మనోహరాబాద్, ఆగస్టు 05 : గుర్తు తెలియని వాహనం ఢీ కొని ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందిన సంఘటన మనోహరాబాద్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించి ఎస్ఐ రాజుగౌడ్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. నిజామాబాద్ జిల్లా కేశాపూర్ గ్రామానికి చెందిన జోరుపల్లి ప్రశాంత్ (32) హైదరాబాద్ నగరం బేగంపేటలో నివాసం ఉంటున్నాడు.
మనోహరాబాద్ మండలం కొండాపూర్ టీఎస్ ఐఐసీలోని శ్రీయాన్ పరిశ్రమలో సూపర్వైజర్గా పని చేస్తున్నాడు. రోజులాగే తన ద్విచక్ర వాహనంపై కొండాపూర్కు వస్తుండగా.. మార్గమధ్యలో జీడిపల్లి వద్ద అతను ప్రయాణిస్తున్న ద్విచక్ర వాహనాన్ని గుర్తు తెలియని వాహనం వెనుక నుంచి ఢీ కొంది.
ఈ ప్రమాదంలో జోరుపల్లి ప్రశాంత్ (32) తీవ్రగాయాలతో అక్కడిక్కడే మృతి చెందాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ రాజుగౌడ్ తెలిపారు.