సదాశివపేట, మే 29: రైతులకు కేంద్రప్రభుత్వం పీఎం కిసాన్ సమ్మాన్నిధి ద్వారా ప్రతి ఏడాది రూ. 6వేలు అందిస్తున్నది. ఇక నుంచి పీఎం కిసాన్ సమ్మాన్నిధి ద్వారా సా యం పొందాలంటే ఆధార్ అనుసంధానం తప్పనిసరి చేసుకోవాలని కేంద్రప్రభుత్వం నిబంధన తెచ్చింది. ఈ నెల 31వరకు రైతులు ఆధార్ అనుసంధానం చేసుకోవాలి. ఆధార్ అనుసంధానం చేసుకోని రైతులకు కేంద్రం నుంచి వచ్చే పెట్టుబడి సాయం పొందే అవకాశం ఉండదు. రాష్ట్ర ప్రభుత్వం ఏ నిబంధనలు లేకుండా ఏడాదికి రూ. 10వేలు పెట్టుబడి సాయం అందిస్తున్నది కానీ కేంద్ర ప్రభుత్వం ఏడాదికి రూ. 6వేలు సాయం అందించేందుకు ఆధా ర్ అనుసంధానం తప్పనిసరి చేయడంపై రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
జిల్లాలో 1,74,684మంది లబ్ధిదారులు
సంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా 1,74,654మంది రైతులు పీఎం సమ్మా న్ నిధి నుంచి మూడు విడతలుగా కేంద్ర ప్రభు త్వ పెట్టుబడి సాయాన్ని పొంతుతున్నారు. ఒక విడతలో రూ. 2వేలు చొప్పున మూడు విడతల్లో రూ. 6వేలు ఏడాది కి కేంద్రప్రభు త్వం పీఎం కిసాన్ సమ్మాన్నిధి ద్వారా రైతులకు సాయం అందజేస్తున్నది. చాలా మంది రైతులు ఆధార్ కు ఫోన్ నంబ ర్ లింకు లేకపోవడంతో అనుసంధానం చేసే సమయంలో ఓటీపీ రాక ఇబ్బందులు పడుతున్నారు. మీ సేవా కేంద్రాల్లో ఆధార్కు ఫోన్ నంబర్ లింకు చేసుకుని పీఎం సమ్మాన్నిధి కోసం రైతులు అనుసంధానం చేసుకుంటున్నారు. 2019 ఫిబ్రవరి వరకు పట్టాదారు పుస్తకాలు ఉన్న వారికి మాత్రమే పీఎం సమ్మాన్నిధి కింద సాయం పొందేందుకు అర్హులు. పట్టాదారు చనిపోతే వారి వారసులు ఆన్లైన్లో నమోదు చేసుకొని సాయం పొందవచ్చు. 2019 తర్వా త భూములు కొనుగోలు చేసినా ఇతరత్రా కారణాలతో పట్టా పాస్బుక్లు పొందినా ఈ పథకం వారికి వర్తించదు. ఐటీ ఉద్యోగులు, ఆదాయం ఎక్కువగా ఉన్నవారు అనర్హులు.