పాపన్నపేట,ఆగస్టు25 : మనస్థాపంతో ఓ యువకుడు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన మొదక్ జిల్లా పాపన్నపేట మండలంలోని పొడ్చన్పల్లిలో గురువారం చోటు చేసుకుంది. ఎస్ఐ విజయ్కుమార్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.
పొడ్చన్పల్లి గ్రామానికి చెందిన తిమ్మన్నగారి శ్రీకాంత్రెడ్డి (33) వ్యాపారం చేసుకుంటూ జీవిస్తున్నాడు. కాగా, గత 13 ఏండ్ల క్రితం కుర్తివాడ గ్రామానికి ఓ యవతిని ప్రేమ వివాహం చేసుకున్నాడు. రెండేండ్ల క్రితం భార్య గొడవపడి ఇంట్లో నుంచి వెళ్లిపోయింది.
దీంతో మనస్థాపం చెందిన శ్రీకాంత్రెడ్డి రోజు మాదిరిగా గ్రామ శివారులో ఉన్న తమ కోళ్లఫారంలోకి వెళ్లాడు. అక్కడ ఉన్న ఇనుప రాడ్డుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడని ఆయన తెలిపారు. త్రండి వెంకట్రెడ్డి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.