సిద్దిపేట అర్బన్, ఫిబ్రవరి 26: రేపటి నుంచి ప్రారంభం కాను న్న ఇంటర్మీడియెట్ వార్షిక పరీక్షలకు అధికారులు అన్ని ఏర్పా ట్లు పూర్తి చేశారు. పరీక్షలు మార్చి 19 వరకు కొనసాగనున్నాయి. సిద్దిపేట జిల్లాలో 44 పరీక్షా కేం ద్రాలు ఏర్పాటు చేయగా.. మొత్తం 20,949 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. ఏదైనా సందేహాలు నివృత్తి చేసుకోవాలంటే జిల్లా ఇంటర్మీడియట్ కార్యాలయం లో కంట్రోల్ రూమ్ను సైతం ఏర్పాటు చేశారు. ఉదయం తొ మ్మిది నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు జరుగనున్నాయి. ఒక నిమిషం నిబంధన అమలులో ఉన్నందున విద్యార్థులు పరీక్షా కేంద్రాలకు గంట ముందే చేరుకోవాలని అధికారులు తెలిపారు. విద్యార్థులు ఎలాంటి ఒత్తిడికి లోనుకాకుండా ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాయాలని అధికారులు సూచిస్తున్నారు.
ఇంటర్ పరీక్షలను సజావుగా నిర్వహించేందుకు అధికారులు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేశా రు. సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా 44 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేయగా.. మొత్తం 20,949 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. ఇందులో జనరల్ విద్యార్థులు 15,553 మంది, 5,396 మంది ఒకేషనల్ విద్యార్థులు ఉన్నారు. 9,831 మంది మొదటి సంవత్సరం విద్యార్థులు ఉండగా.. ఇందులో 7,441 మంది జనరల్ విద్యార్థులు, 2,390 మం ది ఒకేషనల్ విద్యార్థులు ఉన్నా రు. 11,118 మంది ఇంటర్ సెకండియర్ విద్యార్థులు ఉండ గా.. ఇందులో 8,112 మంది జనరల్ విద్యార్థులు, 3,006 మంది ఒకేషనల్ విద్యార్థులు పరీక్ష రాయనున్నారు. మొత్తం 44 పరీక్షా కేంద్రాల్లో 20 ప్రభు త్వ జూనియర్ కళాశాలలు, 15 ప్రైవేట్ జూనియర్ కళాశాలలు, మరో తొమ్మిది ప్రభుత్వ అనుబంధ కళాశాలలున్నాయి.
పరీక్షల నిర్వహణలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరుగకుండా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందుకు విద్య, వై ద్య, రెవెన్యూ, పోలీస్, విద్యు త్, ఆర్టీసీ, పోస్టల్శాఖల అధికారులతో అడిషనల్ కలెక్టర్ శ్రీనివాస్రెడ్డి ఇప్పటికే సమీక్షా స మావేశం నిర్వహించి వారికి త గు సూచనలు చేశారు. 44 పరీ క్ష కేంద్రాలకు 44 మంది చీఫ్ సూపరింటెండెంట్లు, 44 మం ది డిపార్ట్మెంటల్ అధికారులు ఉంటారు. సిట్టింగ్ స్కాడ్, రెండు ఫ్లయింగ్ స్కాడ్ టీమ్ లు నియమించడంతో పాటు అడిషనల్ సూపరింటెండెంట్లు, రూట్ ఆఫీసర్లు విధులు నిర్వహిస్తారు. జిల్లాలో మొత్తం 17 స్టోరేజీ పాయింట్లు ఏర్పాటు చేశారు. పారదర్శకంగా పరీక్ష లు నిర్వహించేందుకు ప్రతి ప రీక్షా కేంద్రంలో సీసీ కెమెరాలు ఉండేటట్లు ఏర్పాటు చేసి.. సీసీ కెమెరా పర్యవేక్షణలోనే క్వశ్చన్ పేపర్ను రిలీజ్ చేయనున్నారు. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్ష న్ అమలు చేయనున్నట్లు అధికారులు తెలిపారు. ప్రతి పరీక్షా కేంద్రం వద్ద ఏఎన్ఎంలు, ప్రా థమిక చికిత్సకు అవసమయ్యే మెడిసిన్లు, ఓఆర్ఎస్ ప్యాకెట్లు, తాగునీటని అందుబాటులో ఉంచనున్నారు.
సిద్దిపేట జిల్లాలో ఇంటర్ పరీక్షలు రాసే విద్యార్థుల సౌకర్యార్థం జిల్లా ఇంటర్మీడియట్ కార్యాలయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. సమస్యలు, సందేహాలు ఉంటే కంట్రోల్ రూమ్ సెల్: 9985128599, 99493 30191 నంబర్లలో సంప్రదించాలని జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి సూర్యప్రకాశ్ తెలిపారు. సెంటర్ లోకేటెడ్ యాప్ ద్వారా విద్యార్థులు పరీక్షా కేంద్రం చిరునామా తెలుసుకోవచ్చన్నారు.
ఒక నిమిషం నిబంధన అమలులో ఉన్నందున విద్యార్థులు గంట ముందే పరీక్షా కేంద్రానికి చేరుకోవాలి. ఎలాంటి ఒత్తిడికి లోనుకాకుండా ప్రశాంత వాతావరణంలో, ఆత్మవిశ్వాసంతో పరీక్ష రాయాలి. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లను ఇప్పటికే పూర్తి చేశాం. విద్యార్థులకు ఏమైనా సందేహాలుంటే ఇంటర్మీడియట్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ నంబర్లకు ఫోన్ చేసి సందేహాలు నివృత్తి చేసుకోవచ్చు.