న్యూఢిల్లీ: వర్షాకాల సమావేశాలు ప్రారంభమైనప్పటి నుంచి హోం మంత్రి అమిత్ షా పార్లమెంట్కు గైర్హాజరవుతున్న క్రమంలో రాజ్యసభ చైర్మన్ సీపీ రాధాకృష్ణ గురువారం కేంద్రానికి ఒక విజ్ఞప్తి చేశారు. పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజును ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ షా సభకు రావాలన్న విజ్ఞప్తిని పరిశీలించాలని కోరారు.
‘హోం మంత్రి సభకు హాజరు కావాలన్న నా విజ్ఞప్తిని పరిశీలించాలని కోరుతున్నా. పార్లమెంట్ వ్యవహారాల శాఖ మంత్రిగా విపక్షాల డిమాండ్ను మీరే హోం మంత్రి దృష్టికి తీసుకు పోవాలి’ అని పేర్కొన్నారు. కాగా, హోం మంత్రి అమిత్ షా సభకు హాజరు కావాలని గురువారం కూడా సభలో విపక్షాలు డిమాండ్ చేశాయి. విద్యార్థుల చలో పార్లమెంట్ సందర్భంగా వారిపై జరిగిన అమానుష దాడికి హోం మంత్రి సమాధానం చెప్పాలని విపక్షాలు కేంద్రాన్ని నిలదీస్తున్నాయి.