చేగుంట, నవంబర్24: ప్రజా సంక్షేమం టీఆర్ఎస్తోనే సాధ్యం అవుతుందని మెదక్ పార్లమెంట్ సభ్యుడు కొత్త ప్రభాకర్రెడ్డి అన్నారు. నార్సింగి మండల బీజేపీ నాయకులు, టీఎమ్మార్పీఎస్ మండల శాఖ అధ్యక్షుడు మహేశ్తో పాటు మండలంలోని పలువురు వార్డు సభ్యులు రమేశ్, భూషణం, పి.మహేశ్, శ్రీకాంత్, రాజయ్య, సురేశ్, నర్సింహులు, ఏ.మహేశ్తో పాటు పలువురు జడ్పీటీసీ బాణపురం కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో ఎంపీ సమక్షంలో హైదరాబాద్లోని ఎంపీ క్యాంప్ కార్యాలయంలో గురువారం టీఆర్ఎస్లో చేరారు.
ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు తరువాత రాష్ట్రంలో అనేక సంక్షేమ పథకాలను సీఎం కేసీఆర్ ఆమలుచేస్తున్నారన్నారు. దేశంలో ఎక్కడాలేనివిధంగా తెలంగాణలో ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నదన్నారు. వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ భారీ విజయం సాధిస్తుందన్నారు. కార్యక్రమంలో పార్టీ నార్సింగి మండల అధ్యక్షుడు మైలరాం బాబు, రాజేశ్, సొసైటీ మాజీ చైర్మన్ తౌర్యనాయక్, నాయకులు ఆనందాస్ నరేశ్, జనార్దన్, శ్రీకాంత్, టీఆర్ఎస్ వల్లూర్ గ్రామ అధ్యక్షుడు వాహిద్ తదితరులు పాల్గొన్నారు.