నర్సాపూర్, మార్చి 29 : కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ అవలంభిస్తున్న రైతు, కార్మిక, ఉద్యోగ వ్యతిరేక విధానాలకు నిరసనగా చేపట్టిన దేశవ్యాప్త సమ్మె నర్సాపూర్లో సీఐటీయూ ఆధ్వర్యంలో రెండో రోజు కొనసాగింది. నర్సాపూర్ పోలీస్స్టేషన్ సమీపంలో పోచమ్మ ఆలయం వద్ద వంటావార్పు నిర్వహించారు. సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు మల్లేశం మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం రోజురోజుకి నిత్యావసర సరుకుల ధరలు పెంచి సామాన్యుడి నడ్డి విరుస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పెట్రోల్, డీజీల్, గ్యాస్ ధరల పెరుగుదల చూస్తుంటే భయమేస్తుందన్నారు. అంగన్వాడి, ఆశ ఇతర స్కీమ్ వర్కర్లందరికి కనీస వేతనం, సామాజిక బాధ్యత పథకాలు అమలు చేయాలని, సర్వీస్ క్రమబద్ధీకరణ చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు కడారి నాగరాజు, నేతలు పెంటయ్య, వెంకటయ్య, భాస్కర్, మహేశ్ పాల్గొన్నారు.
తూప్రాన్/వెల్దురి, మార్చి 29 : బీజేపీ పాలనలో రోజూ నిత్యావసర వస్తూవుల ధరలు పెంచుడూ దంచుడే అన్న చం దంగా మారాయని సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు మహేందర్రెడ్డి అన్నారు. తూప్రాన్లోని ప్రభుత్వ బాలికల పాఠశాల నుంచి ఆర్డీవో కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహిం చి, ధర్నా నిర్వహించారు. డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని డీఏవోకు సమర్పించారు. కార్యక్రమంలో నేతలు ఆసిఫ్, ఇంద్ర, సునీత, పెంటయ్య, శంకర్, కుమార్, నాగరాజు పాల్గొన్నారు.తూప్రాన్ జర్నలిస్టులు నల్ల బ్యాడ్జీలు ధరించి మున్సిపల్ కార్యాలయం ఎదుట నిరసన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో టీ యూడబ్ల్యూజే జిల్లా గౌరవాధ్యక్షుడు జానకీరాం, సీనియర్ జర్నలిస్ట్ నగేశ్, జర్నలిస్టులు వేణుగోపాల్, భాస్కర్, శ్రీనివాస్, విజయ్కుమార్, స్వామి, కృష్ణ, ప్రశాంత్, నర్సింహారెడ్డి, శ్రీనివాస్, నరేష్, రామస్వామి, మోజెస్, గౌస్, సత్యం పాల్గొన్నారు.
సీఐటీయు ఆధ్వర్యంలో మెదక్లో చేపట్టిన సమ్మెకు ఉమ్మడి వెల్దుర్తి మండలం నుంచి కార్మికులు తరలివెళ్లారు. నాయకులు గౌరీ, పోచయ్య, నీరుడి శ్రీను ఆధ్వర్యంలో బైక్ర్యాలీగా మెదక్కు వెళ్లారు.
ప్రజా వ్యతిరేక విధానాలను రద్దుచేయాలి : మల్లిఖార్జున్
మెదక్ అర్బన్, మార్చి 29 : కేంద్రం ప్రజా కార్మిక వ్యతిరేక విధానాలను మానుకోవాలని సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మల్లికార్జున్ కోరారు. మెదక్లో రాందాస్ చౌరస్తావద్ద సీఐటీయూ ముగింపు సభ కు ఆయన ముఖ్య అథితిగా హాజరయ్యారు. కార్యక్రమంలో బస్వరాజ్, గీత, వెంకట్రెడ్డి, బాలయ్య, అశోక్ పాల్గొన్నారు.