Seetha Payanam | యాక్షన్ కింగ్ అర్జున్ సర్జా దర్శకత్వంలో వస్తున్న తాజా చిత్రం ‘సీతా పయనం’. ఈ సినిమా ద్వారా ఆయన కుమార్తె ఐశ్వర్య అర్జున్ హీరోయిన్గా పరిచయమవుతుండగా.. కన్నడ స్టార్ ఉపేంద్ర మేనల్లుడు నిరంజన్ సుధీంద్ర ఈ చిత్రంలో కథానాయకుడిగా నటిస్తున్నాడు. ప్రేమికుల రోజు కానుకగా ఫిబ్రవరి 14న ఈ సినిమా గ్రాండ్గా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం శనివారం థియేట్రికల్ ట్రైలర్ను విడుదల చేసింది. ట్రైలర్ చూస్తుంటే.. ఒక చెఫ్ అయిన ఐశ్వర్య తన కారులో ప్రయాణిస్తూ, నిరంజన్ అనే తెలియని వ్యక్తికి లిఫ్ట్ ఇవ్వడంతో ఈ ప్రయాణం మొదలవుతుంది. అయితే ఈ ప్రయాణంలో వారి మధ్య సాగే సరదా సంభాషణలు, ఎదురయ్యే మలుపులు ఏంటి అనేది సినిమా కథ.
ఈ సినిమాలో సత్యరాజ్, ప్రకాష్ రాజ్, కోవై సరళ వంటి సీనియర్ నటులు కీలక పాత్రల్లో నటిస్తుండగా.. అర్జున్ సర్జా ఒక పవర్ ఫుల్ పాత్రలో మెరుస్తున్నాడు. ఆయన మేనల్లుడు ధ్రువ సర్జా స్పెషల్ కామియో రోల్లో కనిపించబోతున్నాడు. మెలోడీ కింగ్ అనూప్ రూబెన్స్ అందించిన సంగీతం, సాయి మాధవ్ బుర్రా రాసిన డైలాగ్స్ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి. బాలమురుగన్ సినిమాటోగ్రఫీ విజువల్స్ చాలా ఫ్రెష్గా ఉన్నాయి.