న్యూఢిల్లీ: ప్రధాని విదేశీ పర్యటనల ఖర్చు అయిదేండ్లలో అయిదు రెట్లు పెరిగింది. 2021 నుంచి ఇప్పటి వరకు రూ.550 కోట్లకు పైగా ప్రభుత్వ సొమ్మును ఆయన పర్యటనలకు ఖర్చు పెట్టారు. 2021లో రూ.36 కోట్లుగా ఉన్న ఆ ఖర్చు 2025 నాటికి రూ.180 కోట్లకు పైగా ఉంది. ఈ సంవత్సరం ప్రధాని విదేశీ పర్యటనల కోసం ప్రభుత్వం రూ.74.5 కోట్లను ఖర్చు పెట్టిందని విదేశాంగ శాఖ గురువారం రాజ్యసభకు తెలిపింది.
ఎంపీలు సంజయ్ సింగ్, సివదాసన్ అడిగిన ప్రశ్నకు విదేశాంగ శాఖ సహాయ మంత్రి మార్గరీటా బదులిస్తూ ఈ వివరాలను వెల్లడించారు. ప్రధాని ఉన్నత స్థాయి పర్యటనల సందర్భంగా చేసుకొన్న ఒప్పందాల వల్ల వివిధ కీలక రంగాల్లో దృఢమైన భాగస్వామ్యం ఏర్పడి సహకారం, సరఫరా వ్యవస్థ పెంపొందాయన్నారు.