తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక బసవేశ్వరుడి గొప్పతనాన్ని గుర్తించిన సీఎం కేసీఆర్ అధికారికంగా ఆ మహనీయుడి జయంతిని నిర్వహిస్తున్నారని రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. ఆదివారం సిద్దిపేట జిల్లా కేంద్రంలోని రెడ్డి ఫంక్షన్ హాల్లో జరిగిన వీరశైవ లింగ బలిజ సమాజ మహాసభలో జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్తో కలిసి పాల్గొన్నారు. సమావేశంలో మంత్రి హరీశ్రావు మాట్లాడుతూ.. ఉమ్మడి మెదక్ జిల్లాలో వీరశైవ లింగ సమాజ ప్రజలు అధికంగా ఉన్నారని, ఈ సమాజంతో తనకు అవినాభావ సంబంధం ఉందన్నారు. గత పాలకులు మిమ్మల్ని ఏనాడూ పట్టించుకోలేదన్నారు. నారాయణఖేడ్, జహీరాబాద్ బసవ కల్యాణ మండపాలకు నిధులు ఇవ్వడమే కాకుండా సంగారెడ్డిలో జిల్లా భవన నిర్మాణానికి ఎకరం భూమి అందించినట్లు తెలిపారు. జహీరాబాద్లో రూ.ఒక కోటితో అద్భుతమైన బసవేశ్వరుడి విగ్రహాన్ని నిర్మిస్తున్నామని తెలిపారు. లిఫ్ట్ ఇరిగేషన్కు బసవేశ్వర నామకరణం చేసినట్లు తెలిపారు.
– సిద్దిపేట అర్బన్, జూలై 23
సిద్దిపేట అర్బన్, జూలై 23: బసవేశ్వరుడి గొప్పతనాన్ని గుర్తించిన ఏకైక నాయకుడు సీఎం కేసీఆర్ అని ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. ఆదివారం సిద్దిపేట జిల్లా కేంద్రంలోని రెడ్డి ఫంక్షన్ హాలులో నిర్వహించిన వీరశైవలింగ బలిజ సమాజ మహాసభకు జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్తో కలిసి హాజరయ్యారు. బసవేశ్వరుడి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వచ్చే ఎన్నికల్లో తమ ఓటు మళ్లీ హరీశ్రావుకే అంటూ వీరశైవలింగ బలిజ సమాజం ఏకగ్రీవంగా తీర్మానించింది. ఈ సందర్భంగా మంత్రి హరీశ్రావు మాట్లాడుతూ.. ఉమ్మడి మెదక్ జిల్లాలో వీరశైవ లింగ సమాజ ప్రజలు అధికంగా ఉన్నారని, ఈ సమాజంతో తనకు అవినాభావ సంబంధం ఉన్నదన్నారు. కాంగ్రెస్, టీడీపీ ప్రభుత్వాలు వీరశైవలింగ సమాజాన్ని ఏనాడు పట్టించుకోలేదన్నారు. 12 శతాబ్ధంలో లింగ వివక్షకు వ్యతిరేకంగా పోరాడిన మహనీయుడు బసవేశ్వరుడన్నారు. ఆ రోజుల్లోనే ఒక పార్లమెంట్ను ఏర్పాటు చేసి ప్రజారంజక పాలన అందించారన్నారు. కర్ణాటకలోని బసవకళ్యాణ్కు వెళ్లి ఆయన పరిపాలన, ఆలోచనలు, ఆశయాలను దగ్గరగా చూసి తెలుసుకున్నానని తెలిపారు. బసవ జయంతిని అధికారంగా నిర్వహించాలని కోరగానే సీఎం కేసీఆర్ వెంటనే అంగీకరించినట్లు తెలిపారు. రాష్ట్రం ఏర్పాటు నుంచి బసవేశ్వరుడి జయంతిని అధికారికంగా నిర్వహిస్తున్నామన్నారు.
బసవేశ్వరుడి విగ్రహాన్ని ట్యాంక్బండ్పై ఏర్పాటు చేసి జాతి గౌరవాన్ని పెంచిన వ్యక్తి సీఎం కేసీఆర్ అని మంత్రి హరీశ్ రా వు అన్నారు. హైదరాబాద్లో రూ.20 కోట్ల విలువైన ఎకరం భూమిని వీరశైవ లింగ సమాజం కోసం రూ.10 కోట్లను భవన నిర్మాణానికి అందించారన్నారు. నారాయణఖేడ్, జహీరాబాద్లో బస వ కల్యాణ మండపాలకు నిధులిచ్చి, సంగారెడ్డిలో జిల్లా భవన నిర్మాణానికి ఎకరం భూమి ఇచ్చినట్లు తెలిపారు. జహీరాబాద్లోని ముంబయి హైవేలో రూ.కోటితో బసవేశ్వరుడి విగ్రహాన్ని నిర్మిస్తున్నామని, త్వరలోనే ప్రారంభిస్తామన్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్లో భాగంగా జహీరాబాద్ ప్రాంతంలో నిర్మించే లిఫ్ట్ ఇరిగేషన్కు బసవేశ్వర లిఫ్ట్ ఇరిగేషన్ అని పేరు పెట్టినట్లు తెలిపారు. నాయకుడు సమా జం కోసం ఆలోచించాలన్నారు. సిద్దిపేట పట్టణం లో రుద్రభూమి కోసం అతి త్వరలోనే భూమి పత్రాలు అందజేస్తామని.. బసవేశ్వర భవనం నిర్మిస్తామని, బసవ భవన్ కళ్యాణ మండ పం కూడా నిర్మిస్తామని హామీ ఇచ్చారు. దుబ్బాక, గజ్వేల్, హుస్నాబాద్ నియోజకవర్గాల్లో వీరశైవ లింగ సమాజానికి న్యాయం చేస్తామన్నారు.
ఎంపీ బీబీపాటిల్ మాట్లాడుతూ.. వీర శైవులను బీసీ ల్లో చేర్చిన ఘనత సీఎం కేసీఆర్దే అన్నారు. ప్రభుత్వంలో, రాజకీయాల్లో వీరశైవ బలిజకు తెలంగాణ ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తున్నట్లు తెలిపారు. ఏదైనా అడిగితే లేదనకుండా ఇచ్చే మంచి మనసున్న వ్యక్తి, అడగకుండానే అన్నీ సమకూర్చే వ్యక్తులు సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్రావు అన్నారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి మెదక్ జిల్లా డీసీఎంస్ చైర్మన్ శివకుమార్, రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు వంగ నాగిరెడ్డి, మున్సిపల్ మాజీ చైర్మన్ రాజనర్సు, వీరశైవలింగ బలిజ సమాజ ప్రతినిధులు శివప్ప, ప్రశాంత్ భద్రప్ప, అశోక్, యాదగిరి, శివకుమార్, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.