మెదక్ : నిరుపేదలకు సీఎంఆర్ఎఫ్ పథకం వరంలాంటిదని మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి అన్నారు. బుధవారం మెదక్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సీఎంఆర్ఎఫ్ చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజల సంక్షేమానికి పెద్దపీట వేస్తుందని పేర్కొన్నారు.
పేద ప్రజలు అనారోగ్యం పాలై ప్రైవేట్ దవాఖానల్లో చికిత్స పొందితే వారికి ప్రభుత్వం తరపున సీఎం కేసీఆర్ సీఎంఆర్ఎఫ్ కింద కొంత మేరకు వైద్య ఖర్చును అందజేస్తున్నట్టు చెప్పారు. గత ప్రభుత్వాల హయాంలో సీఎంఆర్ఎఫ్ పొందాలంటే ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడ్డారని తెలిపారు.
ప్రస్తుతం పేదలు దరఖాస్తు చేసుకుంటే రాష్ట్ర ప్రభుత్వం సీఎంఆర్ఎఫ్ కింద నిధులు మంజూరు చేస్తుందని అన్నారు.
కార్యక్రమంలో పట్ణణ టీఆర్ఎస్ అధ్యక్షుడు గంగాధర్,మండల అధ్యక్షుడు అంజాగౌడ్, పాపన్నపేట, రామాయంపేట మండలాల అధ్యక్షులు విష్ణువర్ధన్రెడ్డి, మహేందర్రెడ్డి, నాయకులు బాలాగౌడ్, వెంకట్రెడ్డి, సాయిరెడ్డి, గోపాల్, లింగారెడ్డి, అశోక్, సాయిరాం, సుమన్, కిష్టయ్య, యాదగిరి, వెంకటేశం, సిద్ధిరాంరెడ్డి, నవీన్, నియోజకవర్గంలోని మండలాల సర్పంచులు, ఎంపీటీసీలు తదితరులు పాల్గొన్నారు.