రాష్ట్ర అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో పోలింగ్ శాతం నమోదులో రాష్ట్రంలో మెదక్ జిల్లా రెండో స్థానంలో నిలిచింది. జిల్లాలో 86.69 శాతం పోలింగ్ నమోదైంది. గత ఎన్నికల కన్నా పోలింగ్ శాతం కాస్త తగ్గింది. జిల్లాలోని మెదక్, నర్సాపూర్ నియోజకవర్గాల్లో 4,40,341 మంది ఓటర్లు ఉండగా.. 579 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటుచేశారు. అందులో 3,81,761 మంది ఓటర్లు తమ ఓటు హకును వినియోగించుకున్నారు. మెదక్ నియోజకవర్గంలో 2,16,748 మంది ఓటర్లు ఉండగా, 1,84,915 ఓట్లు పోలయ్యాయి. ఈ ఎన్నికల్లో మహిళా ఓటర్లే ఓటింగ్లో అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఓటింగ్ సరళిని బట్టి చూస్తే ఏ గ్రామంలో చూసిన మహిళా ఓటర్ల చైతన్యమే ఎక్కువగా కనిపించింది. మెదక్ జిల్లాలోని రెండు నియోజకవర్గాల ఓట్ల లెక్కింపు 3న హవేళీఘనపూర్లోని వైపీఆర్ ఇంజినీరింగ్ కళాశాలలో కొనసాగనున్నది. రెండు నియోజకవర్గాలకు చెందిన ఈవీఎంలను భారీ బందోబస్తుతో ఈ కేంద్రానికి తరలించారు. కౌంటింగ్ కోసం పూర్తిస్థాయిలో ఏర్పాట్లు చేసే పనుల్లో అధికార యంత్రాంగం నిమగ్నమైంది.
మెదక్, డిసెంబర్ 1(నమస్తే తెలంగాణ): మెదక్ జిల్లాలో పోలింగ్ 86.69 శాతం నమోదైంది. గత ఎన్నికల కన్నా కాస్త తగ్గింది. మొత్తానికి జిల్లాల వారీగా చూస్తే మెదక్ రాష్ట్రంలోనే రెండో స్థానంలో నిలిచింది. జిల్లాలోని మెదక్, నర్సాపూర్ నియోజకవర్గాల్లో 4,40,341 మంది ఓటర్లు ఉండగా 579 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటుచేశారు. అందులో 3,81,761 మంది ఓటర్లు తమ ఓటు హకును వినియోగించుకున్నారు. మెదక్ నియోజకవర్గంలో 2,16,748 మంది ఓటర్లు ఉండగా, 1,84,915 ఓట్లు పోలయ్యాయి. ఇందులో పురుషులు 89,695 మంది, 95,219 మంది మహిళలు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఐదుగురు ట్రాన్స్జెండర్లు కాగా, ఒక్కరే ఓటు వేశారు. నర్సాపూర్ నియోజకవర్గంలో 2,23,593 మంది ఓటర్లు ఉండగా, 1,96,841 మంది ఓటర్లు ఓట్లు వేశారు. ఇందులో పురుషులు 97,436 మంది, మహిళలు 99,408 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇద్దరు ట్రాన్స్జెండర్లు ఓటు వేశారు. మొత్తంగా 88.10 శాతం పోలింగ్ నమోదైంది.
మెదక్ జిల్లాలోని రెండు నియోజకవర్గాల్లో 86.69 శాతం పోలింగ్ నమోదైంది. మెదక్ నియోజకవర్గంలో ఉదయం 9 గంటలకు 9.99 శాతం నమోదు కాగా, 11 గంటల వరకు 30.11 శాతం, మధ్యాహ్నం ఒంటిగంట వరకు 50.62 శాతం, 3 గంటల వరకు 69.42 శాతం, 5 గంటల వరకు 85.32 శాతం నమోదైంది. నర్సాపూర్ నియోజకవర్గంలో ఉదయం 9 గంటల వరకు 9.01 పోలింగ్ శాతం నమోదు కాగా, 11 గంటల వరకు 30.42 శాతం, మధ్యాహ్నం ఒంటిగంట వరకు 50.97 శాతం నమోదైంది. 3 గంటల వరకు 69.24 శాతం, సాయంత్రం 5 గంటల వరకు 88.10 శాతం పోలింగ్ నమోదైంది. జిల్లాలో మొత్తంగా 86.69 శాతం పోలింగ్ నమోదైంది.
మెదక్ జిల్లాలో మెదక్, నర్సాపూర్ నియోజకవర్గాలున్నాయి. మెదక్ నియోజకవర్గంలో 2018 లో 85.87 శాతం, 2023లో 85.32 శాతం నమోదైంది. నర్సాపూర్ నియోజకవర్గంలో 2018 ఎన్నికల్లో 90.53 శాతం, 2023లో 88.10 శాతం పోలింగ్ నమోదైంది. జిల్లాలో గత అసెంబ్లీ ఎన్నికలతో పోల్చి చూస్తే ఈసారి పోలింగ్ శాతం తగ్గింది. ప్రస్తుత జిల్లా పరిధిలోని మెదక్, నర్సాపూర్ రెండు నియోజక వర్గాల పరిధిలో కలిపి 4,40,341 మంది ఓటర్లు ఉండగా, 3,81,761 మంది ఓటింగులో పాల్గొన్నారు. మొత్తం 86.69 శాతంగా పోలింగ్ నమోదైంది.
2018లో మెదక్ నియోజకవర్గంలో మొత్తం ఓటర్లు 1,95,649 ఉండగా, 1,68,014 ఓట్లు పోలయ్యాయి. దీంతో 85.87 శాతం పోలింగ్ నమోదైంది. ఇందులో పురుషులు 94,088 మం దికి 87,119 మంది ఓటేశారు. 85.97 పోలింగ్ శాతం నమోదైంది. మహిళలు 1,01,544 మంది ఓటర్లకు 80,895 ఓట్లు పోలయ్యాయి. 85.79 శాతం పోలింగ్ నమోదైంది. ఇతరులు 7 ఓట్లు కాగా, రెండు పోలయ్యాయి. నర్సాపూర్ నియోజకవర్గంలో 2,02,350 మందికి 1,83,184 ఓట్లు పోల్ కాగా 90.53 శాతం పోలింగ్ జరిగింది. ఇందులో పురుషులు 99,650 మందికి 91,494 మంది ఓటేశారు. 91 శాతం పోలింగ్ జరిగింది. 1,02,696 మహిళా ఓట్లు ఉండగా, 91,690 ఓట్లు పోలయ్యాయి. 89.28 శాతం పోలింగ్ నమోదైంది. ఇతరులు 4 ఓట్లు ఉండగా 2 ఓట్లు పోలయ్యాయి.
మెదక్ నియోజకవర్గంలో 2,16,748 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో పురుషులు 1,03,654 మంది, మహిళలు 1,13,089 మంది ఉన్నారు. ఐదుగురు ఇతరులు ఉన్నారు. 1,84,920 ఓట్లు పోలయ్యాయి. ఇందులో పురుషులు 89,685 మంది, మహిళలు 95,234 మంది ఓట్లు వేశారు. ఇతరులు ఒక్కరే తమ ఓటును వినియోగించుకున్నారు. మొత్తంగా మెదక్ నియోజకవర్గంలో 85.32 శాతం పోలింగ్ నమోదైంది. నర్సాపూర్ నియోజకవర్గంలో 2,23,593 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో పురుషులు 1,09,240 మంది, మహిళలు 1,14,346 మంది ఉన్నారు. ఇతరులు ఏడుగురు ఉన్నారు. 97,436 మంది పురుషులు, 99,403 మంది మహిళలు ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఇతరులు ఇద్దరు మాత్రమే ఓటు హక్కును వినియోగించుకున్నారు. మొత్తంగా 1,96,841 ఓట్లు పోలయ్యాయి. 88.10 శాతం పోలింగ్ నమోదైంది.
ఈ నెల 3న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. మెదక్ జిల్లాలోని రెండు నియోజకవర్గాల ఓట్ల లెక్కింపు మెదక్ మెదక్ జిల్లా హవేళీఘనపూర్ మండలంలోని వైపీఆర్ ఇంజినీరింగ్ కళాశాలలో కొనసాగనున్నది. రెండు నియోజకవర్గాలకు చెందిన ఈవీఎంలను భారీ బందోబస్తుతో ఈ కేంద్రానికి తరలించారు. కౌంటింగ్ కేంద్రంలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూంలో ఈవీఎంలను భద్రపరిచారు. స్ట్రాంగ్ రూం వద్ద పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. కౌంటింగ్ కోసం పూర్తి స్థాయిలో ఏర్పాటు చేసే పనుల్లో అధికార యంత్రాంగం నిమగ్నమైంది.
రాష్ట్ర శాసన సభ ఎన్నికల్లో మహిళా ఓటర్లే పోలింగ్లో అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఓటింగ్ సరళిని బట్టి చూస్తే ఏ గ్రామంలో చూసిన మహిళా ఓటర్ల చైతన్యమే ఎక్కువగా కనిపించింది. నవంబర్ 30న జరిగిన ఎన్నికల్లో నర్సాపూర్, మెదక్ నియోజకవర్గాల్లో మహిళలే అధిక సంఖ్యలో ఓటు హక్కును వినియోగించుకున్నారు.