యాసంగిలో పండిన మొత్తం ధాన్యాన్ని రాష్ట్ర ప్రభుత్వమే మద్దతు ధరతో సేకరిస్తుందని సీఎం కేసీఆర్ ప్రకటించడంతో రైతులోకం సంబురాలు చేసుకుంటున్నది. బుధవారం మెదక్, సంగారెడ్డి జిల్లాలో అన్నదాతలు, టీఆర్ఎస్ శ్రేణులు సంబురాలు నిర్వహించారు. సీఎం కేసీఆర్ చిత్రపటాలకు క్షీరాభిషేకం, ధాన్యాభిషేకం చేసి కృతజ్ఞతలు తెలిపారు. పలుచోట్ల పటాకులు కాల్చారు.
– మెదక్/ సంగారెడ్డి జిల్లాల నెట్వర్క్, ఏప్రిల్ 13
కేంద్రం తెలంగాణ రైతులను నష్టపరిచేందుకు ఎన్ని ప్రయత్నాలు చేసినా సీఎం కేసీఆర్ రైతుల పక్షాన పోరాటం చేస్తున్నారని సర్పంచ్ల ఫోరం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ చిట్కుల మహిపాల్రెడ్డి పేర్కొ న్నారు. రైతులు పండించిన ప్రతి గింజనూ కొనుగోలు చేస్తామ ని సీఎం కేసీఆర్ ప్రకటించడంపై రైతులు, నాయకులు హర్షం వ్యక్తం చేశారు. మనోహరాబాద్లో సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేయగా, కూచారంలో రైతులు తెలంగాణ తల్లి విగ్రహానికి క్షీరాభిషేకం చేసి రైతుబంధువు సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో ఎంపీటీసీ లతావెంకట్గౌడ్, ఫ్యాక్స్ డైరెక్టర్ జావిద్, సర్పంచ్ నరేందర్రెడ్డి, నేతలు నరేశ్ ముదిరాజ్, ఉదయ్రంజన్గౌడ్, రమేశ్గౌడ్, నాయక్, లక్ష్మీనర్సింహాగౌడ్, ఇమాంపూర్ శేఖర్గౌడ్ పాల్గొన్నారు.
మెదక్ పీఎసీఎస్ డైరెక్టర్ సాప సాయిలు ఆధ్వర్యంలో హవేళీఘనపూర్ మండలం గాజిరెడ్డిపల్లిలో బైక్ర్యాలీ నిర్వహించి, సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం నిర్వహించారు. అనం తరం పటాకులు కాల్చి సంబురాలు నిర్వహించారు. కార్యక్రమంలో నేతలు భాగ్యలక్ష్మి, రవి, శోభ, సుభాశ్, రామాగౌడ్, బీమయ్య, అరిగె పోచయ్య, అంజయ్య, సత్తయ్య పాల్గొన్నారు.
నిజాంపేట మండలంలోని రాంపూర్, నందిగామ గ్రామాల్లో జరిగిన కార్యక్రమాల్లో మండల కో-ఆప్షన్ సభ్యుడు గౌస్, సర్పంచ్ ప్రీతి, ఎంపీటీసీ సురేశ్, నేతలు సంపత్, రాజం, నర్సింహులు ఉన్నారు. పెద్దశంకరంపేట మండల పరిషత్ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఎంపీపీ శ్రీనివాస్, నేతలు సురేశ్గౌడ్, ఎంపీటీసీ దామోదర్, స్వప్నారాజేశ్వర్, అనంత్రావు, నరేశ్ పాల్గొన్నారు. రామాయంపేటలో జరిగిన కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ సరాఫ్ యాదగిరి, వైస్ చైర్మన్ రాజిరెడ్డి, మున్సిపల్ చైర్మన్ జితేందర్గౌడ్, పీఏసీఎస్ చైర్మన్ చంద్రం పాల్గొన్నారు. నార్సింగి మండలం భీంరావ్పల్లిలో బోయిని శ్రీశైలం ఆధ్వర్యంలో సంబురాలు నిర్వహించారు.
తూప్రాన్ మండలంలోని గుండ్రెడ్డిపల్లి గ్రామంలో నిర్వ హించిన కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు యాసిన్, రేపల్లె ప్రశాంత్, మహేశ్, కరుణాకర్, భూషణం పాల్గొన్నారు