఎస్ఐ రాజేందర్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. దాంపూర్ గ్రామానికి చెందిన జంగపెల్లి సురేందర్ అదే గ్రామానికి చెందిన అంజలిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. విషయం తెలుసుకున్న అంజలి కుటుంబ సభ్యులు తాళం వేసి ఉన్న సురేందర్ ఇటిపై పెట్రోల్ పోసి నిప్పంటించారు.
గమనించిన స్థానికులు పోలీసులకు, అగ్నిమాపక సిబ్బందికి సమాచారమిచ్చారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు దాడికి పాల్పడిన వారిపై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.