తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా నేడు 2కే రన్ నిర్వహించనున్నారు. ఉదయం 6 గంటలకు మెదక్ పట్టణంలో రాందాస్ చౌరస్తా నుంచి ప్రభుత్వ జూనియర్ కళాశాల వరకు, నర్సాపూర్ పట్టణంలో పద్మజ దవాఖాన నుంచి అల్లూరి సీతారామరాజు ట్రైబల్ వెల్ఫేర్ స్కూల్ వరకు, తూప్రాన్లో పోతరాజ్పల్లి కమాన్ నుంచి పోలీస్స్టేషన్ వరకు రన్ నిర్వహించనున్నారు. సంగారెడ్డిలో పోలీస్ జిల్లా కార్యాలయం నుంచి కొత్త బస్టాండ్ వరకు 2కే రన్ చేపట్టనున్నారు. ప్రజాప్రతినిధులు, యువత, విద్యార్థులు, ఉద్యోగులు, ప్రజాప్రతినిధులతో పాటు అన్ని రంగాల వారు తెలంగాణ ఐక్యతను చాటేందుకు సిద్ధమయ్యారు.
-సంగారెడ్డి/మెదక్, న్యూస్నెట్వర్క్, జూన్ 11
పాపన్నపేట, జూన్ 11 : రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా సోమవారం నిర్వహిస్తున్న 2 కేరన్ను విజయవంతం చేయాలని ఎస్పీ రోహిణి ప్రియదర్శిని సూచించారు. ఈ మేరకు ఆమె మాట్లాడుతూ ఉదయం 5.30 గంటలకు మెదక్ పట్టణంలో రాందాస్ ఎక్స్ రోడ్ నుంచి ప్రభుత్వ జూనియర్ కళాశాల వరకు, నర్సాపూర్ పట్టణంలో పద్మజ దవాఖాన నుంచి అల్లూరి సీతారామరాజు ట్రైబల్ వెల్ఫేర్ స్కూల్ వరకు తూప్రాన్ పట్టణంలోని పోతరాజ్పల్లి కమాన్ నుంచి తూప్రాన్ పోలీస్స్టేషన్ వరకు 2కే రన్ ప్రారంభమవుతుందన్నారు. పట్టణ ప్రజలు ఈ కార్యక్రమంలో పాల్గొని క్రీడాస్ఫూర్తిని చాటాలని విజ్ఞప్తి చేశారు.