హరితహారంలో భాగంగా ప్రభుత్వం మొక్కల పెంపకానికి ప్రాధాన్యమిస్తున్నది. గజ్వేల్ మున్సిపల్ పరిధిలోని క్యాసారం వరకు రోడ్డుకు ఇరువైపులా అధికారులు పచ్చదనాన్ని పెంచేందుకు వేల సంఖ్యలో మొక్కలు నాటించారు. వాటికి రక్షణగా మొక్కల చుట్టూ ముళ్లకంచె ఏర్పాటు చేయించారు. మొక్కలు ఎదిగేందుకు ప్రతిరోజూ ట్యాంకర్లతో నీళ్లు పడుతున్నారు. దీంతో గజ్వేల్ రోడ్లు పచ్చదనంతో కనువిందు చేస్తున్నాయి. వాహనదారులు, ప్రయాణికులకు ఆహ్లాదాన్ని పంచుతున్నాయి.
గజ్వేల్, జూన్ 23 : తెలంగాణ ప్రభుత్వం మొక్కల పెంపకానికి అధిక ప్రాధాన్యతనివ్వడంతో గ్రామాలకు వెళ్లే దారులు పచ్చదనంతో కనువిందు చేస్తున్నాయి. సీఎం కేసీఆర్ మొక్కలను అధికంగా నాటాలని, మానవ మనుగడను కాపాడుకోవాలంటే మొక్కల పెంపకంపై దృష్టి సారించే విధంగా హరితహారం కార్యక్రమాన్ని ప్రారంభించారు. దీంతో అధికారులు, ప్రజాప్రతినిధులు రోడ్ల వెంబడి వంద సంఖ్యలో మొక్కలు నాటారు. గజ్వేల్ నుంచి క్యాసారం వరకు రెండు వరుసల రోడ్డుకు ఇరువైపులా మొక్కలు నాటి, వాటి రక్షణగా ముళ్లకంచెను ఏర్పాటు చేస్తున్నారు.
గజ్వేల్ మున్సిపల్ పరిధిలోని క్యాసారం గ్రామ వరకు రెండు వరుసల రోడ్డు నిర్మాణం పూర్తవడంతో రోడ్డుకు ఇరువైపులా అధికారులు మొక్క లు వంద సంఖ్యలో నాటించారు. వాటికి రక్షణగా మొక్కలకు చుట్టూ ముళ్లకంచెను ఏర్పాటు చేయించారు. దీంతో పశువులు, మేకలు, గొర్రెలు వాటిని ఆహారంగా తినేందుకు వీలుండకుండా మొక్కల పెంపకం కోసం రక్షణ చర్యలు తీసుకున్నారు. 15 రోజులుగా మొక్కలు నాటి, చుట్టూ కంచెను ఏర్పా టు చేయించారు. మొక్కలకు రోజూ ట్యాంకర్ల ద్వారా నీళ్లు పడుతున్నారు. హరితహారంతో మొక్కలు అధికంగా పెట్టడంతో గజ్వేల్ రోడ్లు పచ్చదనంతో కనువిందు చేస్తున్నాయి. గజ్వేల్ నుంచి సంగుపల్లి, మూట్రాజ్పల్లి, సంగాపూర్, జాలిగామ, బయ్యారం, పిడిచెడ్ వెళ్లే రోడ్డుకు ఇరువైపులా పచ్చదనంతో మొక్కలు ఎంతో ఆహ్లాదకరంగా కనిపిస్తున్నాయి. కొద్ది రోజుల్లో క్యాసారం గ్రామానికి వెళ్లే మార్గం కూడా పచ్చదనంతో కనిపించేలా అధికారులు మొక్కలు నాటారు.
గజ్వేల్ నుంచి రేడియల్ రోడ్లన్నీ కూడా పచ్చదనంతో కనిపిస్తున్నాయి. రోడ్లకు ఇరువైపులా మొక్కలు నాటడంతో పచ్చదనంతో కనిపిస్తున్నాయి. సీఎం కేసీఆర్ ఆశయం నెరవేరేలా అధిక సంఖ్యలో మొక్కల పెంపకం చేపడుతున్నాం. క్యాసారం మార్గంలో సంబంధిత అధికారులు మొక్కలు అధికంగా నాటించారు.
-ఎన్సీ రాజమౌళి, మున్సిపల్ చైర్మన్