మెదక్ అర్బన్, ఆగస్టు 2: సీఎం కేసీఆర్తోనే అన్నివర్గాలకు న్యాయం జరుగుతుందని, ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి తెలంగా ణ ప్రభుత్వం మాత్రమేనని మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి అన్నారు. బుధవారం మెదక్ ఆర్టీసీ డిపో మేనేజర్ ఆధ్వర్యంలో డిపో గ్యారేజ్ లో ఆర్టీసీ ఉద్యోగులతో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి ముఖ్య అథితిగా హాజరై మాట్లాడారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో జీతాలు సరిగ్గాలేక జీవితాలు ఫణంగా పెట్టినవారు ఆర్టీసీ కార్మికులన్నారు.
ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి వారి జీవితాలను తీర్చిదిద్దిన వ్యక్తి సీఎం కేసీఆర్ అన్నారు. ఆర్టీసీ ఉద్యోగులకు తెలంగాణ ఉద్యమంలో చాలా చురుకుగా పాల్గొన్నారని, వంటా వార్పు లాంటి ఎన్నో కార్యక్రమాల్లో పాల్గొన్నారని ఆనాటి ఉద్యమ సన్నివేశాలను గుర్తుచేశారు. సీఎం కేసీఆర్ ఆర్టీసీ ఉద్యోగులకు 43 శాతం ఫిట్మెంట్ అందించారని గుర్తుచేశారు. అనంతరం ఆర్టీసీ కార్మికులతో ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి ఆడిపాడారు. కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్ పర్సన్ లావణ్యారెడ్డి, మెదక్ మున్సిపల్ చైర్మన్ చంద్రపాల్, వైస్ చైర్మన్ మల్లికార్జున్గౌడ్, ఆర్టీసీ ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు.