ఒకప్పుడు కనీస సౌకర్యాలు లేక అభివృద్ధికి ఆమడదూరంలో ఉన్న గిరిజన తండాలు తెలంగాణ వచ్చాక సీఎం కేసీఆర్ హయాంలో అన్నిరంగాల్లో దూసుకుపోతున్నాయి. ఉమ్మడి పాలనలో తీవ్ర నిర్లక్ష్యానికి గురైన గిరిజనుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేసింది. మెదక్ జిల్లాలో 62 తండాలకు పంచాయతీ హోదా కల్పించింది. రోడ్లు నిర్మించేందుకు రూ.134. 21 కోట్ల నిధులు మంజూరు చేసింది. కొత్తగా నాలుగు గిరిజన, రెండు ఆశ్రమ పాఠశాలలను అందుబాటులోకి తెచ్చింది. సంగారెడ్డిజిల్లా కేంద్రంలో దేశంలోనే మొట్టమొదటి గిరిజన రెసిడెన్షియల్ లా కాలేజీని నిర్మించింది. 81 తండాలను గ్రామ పంచాయతీలుగా ప్రకటించింది. 15,930 మందికి రూ. 14.74 కోట్ల పోస్టు మెట్రిక్ స్కాలర్షిప్లు అందజేసింది. స్వయం ఉపాధి కోసం 988 మందికి రూ.11.45 కోట్ల సబ్సిడీ రుణాలు అందజేసింది. ఒక్కో పంచాయతీ భవన నిర్మాణానికి రూ. 20లక్షలు మంజూరు చేసింది. కరెంట్ బిల్లుల భారం తగ్గించేందుకు ఉచితంగా 101 యూనిట్ల కరెంట్ను సరఫరా చేస్తున్నది. రిజర్వేషన్ను 6 నుంచి 10శాతానికి పెంచడంతో విద్య, ఉద్యోగ రంగాల్లో అవకాశాలు పెరిగి సాధికారత దిశగా ముందుకెళ్తున్నారు.
– సంగారెడ్డి/మెదక్, (నమస్తే తెలంగాణ), జూన్ 16
మెదక్, జూన్ 16 (నమస్తే తెలంగాణ): గిరిజనుల అభివృద్ధి లక్ష్యంగా ప్రత్యేక ప్రగతి నిధి చట్టాన్ని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్నది. ఎస్టీ జనాభా దామాషాను అనుసరించి నిధుల కేటాయింపునకు చట్టబద్ధత కల్పించింది. వీరికి ఉద్దేశించిన నిధులు ఇతర పథకాలకు మళ్లించకుండా రక్షణ కల్పించింది. ఏదైనా ఆర్థిక సంవత్సరంలో నిధులు పూర్తిగా వినియోగించని పక్షంలో ఇచ్చిన మాట ప్రకారం గిరిజనుల ఆకాంక్షలను నిజం చేస్తూ సీఎం కేసీఆర్ గిరిజనులకు విద్య, ఉద్యోగాల్లో 10 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తూ విప్లవాత్మక నిర్ణయం తీసుకున్నారు. 500 జనాభా దాటిన జిల్లాలోని 62 గిరిజన తండాలను గ్రామ పంచాయతీలుగా ప్రకటించారు.
విద్యాలయాలకు పెద్దపీట…
గిరిజన విద్యార్థినీ విద్యార్ధులను ఉన్నత స్థానాలకు అధిరోహించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నది. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన నాటికి గిరిజనుల కోసం జిల్లాలో కేవలం 2 విద్యాలయాలు ఉండగా, 2014 తర్వాత ఆ సంఖ్యకు ఆరుకు చేరింది. 830 నుంచి 3,980కి విద్యార్థులు పెరిగారు. గిరిజనుల కోసం జిల్లాలో రెండు ఆశ్రమ పాఠశాలలు నర్సాపూర్ మండలం మహ్మదాబాద్, టేక్మాల్లో ఏర్పాటు చేశారు. పాఠశాలల భవనాలు నిర్మించేందుకు రూ.12.60 కోట్లు మంజూరయ్యాయి. ఒకో భవనానికీ రూ.4.2 కోట్లు కాగా, ఇప్పటికే రెండు భవనాల నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి.
6 శాతం నుంచి 10 శాతం పెంపు…
తెలంగాణ జనాభాలో గిరిజనులు 6 నుంచి 10 శాతానికి పెరిగారు. ఉమ్మడి రాష్ట్రంలో అన్ని వర్గాలతోపాటు గిరిజనులు కూడా అణిచివేతకు, ఆర్థిక వెనుకబాటుకు గురయ్యారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడగానే బీఆర్ఎస్ ప్రభుత్వం గిరిజనులకు ప్రత్యేక నిధి ఏర్పాటుచేసి భారీగా నిధులు కేటాయించింది. వీటిని ఏ సంవత్సరానికి ఆ సంవత్సరమే ఖర్చు చేయాలని, ఒకవేళ వినియోగించకపోతే తర్వాత సంత్సరానికి బదిలీ చేయాలని నిర్ణయించింది.
101 యూనిట్లు ఉచిత విద్యుత్…
గిరిజన కుటుంబాల్లో విద్యుత్ కాంతులు నింపేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఉచిత విద్యుత్ను సరఫరా చేస్తున్నది.101 యూనిట్ల వరకు విద్యుత్ వినియోగంపై ఎలాంటి చార్జీలను చెల్లించాల్సిన అవసరం లేదని ప్రకటించింది. 2018 సెప్టెంబరు ఒకటో తేదీ నుంచి ఈ పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్నది. ఉమ్మడి పాలనలో 50 యూనిట్ల వరకు ఉచితంగా సరఫరా చేసినా పూర్తిస్థాయిలో ప్రయోజనం దకలేదు. దీంతో తెలంగాణ ఏర్పాటయ్యాక 50 నుంచి 101 యూనిట్లకు పెంచుతూ బీఆర్ఎస్ సర్కార్ నిర్ణయం తీసుకున్నది. ఇందుకోసం జిల్లాలో ఇప్పటి వరకు రూ.6 కోట్ల 35 లక్షల నిధులు ఖర్చు చేసింది. గతంలో విద్యుత్ చౌర్యం కేసుల్లో ఇబ్బందుల పాలైన గిరిజన వినియోగదారులకు ఈ నిర్ణయం ఊరటనిస్తున్నది. దీనివల్ల ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు ఎంతో ప్రయోజనం చేకూరుతుంది. అర్హులైన వినియోగదారులకు నెలకు రూ.330 వరకు ప్రభుత్వమే చెల్లిస్తున్నది.
కుల ధ్రువీకరణ ఆధారంగా..
రెవెన్యూ అధికారులు జారీ చేసే కుల ధ్రువీకరణ ఆధారంగానే ఉచిత విద్యుత్ ఫథకాన్ని వర్తింపజేయనున్నారు. క్షేత్రస్థాయిలో విద్యుత్ వినియోగాన్ని పరిశీలించిన అనంతరం ఈ పథకానికి అర్హులుగా గుర్తిస్తారు. తహసీల్దార్ జారీ చేసిన కుల ధ్రువీకరణ పత్రంతో మీ సేవ కేంద్రాల్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అనంతరం సంబంధిత ఏఈవోలు పరిశీలించి అర్హులుగా ఎంపిక చేస్తారు. ఒకవేళ యజమాని మరణిస్తే సర్వీస్ నెంబర్ను మార్చుకునేందుకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. కుల ధ్రువీకరణ పత్రం పొందిన ఎస్టీ వినియోగదారులు నేరుగా విద్యుత్ శాఖ కార్యాలయంలో సంప్రదిస్తే ప్రత్యేక పోర్టల్లో అప్లోడ్ చేసి పథకం వర్తించేలా చర్యలు తీసుకుంటారు.
ఒకో గ్రామ పంచాయతీ భవనానికి రూ.20 లక్షలు..
మెదక్ జిల్లాలో 83వేల గిరిజన జనాభా ఉంది. నూతనంగా ప్రకటించిన 62 గిరిజన పంచాయతీల భవన నిర్మాణాల కోసం ఒక్కో భవనాన్ని రూ.20 లక్షలతో నిర్మించేలా ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. ఒకప్పుడు గిరిజన తండాలకు వెళ్లాలంటే గిరిజనులతో పాటు ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యేవారు. తండాలకు రోడ్డు సౌకర్యం కోసం రూ.134 కోట్ల నిధులు మంజూరు చేసింది. దీంతో, తండాలకు వెళ్లే రోడ్లన్నీ అందంగా దర్శనమిస్తున్నాయి. తండాల్లో పాలన జోరుగా సాగుతోంది. స్థానిక సమస్యలను పరిషరిస్తూ అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు సరారు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నది. గతంలో వివిధ అవసరాల నిమిత్తం తండాల నుంచి పకనే ఉన్న గ్రామాలకు వెళ్లి అవసరమైన సరుకులు, వస్తువులతో పాటు రేషన్ తీసుకునే వారు. ఇప్పుడు స్థానకంగానే రేషన్ పంపిణీ చేస్తున్నారు.
అభివృద్ధిలో దూసుకుపోతున్న గుజిరితండా
నర్సాపూర్, జూన్16: తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రాగానే గిరిజన తండాలకు మహర్దశ చేకూరింది. గిరిజన తండాలను గ్రామ పంచాయతీలుగా చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్ తండాల్లో అభివృద్ధిని పరుగులు పెట్టించారు. చిలిపిచెడ్ మండల పరిధిలోని గుజిరితండా నూతన పంచాయతీగా ఏర్పడ్డాక అభివృద్ధి పనులు వేగవంతమయ్యాయి. రాష్ట్రం ఏర్పడక ముందు గురిజి తండా అభివృద్ధికి ఆమడదూరంలో ఉండేది. మంచినీటి కోసం మహిళలు బిందెలు పట్టుకొని బోర్ల దగ్గరకు వెళ్లేవారు. గ్రామంలో సీసీ రోడ్లు లేక బురదమయంగా ఉండేది. తెలంగాణ ఏర్పడిన తర్వాత గ్రామ రూపురేఖలే మారిపోయాయి. గుజిరితండా గ్రామ జనాభా 621, మొత్తం వార్డుల సంఖ్య 8. రూ.80 లక్షల నిధులతో గ్రామంలో సీసీ రోడ్లను వేయించారు.
రూ.5 లక్షలతో మురికికాలువలు, జడ్పీ నిధుల నుంచి 2 బోర్లు వేయించి 20వేల లీటర్ల సామర్థ్యంతో రెండు మిషన్ భగీరథ వాటర్ ట్యాంకులను నిర్మించారు. అలాగే దాతల సహకారంతో గ్రామంలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. వీటితోపాటు శ్మశాన వాటిక, డంపింగ్ యార్డ్, పల్లె ప్రకృతివనం, క్రీడాప్రాంగణం, చిట్కూల్ గ్రామం నుంచి గుజరితండా వరకు రూ.1.98 కోట్లతో బీటీ రోడ్డు వేయడంతో ప్రయాణ ఇబ్బందులు తొలగిపోయాయి. అలాగే గ్రామ పంచాయతీ భవన నిర్మాణం కోసం తెలంగాణ ప్రభుత్వం రూ.20 లక్షలు, రెండు ఎస్టీ కమ్యూనిటీ హాళ్లు, మురికికాలువలకు నిధులు మంజూరు చేసింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మా గ్రామం అన్ని విధాలా అభివృద్ధి చెందిందని, మళ్లీ బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తే గ్రామం ఇంకా అభివృద్ధి చెందుతుందని గ్రామ సర్పంచ్ ముడావత్ రాకేశ్ నాయక్ పేర్కొన్నారు.
గిరిజన పంచాయతీల్లో ప్రత్యేక గ్రామ సభలు
– మెదక్ కలెక్టర్ రాజర్షి షా
మెదక్, జూన్ 16 (నమస్తే తెలంగాణ) : తెలంగాణ రాష్ట్రావతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా శనివారం 80 గిరిజన గ్రామ పంచాయతీల్లో ప్రత్యేక గ్రామ సభలు నిర్వహిస్తున్నట్లు మెదక్ కలెక్టర్ రాజర్షి షా శుక్రవారం ప్రకటనలో తెలిపారు. ఆయా గ్రామాల్లో ప్రజలు గిరిజన సంప్రదాయ దుస్తుల్లో ఊరేగింపులో పాల్గొని ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. గ్రామ సభలో ఆరు రకాల ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడంతోపాటు గిరిజనుల సంక్షేమం కోసం తండాలకు పంచాయతీ హోదా కల్పించిన విషయాన్ని, విద్య, ఉద్యోగాల్లో పది శాతం రిజర్వేషన్, బంజారా, ఆదివాసీ భవనాలు, కొమురం భీం, సేవాలాల్ మహరాజ్ జయంతి ఉత్సవాలు అధికారికంగా నిర్వహిస్తున్న సంగతులను గిరిజనులకు తెలియజేయాలన్నారు. ఈ సందర్భంగా గిరిజన పెద్దలతో మాట్లాడించి, సన్మానాలు చేయాలన్నారు. గిరిజనుల సంక్షేమానికి ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు, లబ్ధిపొందిన వారి వివరాలతో ముద్రించిన కరపత్రాలు ఆవిషరించి పంపిణీ చేయాలని, డాక్యుమెంటరీ చిత్రాన్ని ప్రదర్శించాలన్నారు. 57 గ్రామ పంచాయతీలకు నూతనంగా మంజూరు చేసిన భవనాల నిర్మాణాలకు శంకుస్థాపన ఏర్పాట్లు చేయాలని పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ అధికారులకు సూచించారు. మాసాయిపేట మండలం రామంతాపూర్ తండాలో నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్ రెడ్డి కార్యక్రమాల్లో పాల్గొంటారని కలెక్టర్ తెలిపారు.
దేశంలోనే మొదటిసారిగా గిరిజనుల కోసం సంగారెడ్డిలో లా కాలేజీ
ముఖ్యమంత్రి కేసీఆర్ గిరిజనులకు మెరుగైన విద్యావకాశాలు కల్పించేందుకు అనే చర్యలు తీసుకున్నారు. ఇందులోభాగంగా దేశంలోనే మొదటిసారిగా సంగారెడ్డిలో గిరిజన రెసిడెన్షియల్ లా కాలేజీని ఏర్పాటు చేశారు. గిరిజన సంక్షేమశాఖ ఆధ్వర్యంలో సంగారెడ్డిలో ఏర్పాటైన గిరిజన లా కాలేజీ ఉస్మానియా యూనివర్సిటీకి అనుబంధంగా పనిచేస్తోంది. గిరిజన లా కాలేజీలో ఐదు సంవత్సరాల లా కోర్సును ప్రారంభించారు. గిరిజన శాఖ మంత్రి సత్యవతిరాథోడ్, ఆర్థిక, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్రావు మార్చి 27, 2021లో గిరిజన లా కాలేజీ తరగతులను ప్రారంభించారు. 60 మంది విద్యార్థులు ప్రస్తుతం గిరిజన లా కాలేజీలో లా కోర్సు చేస్తున్నారు. గిరిజన లా కాలేజీకి బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అనుమతి ఉంది. కళాశాలలో హాస్టల్ వసతి ఉండటంతోపాటు అధునాతన లైబ్రరీ ఏర్పాటు చేశారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు చెందిన గిరిజన విద్యార్థులు సంగారెడ్డి గిరిజన లా కాలేజీలు చదువుతున్నారు.
సంగారెడ్డి, జూన్ 16(నమస్తే తెలంగాణ): ఉమ్మడి రాష్ట్రంలో గిరిజనులు నిర్లక్ష్యానికి గురయ్యారు. గిరిజన అవాసాప్రాంతాలు అభివృద్ధికి దూరమయ్యాయి. గిరిజనులు విద్యా, వైద్య సదుపాయాలు లేక ఇక్కట్లు ఎదుర్కొన్నారు. ఆర్థిక స్వావలంబన సాధించే కార్యక్రమాలను ఉమ్మడి పాలకులు ఒక్కటీ చేపట్టలేదు. ఫలితంగా సంగారెడ్డి జిల్లాలోని గిరిజనులు తీవ్ర వెనుకబాటుకు గురయ్యారు. స్వరాష్ట్రంలోనే తాము అభివృద్ధి చెందుతామని కేసీఆర్ వెన్నంటి నడిచారు. తెలంగాణ ఆవిర్భావం అనంతరం సీఎం కేసీఆర్ గిరిజన సంక్షేమానికి పెద్దపీట వేశారు. సంగారెడ్డి జిల్లాలోని గిరిజన తండాలకు పంచాయతీ హోదాలు కల్పించటంతోపాటు తండాల అభివృద్ధికి పెద్దఎత్తున నిధులు కేటాయించారు. గిరిజనులకు ప్రభుత్వ ఉద్యోగాల్లో పదిశాతం ఉద్యోగ అవకాశాలు కల్పించారు. గిరిజన సంక్షేమ హాస్టళ్లు, గురుకులాల ఏర్పాటు చేసి గిరిజనులు విరివిగా విద్యను అభ్యసించేలా చర్యలు తీసుకున్నారు. గిరిజనులకు మెరుగైన వైద్య సదుపాయాలను సీఎం కేసీఆర్ అందుబాటులోకి తీసుకువచ్చారు. ఉమ్మడి పాలకులు నిర్లక్ష్యం చేసిన గిరిజనుల పండుగలను సీఎం కేసీఆర్ ఘనంగా నిర్వహించారు. గిరజనులు ఆరాధ్యదైవమైన సేవాలాల్ మహరాజ్ జయంతి వేడుకలను ఏటా ప్రభుత్వం అధికారికంగా ఘనంగా నిర్వహిస్తోంది.
ఉద్యోగాల్లో రిజర్వేషన్లు
రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గిరిజనుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని కీలక నిర్ణయం తీసుకున్నారు. గిరిజనుల రిజర్వేషన్ శాతాన్ని 6 నుంచి 10 శాతానికి సీఎం కేసీఆర్ పెంచారు. ఏళ్లుగా సంగారెడ్డి జిల్లాలోని గిరిజనులు, గిరిజన సంఘాల నాయకులు రిజర్వేషన్ల పెంపు కోసం డిమాండ్ చేస్తూ వచ్చారు. గిరిజనుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని సీఎం కేసీఆర్ గిరిజనుల రిజర్వేషన్లు పెంచారు. రిజర్వేషన్ల పెంపుతో ఎస్టీలకు విద్య, ఉద్యోగ అవకాశాలు మెరుగయ్యాయి. అలాగే సీఎం కేసీఆర్ మద్యం షాపుల లైసెన్స్ల కేటాయింపుల్లో సైతం ఎస్టీలకు రిజర్వేషన్లు కల్పించారు.
కల్యాణలక్ష్మి, ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్స్
రాష్ట్ర ప్రభుత్వం సంగారెడ్డి జిల్లాలోని గిరిజనులు, గిరిజన విద్యార్థుల సంక్షేమానికి పెద్దపీట వేసింది. జిల్లాలో 15,930 మంది గిరిజన విద్యార్థులకు 14.74 కోట్ల పోస్టు మెట్రిక్ స్కాలర్షిప్లు అందజేసింది. 2575మందికి రూ.38.62 కోట్ల ప్రీ మెట్రిక్ స్కాలర్షిప్లు ఇచ్చింది. అంబేద్కర్ ఓవర్సీస్ విద్యానిధి కింద ముగ్గురు విద్యార్థులకు రూ.61.50లక్షలు అందజేసింది. కల్యాణలక్ష్మి పథకం కింద 3936 మందికి రూ.39.40కోట్లు ప్రభుత్వం అందజేసింది. స్వయం ఉపాధి కోసం 988 మంది గిరిజనులకు ప్రభుత్వం రూ.11.45 కోట్ల సబ్సిడీ రుణాలు అందజేసింది. సంగారెడ్డి జిల్లాలో ప్రభుత్వం ఎనిమిది ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూళ్లను ఏర్పాటు చేసింది. వీటి కోసం రూ.25 కోట్లు ఖర్చు చేసింది.
పోడుభూములు పంపిణీ
సంగారెడ్డి జిల్లాలో ఎస్టీలు ఎంతోకాలంగా పోడుభూములను సాగుచేస్తూ జీవనం సాగిస్తున్నారు. తాము సాగు చేసుకుంటున్న భూములపై హక్కులు కల్పించాలని ఎస్టీలు ఎంతోకాలంగా డిమాండ్ చేస్తున్నారు. ఉమ్మడి పాలకులు గిరిజనుల డిమాండ్ను పట్టించుకోలేదు. సీఎం కేసీఆర్ మాత్రం పోడుభూములకు పట్టాలు ఇస్తామని హామీ ఇచ్చారు. సీఎం హామీ మేరకు సంగారెడ్డి జిల్లాలో పోడుభూములు సాగు చేస్తున్న వారి నుంచి దరఖాస్తులు స్వీకరించారు. నారాయణఖేడ్, జహీరాబాద్, అందోలు నియోజకవర్గాలకు చెందిన గిరిజనులు పోడుభూములపై హక్కులు కల్పించాలని 3,903 మంది దరఖాస్తులు చేసుకున్నారు. కాగా వీరిలో అర్హులను అధికారులు గుర్తించారు. మొదటి విడుతలో జిల్లాలో 1127మంది గిరిజనులకు 1808 ఎకరాల భూములకు సంబంధించిన పట్టాలను అందజేయనున్నారు.
గిరిజన తండాలకు మహర్దశ
ఉమ్మడి పాలనలో నిర్లక్ష్యానికి గురైన తండాలకు సీఎం కేసీఆర్ మహర్దశ తీసుకొచ్చారు. సంగారెడ్డి జిల్లాలోని తండావాసులు ఎంతో కాలంగా తండాలను పంచాయతీలుగా మార్చాలని డిమాండ్ చేసినా అప్పటిపాలకులు పట్టించుకోలేదు. సీఎం కేసీఆర్ సంగారెడ్డి జిల్లాలోని 81 తండాలను గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు చేశారు. అత్యధికంగా నారాయణఖేడ్ నియోజకవర్గంలో 48 తండాలు పంచాయతీలుగా మారాయి. కొత్తగా ఏర్పాటైన 81 పంచాయతీల్లో పంచాయతీ భవనాల నిర్మాణానికి ఒక్కోదానికి రూ.20 లక్షల నిధులను ప్రభుత్వం మంజూరు చేసింది. సంగారెడ్డి జిల్లాలోని ప్రతి గిరిజన తండాకు ప్రభుత్వం మిషన్భగీరథ ద్వారా తాగునీటి సౌకర్యం కల్పించింది. 119 గిరిజన ఆవాసాల్లో వ్యవసాయానికి త్రీఫేజ్ కరెంటు సరఫరా కోసం ప్రభుత్వం రూ.4 కోట్ల నిధులు ఖర్చు చేసింది. జిల్లాలోని 6,675 గిరిజన కుటుంబాలకు 101 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందజేస్తుంది. ఉచిత విద్యుత్ సరఫరా కోసం ప్రభుత్వం ఇప్పటివరకు రూ.3.40 కోట్లు ఖర్చు చేసింది. తండాల్లో బీటీ రోడ్ల నిర్మాణం కోసం ప్రభుత్వం రూ.63.80 కోట్ల నిధును వెచ్చించింది.