హవేళీఘనపూర్/ టేక్మాల్/ వెల్దుర్తి/ మనోహరాబాద్, మే 9 : ప్రభుత్వం అంధత్వ నివారణ కోసం చేపట్టిన కంటి వెలు గు కార్యక్రమాన్ని ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని ఎంపీపీ శేరి నారాయణరెడ్డి అన్నారు. మంగళవారం హవేళీఘనపూర్ మండల పరిధిలోని నాగాపూర్ గ్రామంలో కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భం గా ఎంపీపీ మాట్లాడుతూ.. కంటి వెలుగు శిబిరాల్లో పైసా ఖర్చు లేకుండా కంటి పరీక్షలు చేయించుకుని, ప్రజలు కంటి సమస్యలను దూరంగా చేసుకోవాలన్నారు. కంటి వెలుగు శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమం లో ఎంపీటీసీల ఫోరం జిల్లా అధ్యక్షుడు కసిరెడ్డి మాణిక్యరెడ్డి, ఎంపీడీవో శ్రీరామ్, సర్పంచ్ రాజేందర్ పాల్గొన్నారు.
‘కంటి వెలుగు’తో అంధత్వ నిర్మూలన
టేక్మాల్ మండలం బొడ్మట్పల్లి గ్రామంలో కంటివెలుగు శిబరాన్ని ఎంపీపీ చింత స్వప్నారవి, సర్పంచ్ స్వరూపాదశరథ్గౌడ్ ప్రారంబించారు. ఈ సందర్భంగా ఎంపీపీ మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ అంధత్వ నిర్మూలనకు కంటి వెలుగు పథకాన్ని ప్రారంభించారన్నారు. ప్రతి ఒక్కరూ కంటి వెలుగు శిబిరంలో కంటి పరీక్షలు చేయించుకుని, చూపు సమస్యలను పరిష్కరించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ శంకరమ్మ, వార్డు సభ్యులు, వైద్య సిబ్బంది ఉన్నారు.
హాస్తాల్పూర్లో కంటివెలుగు ప్రారంభం..
వెల్దుర్తి మండలంలోని హస్తాల్పూర్లో కంటి వెలుగు శిబి రాన్ని ఎంపీవో విఘ్నేశ్వర్, ఎంపీపీ స్వరూప, నాయకులు నరేందర్రెడ్డి, పాండురంగం, డాక్టర్ మౌనిక ప్రారంభించా రు. ఈ సందర్భంగా ఎంపీపీ మాట్లాడుతూ కంటివెలుగు కా ర్యక్రమం మండలంలో విజయవంతంగా కొనసాగుతున్నద న్నారు. గ్రామస్తులు స్వచ్ఛందంగా శిబిరాలకు తరలివస్తూ కంటి పరీక్షలు చేయించుకుంటున్నారని తెలిపారు.
కంటి వెలుగు దేశానికే ఆదర్శం..
మనోహరాబాద్ మండలంలోని కోనాయిపల్లి(పీటీ)లో కంటి వెలుగు శిబిరాన్ని పీఏసీఎస్ చైర్మన్ మెట్టు బాలకృష్ణారెడ్డి, వైస్ ఎంపీపీ విఠల్రెడ్డి, సర్పంచ్ భాషబోయిన ప్రభావతీపెంటయ్యముదిరాజ్, ముదిరాజ్ సంఘం రాష్ట్ర నాయకుడు చంద్రశేఖర్ ముదిరాజ్ ప్రారంభించారు. ఈ సందర్భం గా వారు మాట్లాడుతూ… తెలంగాణలో నిర్వహిస్తున్న కంటి వెలుగు కార్యక్రమం దేశానికే ఆదర్శంగా నిలిచిందన్నారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్లు ధర్మేందర్, నవీన్కుమార్, ఎంపీడీవో యాదగిరిరెడ్డి, నాయకులు రమేశ్, పురం రవి ముదిరాజ్, భాస్కర్, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.