ఏ కష్టం వచ్చినా సంగారెడ్డి ప్రజలకు నేనున్నానంటున్నారు మాజీ ఎమ్మెల్యే, హెచ్డీసీ చైర్మన్ చింతా ప్రభాకర్. వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే బీఆర్ఎస్ అభ్యర్థుల జాబితాను ఈ నెల 21న సీఎం కేసీఆర్ ప్రకటించగా సంగారెడ్డి నుంచి ప్రభాకర్కు మరో అవకాశం కల్పించారు. ఈ సందర్భంగా ఆయన సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు తెలుపుతూ నియోజకవర్గ ప్రగతిపై ‘నమస్తే తెలంగాణ’కు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. రవాణా వ్యవస్థను మెరుగుపర్చేందుకు ప్రభుత్వం రూ.30 కోట్లతో రోడ్ల మరమ్మతులు చేసిందన్నారు. మిషన్కాకతీయ పథకంలో భాగంగా రూ.113 కోట్లు ఖర్చు చేసి చెరువులను పునరుద్ధరించినట్లు వెల్లడించారు. కల్యాణలక్ష్మి, షాదీముబారక్ కింద రూ.50 కోట్లు, సీఎం రిలీఫ్ఫండ్, ఎల్ఓసీలకు రూ.24 కోట్లు, 6,300 మందికి కేసీఆర్ కిట్లు అందించినట్లు తెలిపారు. రూ.10 కోట్లతో కొత్త సబ్స్టేషన్లు నిర్మించిందన్నారు. 53,172 మంది రైతులకు రూ.409.23 కోట్ల పంట పెట్టుబడి సాయం చేసిందన్నారు. సీఎం కేసీఆర్కు అండగా నిలబడాలని, నియోజకవర్గ ప్రజలకు సేవ చేసుకునే అదృష్టం తనకు మళ్లీ కల్పించాలని కృతజ్ఞతలు తెలిపారు.
– సంగారెడ్డి, ఆగస్టు 24
సంగారెడ్డి, ఆగస్టు 24: మాటిస్తే అది చేసి చూపించడం నాయకుడి లక్షణం..అలాంటి లక్షణాలు కలిగిన నాయకుడే చింతా ప్రభాకర్. ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉంటూ ప్రజలకు ఏ కష్టం వచ్చి ఫోన్ చేసినా టక్కున మాట్లాడే లక్షణం ఆయన సొంతం. మిస్డ్ కాల్ చేసినా వెంటనే స్పందించే నైజం.. ఇలా చెప్పుకుంటూ పోతే ఆయన సేవలు అమోఘం. ఆయన చెబితే చాలు పని అయినట్లేనని నియోజకవర్గ ప్రజల్లో ఓ నమ్మకం. నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉండే నాయకుడిగా నమ్మకం పెంచుకున్న గొప్పవ్యక్తి ప్రభాకర్. అంతేకాదు నియోజకవర్గ అభివృద్ధి కోసం తహతహలాడుతూ రూ.వందల కోట్ల నిధులు మంజూరు చేయించి పనులు పూర్తిచేసిన ఘనత ఆయకే దక్కుతుంది. ముఖ్యంగా తాగునీటి ఇబ్బందులను శాశ్వతంగా తొలిగించి మహిళల అభిమానం చూరగొన్న నాయకుడిగా గుర్తింపు పొందారు. గ్రామీణ, పట్టణాల్లో రవాణా వ్యవస్థను మెరుగుపర్చేందుకు రోడ్ల వసతి కల్పించి శభాష్ అనిపించుకున్నారు. మిషన్ భగీరథతో నియోజకవర్గంలోని ప్రతి ఇంటికీ తాగునీటిని అందించి మంచినీటి కొరత లేకుండా చేశారు. అలాగే మిషన్ కాకతీయతో నియోజకవర్గంలోని ప్రతి చెరువులో పూడికతీత, కట్టల పెంపు, అలుగుల నిర్మాణం, కటు ్టకాల్వల మరమ్మతులు చేయించి చెరువులను పునరుద్ధరించారు. అటు అభివృద్ధి పనుల్లోనూ… ఇటు పార్టీ కార్యక్రమాలను అధిష్టానం ఇచ్చిన ప్రతి కార్యక్రమాన్ని విజయవంతం చేస్తూ పార్టీ నాయకులు, కార్యకర్తలను సమన్వయం చేసుకుంటూ ముందుకెళ్తున్నారు. అభివృద్ధి, సంక్షేమం, నాయకులతో సమన్వయం చేసుకుని ఎన్నికల్లో విజయం సాధించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్న ప్రభాకర్తో నమస్తే తెలంగాణ ప్రత్యేక ఇంటర్వ్యూ.
చింతా ప్రభాకర్: 2014లో ఎమ్మెల్యేగా గెలవడం..అప్పుడే అభివృద్ధి కార్యక్రమాలకు ప్రభుత్వం శ్రీకారం చుడుతున్నది. ముందుగా రవాణా వ్యవస్థకు సర్కార్ పెద్దపీట వేస్తూ గ్రామగ్రామానికీ లింకు రోడ్లును ప్రారంభించింది. గ్రామాలను మండలకేంద్రాలకు, మండల కేంద్రాల నుంచి జిల్లా కేంద్రానికి రోడ్లను అనుసంధానం చేసింది. అందుకు అవసరమైన నిధులను ప్రభుత్వం వెంటవెంటనే మంజూరు చేసింది. దీంతో నియోజకవర్గంలో రోడ్లు-భవనాల శాఖ ఆధ్వర్యంలో 56 కిలోమీటర్ల రోడ్లకు రూ.30 కోట్లు ఖర్చు చేశారు. అలాగే పంచాయతీరాజ్ శాఖలో 133 పనులను చేపట్టి పూర్తి చేశారు. వీటితోపాటు కుల సంఘ భవనాలు, అంగన్వాడీ భవనాలకు నిధులు కేటాయించి పనులు త్వరగా పూర్తి చేశారు. గ్రామాలకు పంచాయతీ భవనాలు లేనిచోట భవనాల నిర్మాణాలకు నిధులు మంజూరు చేసి పక్కా భవనాలకు చేపట్టాం.
చింతా ప్రభాకర్: గత ప్రభుత్వాల హయాంలో తాగునీటి కోసం మహిళలు ఖాళీబిందెలతో రోడ్లెక్కి ధర్నాలు చేశారు. తాగునీటి కోసం కొట్టుకున్న సంఘటనలు చూశాం. అలాంటి పరిస్థితి ప్రజలకు రావొద్దనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి కేసీఆర్ నల్లాల ద్వారా ఇంటింటికీ మంచినీళ్లు సరఫరా అయ్యేలా ప్రణాళికలు తయారు చేసి మిషన్ భగీరథ పథకంతో తాగునీరు అందించారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఏ జిల్లా, మండలాలు, గ్రామాల్లో నీళ్ల కోసం గొడవలు పడిన సందర్భాలు లేవు. అది రేవలం సీఎం కేసీఆర్కే సాధ్యమైంది. ఇందుకోసం నియోజకవర్గంలో పైపులైన్లు, ఓహెచ్ఎస్ఆర్ ట్యాంకుల నిర్మాణాలు చేపట్టింది. అలాగే చెరువుల పూడికతీత, కట్టల పెంపు, అలుగులు, తూములు, కట్టు కాలువల నిర్మాణాలకు ప్రభుత్వం రూ.113 కోట్ల నిధులు ఖర్చు చేసింది. ఈ నిధులతో 600 కిలోమీటర్ల పైపులైన్లు, 116 ఓహెచ్ఎస్ఆర్ ట్యాంకులు నిర్మించారు. సాగునీళ్లు అందించేందుకు మిషన్ కాకతీయ పథకంలో చెరువులను అభివృద్ధి చేయడంతో నిండుకుండలను తలపించేలా నీళ్లతో కళకళలాడుతున్నాయి.
చింతా ప్రభాకర్: ప్రజల సంక్షేమమే పరమావధిగా పనిచేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ. ఈ విషయాలను కేంద్ర ప్రభుత్వ, నీతిఅయోగ్, ఇతర రాష్ర్టాల మంత్రులు, వివిధ సంస్థలు తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమం దేశానికే తలమానికంగా నిలిచాయని ప్రశంసించారు. నియోజకవర్గంలో 53,172 మంది రైతులకు రూ.409.23 కోట్ల పంటల పెట్టుబడి సాయాన్ని అందజేసింది. అలాగే 918మంది మృతిచెందిన అన్నదాతల కుటుంబాలకు ప్రభుత్వం రైతుబీమా ద్వారా రూ.45.45కోట్ల ఆర్థిక సాయాన్ని అందజేసింది. పట్టణాల అభివృద్ధ్దికి నారాయణఖేడ్ సభలో ముఖ్యమంత్రి ప్రకటించిన సంగారెడ్డి మున్సిపాలిటీ రూ.50కోట్లు, సదాశివపేటకు రూ.25కోట్లు, టీయూఎఫ్ఐడీసీ నిధులు రూ.20కోట్లతో రెండు పట్టణాల్లో సీసీ రోడ్లు, సీసీ డ్రైనేజీలు, బీటీ రోడ్ల పనులు చివరి దశకు చేరుకున్నాయి. రైతుల పండించిన ధాన్యానికి మద్దతు ధర ప్రకటించి 2016-17లో 493 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయగా 2022-23 వానకాలంలో 18,316 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసి రైతులు ఇబ్బందులకు గురికాకుండా చర్యలు చేపట్టింది.అన్ని రంగాల్లో అభివృద్ధ్ది, సంక్షేమం సాధించి దేశానికి మార్గదర్శిగా రాష్ర్టాన్ని నిలిపిన ఘనత ముఖ్యమంతి కేసీఆర్కే దక్కుతుంది. వచ్చే ఎన్నికల్లో కేసీఆర్ను మరోసారి సీఎంను చేసేందుకు ఆశీర్వదించాలని చింతా ప్రజలను వేడుకున్నారు.
చింతా ప్రభాకర్: నీళ్లు, నిధులు, నియామకాలతో సాధించిన తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించి దేశానికే ఆదర్శంగా నిలిచింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ప్రజలు పడిన బాధలను దగ్గరుండి చూసిన కేసీఆర్ ముఖ్యమంత్రి పదవి చేపట్టగానే ఒక్కొక్కటిగా అభివృద్ధి చేస్తూ వచ్చారు. ఈ రోజు ప్రపంచం అబ్బురపడే విధంగా కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించి ముఖ్యమంత్రి ప్రజల గుండెల్లో గూడుకట్టుకున్నారు. గతంలో కొత్తగా ఏర్పడిన రాష్ర్టాలు ఇంతటి అభివృద్ధిని ఇప్పటివరకు సాధించేలేదని పలు కేంద్ర కమిటీలు వెలువరించాయి. ముఖ్యంగా నీతిఅయోగ్ తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలులో దేశానికే ఆదర్శమని కితాబిచ్చాయి. వైద్యంలో ప్రభుత్వ దవాఖానల్లో వసతులు మెరుగుపర్చి సర్కార్ వైద్యంపై ప్రజలకు నమ్మకం పెంచారు. విద్యలో సంస్కరణలు చేస్తూ గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేసి నాణ్యమైన విద్యాభోదన చేస్తున్న ఏకైక ప్రభుత్వం తెలంగాణ మాత్రమే. రాష్ట్రంలో, నియోజకవర్గాల్లో జరుగుతున్న అభివృద్ధితో రోడ్లు, గ్రామాలు, పట్టణాల ముఖచిత్రాలు ఒకేసారి మారిపోయాయి.
చింతా ప్రభాకర్: నియోజకవర్గ పరిధిలోని ప్రతి గ్రామానికీ ప్రతినెలా తప్పనిసరిగా పింఛన్లు అందుతున్నాయి. నెలవారీగా 29వేల మందికి రూ.6కోట్లకు పైగా పింఛన్లను ప్రభుత్వం అందజేస్తున్నది. 2014కు ముందు కేవలం 19,861మందికే గత ప్రభుత్వాలు పింఛన్లు ఇచ్చేవి. ఈ ఐదేండ్లలో ప్రభుత్వం రూ.360కోట్లు లబ్ధ్దిదారులకు అందజేస్తున్నది. అలాగే కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకం కింద రూ. 50కోట్లు, సీఎం రిలీఫ్ఫండ్, ఎల్వోసీలకు రూ.24కోట్లు, కేసీఆర్ కిట్లను 6,300 మందికి అందజేశారు. 2828 యూనిట్లకు 21 గొర్రెల చొప్పున గొర్రెలు పంపిణీ చేశాం. రైతులు ఒకేచోట సమావేశమై పంటల సాగుపై చర్చించుకునేందుకు రూ.4.64 కోట్లు ఖర్చుచేసి 16 రైతు వేదికలను నిర్మించాం. రూ.10కోట్లతో కొత్త విద్యుత్ సబ్స్టేషన్లను ఏర్పాటు చేసి నిరంతర విద్యుత్ను సాగు, తాగుకు సరఫరా చేస్తున్నాం. మూడు బస్తీ దవాఖానలు ప్రారంభించి ప్రజలకు వైద్య సేవలును విస్తరించాం. ఈ దవాఖానలు సంగారెడ్డి పట్టణంలో చింతల్పల్లి, పాత సంగారెడ్డి, సదాశివపేటలో పాత అప్పర్ ప్రైమర్ హెల్త్ సెంటర్లో ఏర్పాటు చేసి మెరుగైన వైద్యసేవలు అందిస్తున్నాం.