బీజేపీ నిర్వహిస్తున్నఎన్నికల ప్రచారానికి గ్రామాల్లో నిరసన సెగలు తగులుతున్నాయి. గెలిస్తే గ్రామాలను అభివృద్ధి చేస్తా.. ఇండ్లు లేని వారికి ఇల్లు కట్టిస్తా, రైతులకు రెండు కాడెడ్లు ఇప్పిస్తా.. ఇలా ఎన్నో హామీలు ఇచ్చి మోసం చేసిన బీజేపీ నాయకులను గ్రామాల్లో ప్రజలు నిలదీస్తున్నారు. ఇటీవల చేగుంట మండలంలో ప్రచారం నిర్వహించిన ఎమ్మెల్యే రఘునందన్రావు, బీజేపీ నాయకులతో ప్రజలు గొడవకు దిగారు. గెలిచిన తర్వాత మళ్లా ఇటంక రాకపోతివి.. ఓటేసిననాడే వచ్చిండంటే ఇప్పుడే వచ్చిండు.. అంటూ ప్రజలు అనడంతో అక్కడి నుంచి జారుకున్నారు.
చేగుంట, అక్టోబర్ 26: చేగుంట మండలంలో బీజేపీ ఎన్నికల ప్రచారానికి గ్రామాల్లో నిరసన సెగలు తగిలాయి. దుబ్బాక బీజేపీ ఎమ్మెల్యే రఘునంధన్రావు తాను గెలిస్తే గ్రామాలను అభివృద్ధి చేస్తా, ఇండ్లు లేనివారికి ఇల్లు కట్టిస్తా, రైతులకు రెండు కాడిఎడ్లను ఇప్పిస్తానన్ని ఎన్నికల ముందు ఎన్నో హామీలు ఇచ్చాడు. గెలిచిన తర్వాత హామీలు మర్చిపోవడం, గ్రామాల్లో ఎలాంటి అభివృద్ధి చేయకపోవడంతో గ్రామాలకు ఎన్నికల ప్రచారానికి వచ్చిన ఎమ్మెల్యేను ప్రజలు నిలదీశారు. మూడు రోజుల క్రితం చేగుంట మండలం చందాయిపేట, కసాన్పల్లి, అనంతసాగర్, ఉల్లి తిమ్మాయిపల్లి, ఇబ్రహీంపూర్ గ్రామాల్లో బీజేపీ దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్రావు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రచారం నిర్వహిస్తున్న సమయంలో మహిళలు, వృద్ధులు ఏమి అభివృద్ధి చేసి వచ్చావని నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడతూ దివంగత రామలింగరెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు గ్రామాలకు వచ్చి అభివృద్ధి పనులు చేసేవాడు. అందరి గురించి అడిగేవాడు. రామలింగారెడ్డి యాల్ల పొద్దుగా పోయిండు. ఇగ ఈ ఎమ్మెల్యే రఘునంధన్రావు ఓటు వేసినప్పుడు వచ్చిండు&మళ్లీ గిప్పుడే కనబడుతుండు. ఏమన్న అంటే నన్ను లావుడుదని మాట్లాడుతున్న దంటారు. గెలిచినంక ఇయాల్ల వచ్చి ఒక్క పనైన చేసిరండ్ర అంటూ మహిళ నిరసన వ్యక్తం చేయగా, ఓ వృద్ధుడు బీజేపోల్లను నాకు ఫించన్ వస్తుంది పోండిరా పోండి అంటూ బీజేపోళ్లను తిడుతున్నాడు. ఎప్పుడు వస్తుంది&ఎన్నడు వస్తుంది& అని బీజేపీ నాయకులు అడగ్గా రామలింగారెడ్డి ఉండంగనే.. మస్తుమందికి వచ్చిందని వృద్ధుడు ఎమ్మెల్యే రఘునంధన్రావుపై, బీజేపీ నాయకులపై అరుస్తూ ఆందోళన వ్యక్తం చేశాడు.