కొల్చారం, ఫిబ్రవరి 28 : ఎదురుగా వస్తున్న బైక్ను కారు ఢీకొట్టిన సంఘటనలో ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన సోమవారం మధ్యాహ్నం కొల్చారం పొలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. కొల్చారం ఎస్సై శ్రీనివాస్గౌడ్, ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం..వెల్దుర్తి మండలం దామరంచ గ్రామానికి చెందిన పోలంపల్లి నర్సయ్య(65) అతని కూతురు మల్లమ్మ, మరో వ్యక్తి సంతోష్తో కలిసి బైక్పై కొంగోడు వైపు నుంచి దామరంచ వెళ్తున్నారు.
ఎదురుగా వెల్దుర్తి వైపు నుంచి వస్తున్న కొల్చారం గ్రామానికి చెందిన కటికె చందు కారు ఢీకొట్టడంతో నర్సయ్య అక్కడికక్కడక్కడే మృతి చెందగా.. మల్లమ్మ, సంతోష్కు తీవ్ర గాయాలయ్యాయి. వారిని చికిత్స నిమిత్తం 108 అంబులెన్స్లో దవాఖానకు తరలించారు. మృతుడి కుటుంబ సభ్యుల పిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.