సిద్దిపేట (నమస్తే తెలంగాణ ప్రతినిధి)/ దుబ్బాక, అక్టోబర్ 30: సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గంలో సోమవారం ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న మెదక్ ఎంపీ, బీఆర్ఎస్ దుబ్బాక అభ్యర్థి కొత్త ప్రభాకర్రెడ్డిపై జరిగిన హత్యాయత్నం ఘటనపై ఉమ్మడి మెదక్ జిల్లాలో బీఆర్ఎస్ శ్రేణులు భగ్గుమన్నారు. ఈ ఘటనను నిరసిస్తూ బీఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులు రోడ్లపై బైఠాయించి ఆందోళన చేపట్టారు. ప్రతిపక్షాల దిష్టిబొమ్మలు దహనం చేశారు. ఎంపీపై హత్యాయత్నం ఘటన విషయం తెలియగానే గులాబీ దండులో ఆగ్రహావేశాలు రేగాయి. ఎంపీ ప్రభాకర్రెడ్డిని వాహనంలో హుటాహుటిన గజ్వేల్ దవాఖానకు తరలించగా.. అక్కడికి దుబ్బాక నియోజకవర్గం నుంచి నేతలు తరలివెళ్లారు. పరిస్థితి విషమంగా ఉండడంతో అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం సికింద్రాబాద్లోని యశోద దవాఖానకు తరలించగా క్యాడర్ ఆందోళన చెందింది. విషయం తెలుసుకున్న ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు హుటాహుటిన యశోద దవాఖానకు వెళ్లి ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి ఆరోగ్య పరిస్థితిని వాకబు చేశారు.
మెదక్ ఎంపీ, దుబ్బాక బీఆర్ఎస్ అభ్యర్థి కొత్త ప్రభాకర్రెడ్డిపై హత్యాయత్నం ఘటన సోమవారం ఉమ్మడి మెదక్ జిల్లాలో చర్చనీయాశంగా మారింది. ఈ ఘటన వెనుక ఏదైనా రాజకీయ పార్టీ హస్తం ఉందా, లేదా ఎవరైనా నాయకులు కుట్ర చేశారా అన్న అనుమానాలను ప్రజలు వ్య క్తం చేశారు. చీమకైనా హానిచేయని, మంచి మనసున్న నాయకుడిగా, స్నేహశీలిగా, నిస్వార్థ ప్రజా సేవకుడిగా పేరొందిన ప్రభాకర్రెడ్డిపై హత్యాయత్నం జరగడంపై ప్రజలంతా ఆవేదన వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ సిద్దిపేట జిల్లా అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహిస్తున్న ప్రభాకర్రెడ్డి పార్టీ శ్రేణులతో నిత్యం మమేకమవుతున్నారు. ఈ ఎన్నికల్లో దుబ్బాక అసెంబ్లీ నుంచి బీఆర్ఎస్ తరుపున పోటీచేస్తున్న ఆయన కొద్దిరోజులుగా ఎన్నికల ప్రచారంలో దూసుకెళ్తున్నారు. ప్రచారంలో పాల్గొంటూనే.. మరోపక్క పార్టీ శ్రేణులు, అభిమానులు, ఓటర్లను కలుస్తూ వారి యోగక్షేమాలను తెలుసుకుంటున్నారు. ఇందులో భాగంగా సోమవారం నియోజకవర్గంలోని దౌల్తాబాద్ మండలంలో పలు గ్రామాల్లో ఆయన ప్రచారం నిర్వహించారు. సూరంపల్లిలో ప్రచారం పూర్తి చేసుకుని, మరో గ్రామానికి బయలుదేరారు. సూరంపల్లి చర్చి పాస్టర్ రంగయ్య తల్లి నర్సవ్వ ఇటీవల మృతి చెం దిన విషయం తెలుసుకున్న ఎంపీ వారి ఇంటికి వెళ్లి కుటుంబాన్ని పరామర్శించారు. వారి ఇంటి నుంచి తన వాహ నం ఎక్కేందుకు వస్తున్న ప్రభాకర్రెడ్డి వద్దకు ఓ దుండగుడు వచ్చి కత్తితో దాడి చేశాడు. కత్తితో బలంగా పొడవడంతో కడుపులో గాయాలైన ప్రభాకర్రెడ్డిని వ్యక్తిగత సిబ్బంది, బీఆర్ఎస్ నాయకులు హుటాహుటిన గజ్వేల్లోని ప్రభుత్వ దవాఖానకు తరలించారు.ఎంపిపై హత్యాయ త్నం పక్కా ప్లాన్తో జరిగిందని, దీనివెనుక రాజకీయ పార్టీ హస్తం ఉండవచ్చని ప్రజలు చర్చించుకుంటున్నారు.
దుబ్బాక బీఆర్ఎస్ అభ్యర్థి, మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డిపై కత్తితో హత్యాయత్నానికి పాల్పడిన నిందితుడు మిరుదొడ్డి మండలం చెప్యాల గ్రామానికి చెందిన గటాని రాజుగా గుర్తించారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన రాజు ఇటీవల బీజేపీ నాయకులతో సంబంధాలు పెంచుకున్నట్లు ఆరోపణలు ఉన్నా యి. ఓపక్క రాజకీయం.. మరోపక్క యూట్యూబ్ చానల్ (వీ90 న్యూస్) రిపోర్టర్గా పని చేస్తున్నా డు. వివాదాస్పదుడిగా రాజుపై పలు ఆరోపణలు ఉన్నాయి. ఒక్కోచోట ఒక్కోరకంగా జర్నలిస్టునంటూ.. రాజకీయ నేతనంటూ పలువురిని బెదిరింపులకు గురిచేస్తూ డబ్బులు వసూలు చేసేవాడని స్థానికులు చెబుతున్నారు. ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డికి రాజుకు మధ్యన ఎలాంటి సంబంధాలు లేవు. ఎంపీని హత్య చేసేందుకు రాజును ఇతర రాజకీయ పార్టీల నాయకులు పురమాయించారా .. లేక పావుగా వాడుకున్నారా అనే సందేహాలు లేవనెత్తుతున్నాయి. సోమవారం దౌల్తాబాద్ మం డలం సూరంపల్లిలో ఎంపీ ప్రభాకర్రెడ్డి ప్రచారం ముగిసిన వెంటనే కవరేజీకి వచ్చిన స్థానిక పాత్రికేయులు అక్కడి నుంచి వెళ్లిపోయారు. రాజు ఎంపీ ప్రభాకర్రెడ్డిని అనుసరిస్తూ పాస్టర్ రం గయ్య ఇంటి వద్దకు వెళ్లాడు. ఇంట్లో నుంచి బయటకు వచ్చిన ఎంపీ ప్రభాకర్రెడ్డిని విష్ చేస్తున్నట్లు నటిస్తూ.. రాజు తన ప్యాంట్ జేబులో దాచుకున్న కత్తితో హత్యాయత్నానికి పాల్పడ్డాడు.
మెదక్ ఎంపీ ప్రభాకర్రెడ్డిపై కత్తితో దాడి జరిగిన విషయం తెలుసుకున్న ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు ప్రతిక్షణం ఆయ న ఆరోగ్య పరిస్థితిని వాకబు చేశారు. సికింద్రాబాద్లోని యశోద దవాఖానలో చికిత్స పొందుతు న్న ప్రభాకర్రెడ్డి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకునేందుకు హుటాహుటిన మంత్రి హరీశ్రావు అక్కడికి వెళ్లారు. నారాయణఖేడ్లో సీఎం ప్రచార సభకు వెళ్తుండగా హత్యాయత్నం జరిగిన సమాచారం తెలియడంతో మంత్రి హైదరాబాద్లో యశోద దవాఖానకు వెళ్లారు. ఎంపీ ప్రభా కర్రెడ్డి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకుని మెరుగైన వైద్యసేవలు అందించాలని వైద్యులకు ఆయన సూచించారు. ఎంపీకి, వారి కుటుంబ సభ్యులకు మనోధైర్యం ఇచ్చారు. ప్రభాకర్రెడ్డిని కంటికి రెప్పలా కాపాడుకుంటామని, బీఆర్ఎస్ శ్రేణులు, అభిమానులు ఆందోళనకు గురికావద్దని మంత్రి వెల్లడించారు.
మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డిపై కత్తితో దాడిచేసి హత్యాయత్నానికి పాల్పడిన నిందితుడు గటాని రాజును అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టినట్లు సిద్దిపేట పోలీసు కమిషనర్ శ్వేత ఒక ప్రకటనలో తెలిపారు. ఎంపీని కలిసేందుకు వచ్చి కత్తితో కడపులోకి బలంగా పొడిచి పారిపోయేందుకు ప్రయత్నిస్తున్న రాజును అక్కడున్న బీఆర్ఎస్ కార్యకర్తలు పట్టుకుని తమ పోలీసులకు అప్పగించారని తెలిపారు. నిందితుడిపై కేసు నమోదు చేసి, విచారిస్తున్నట్లు తెలిపారు.
సిద్దిపేట(నమస్తే తెలంగాణ ప్రతినిధి)/ దుబ్బాక, అక్టోబర్ 30 : సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గంలో సోమవారం ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న మెదక్ ఎంపీ, బీఆర్ఎస్ దుబ్బాక అభ్యర్థి కొత్త ప్రభాకర్రెడ్డిపై ఓదుండగుడు పక్కా ప్లాన్తో కత్తితో దాడిచేసి, హత్యాయత్నానికి పాల్పడ్డాడు. వెంటనే ఎంపీ ప్రభాకర్రెడ్డిని వాహనంలో హుటాహుటిన గజ్వేల్ దవాఖానకు తరలించి వైద్య సేవలు అందించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం సికింద్రాబాద్లోని యశోద దవాఖానకు తరలించారు. విషయం తెలుసుకున్న ఆర్థిక,వైద్యారోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు హుటాహుటిన యశోద దవాఖానకు వెళ్లి ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి ఆరోగ్య పరిస్థితిని వాకబు చేశారు. ఈ ఘటనను మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి, చింతా ప్రభాకర్, గూడెం మహిపాల్రెడ్డి, మఠం భిక్షపతి, ఎర్రోళ్ల శ్రీనివాస్ తీవ్రంగా ఖండించారు.