నర్సాపూర్/ శివ్వంపేట/ మెదక్ అర్బన్/ నర్సాపూర్, అక్టోబర్ 27 : ఎన్నికల సమయంలో పోటీ చేస్తున్న అభ్యర్థులు లేదా రాజకీయ నాయకులు ప్రలోభపెట్టినా, బయభ్రాంతులకు గురిచేసినా ఓటర్లు 1950 టోల్ఫ్రీ నెంబర్కు లేదా సీ-విజిల్ ఆప్లో ఫిర్యాదు చే యాలని మెదక్ జిల్లా ఎన్నికల అధికారి రాజర్జిషా అన్నా రు. శుక్రవారం నర్సాపూర్ మున్సిపాలిటీలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఓటర్ల అవగాహన చైతన్యసదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా ఎన్నికల అధికారి రాజర్షిషా, ఎస్పీ రోహిణిప్రియదర్శిని ముఖ్య అతిథు లుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లా ఎన్నికల అధికారి రాజర్షిషా మాట్లాడుతూ.. రాజకీయ నాయకులు ఓటర్ల ను బయపెట్టిన, ప్రలోభాలకు గురిచేసిన ఎన్నికల నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఓటర్లు 1950 లేదా 100 టోల్ఫ్రీ నెంబర్లకు ఫోన్ చేసి, సమాచారం ఇస్తే 100 నిమిషాల్లో చర్యలు తీసుకుంటామని తెలిపారు. సీ-విజిల్ ఆప్లో ఫిర్యాదు చేస్తే ఫిర్యాదుదారుడి సమాచారం గోప్యంగా ఉంటుందని తెలిపారు. నూతన ఓటర్లకు శుభాకాంక్షలు తెలిపారు. నవంబర్ 30న ప్రతి ఒక్కరూ ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకోవాలని సూచించారు. బీఎల్వోలు ఓటరు గుర్తింపు పత్రాలను అందజేస్తారని తెలిపారు. 2018 లో మెదక్ జిల్లాలో 81 శాతం పోలింగ్ శాతం నమోదయిందని, ఈసారి వందశాతం చేరాలని సూచించారు. జిల్లా ఎన్ని కల అధికారి రాజర్షిపా ఓటర్లతో ప్రతిజ్ఞ చేయించారు.
ఓటు హక్కు పొందిన ప్రతి ఒక్కరూ నవంబర్ 30న తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఎస్పీ రోహి ణిప్రియదర్శిని సూచించారు. ఎలాంటి నాయకుడు కావా లో ఓటరే నిర్ణయించాలని తెలిపారు. ప్రపంచంలో అతి పెద్ద ప్రజాస్వామ్యం మనదేశంలో ఉన్నదని, ప్రజలను పాలించే నాయకుడిని ప్రజలే నిర్ణయిస్తారని వెల్లడించారు. ప్రతిరోజూ మూడు మండలాల చొప్పున తిరుగుతూ ఓటర్లకు అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు. ఓటర్లు ప్రలోభాలకు లొంగకుండా, భయానికి గురికాకుండా ఓటేయ్యాలని సూచించారు. ఓటర్ల కు డబ్బులు ఇచ్చినా నేరమేనని ఎస్పీ హెచ్చరించారు. కార్యక్రమంలో నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి శ్రీనివాసులు, స్వీప్ నోడల్ అధికారి రాజిరెడ్డి, డీడబ్ల్యూవో బ్రహ్మాజీ, తహసీల్దార్ కమలాద్రి, బీఎల్వోలు, ఓటర్లు పాల్గొన్నారు.
అసెంబ్లీ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా ప్రజ లంతా సహకరించాలని జిల్లా ఎన్నికల అధికారి రాజర్షి షా, ఎస్పీ రోహణిప్రియదర్శిని అన్నారు. ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను పోలీసులకు సూచించారు. ఈ మేరకు శివ్వంపేట మండలకేంద్రంతోపాటు దొంతి, గోమారం, కొంతాన్పల్లి గ్రామాల్లో సాయుధ బలగాలతో పోలీసులు కవాతు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజాస్వామ్యబద్ధంగా ఓటర్లు స్వేచ్ఛగా ఓటేసేందుకు పోలీసు వ్యవస్థ అండగా ఉంటుందని, ప్రతి ఒక్కరూ ఎన్నికల నియమాలను తప్పకుండా పాటించాలన్నారు. ఎవరైనా అల్లర్లు రేకెత్తించినా, ప్రజలను ఇబ్బందులకు గురిచేసినా, కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మీకు మేమున్నాం అని ప్రజలకు ధైర్యం చెప్పారు. కార్యక్రమంలో తూప్రాన్ డీఎస్పీ యాదగిరిరెడ్డి, తూప్రాన్ సీఐ శ్రీధర్, ఆర్డీవో శ్రీనివాసులు, తహసీల్దార్ శ్రీనివాస్చారీ, ఎస్సై రవికాంత్రావుతోపాటు సెంట్రల్ ఫోర్స్ సిబ్బంది పాల్గొన్నారు.
సాధారణ ఎన్నికలు 2023లో భాగంగా మెదక్ నియోజకవర్గం ఆర్ఓ కార్యాలయాన్ని ఎస్పీ రోహిణిప్రియదర్శినితో కలిసి జిల్లా ఎన్నికల అధికారి రాజర్షిషా పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. త్వరలో నామినేషన్ల ప్ర క్రియ ప్రారంభం కానున్న సందర్భంగా ఆర్వో కార్యాలయం లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, సూచనలు చేశారు. ప్రతి నామినేషన్ పత్రాన్ని క్షుణంగా పరిశీలించడం, వచ్చిన నామినేషన్ పత్రాన్ని ప్రదర్శనలో పెట్టాలని, ఎన్నికల నిబంధనలను కచ్చితంగా అమలు చేయాలని ఆదేశించారు. నవంబర్ 3న నామినేషన్ నోటిఫికేషన్, 10న నామినేషన్ ఇవ్వడానికి ఆఖరి తేదీ, 13న నామినేషన్ల పరిశీలన, 15న నామినేషన్లు ఉపసంహరణ, 30న పోలింగ్, డిసెంబర్ 3న కౌంటింగ్ జరుగుతుందని పేర్కొన్నారు. డిసెంబర్ 5 వరకు ఎన్నికల నిబంధనలు అమలులో ఉంటాయని తెలిపారు. కార్యక్రమంలో మెదక్ ఆర్వో రాజేశ్వర్, అడిషనల్ ఎస్పీ మహేందర్, డీఎస్పీ ఫణీంద్ర, తహసీల్దార్ శ్రీనివాస్, ఎన్నికల సిబ్బంది పాల్గొన్నారు.
నర్సాపూర్ ఆర్వో కార్యాలయాన్ని ఎస్పీ రోహిణిప్రియదర్శిని, జిల్లా ఎన్నికల అధికారి రాజర్షిషా పరిశీలించారు. నామినేషన్ల ప్రక్రియ సందర్భంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలను అధి కారులకు సూచించారు. కార్యక్రమంలో ఆర్వో శ్రీనివాసులు, డీఎస్వో రాజిరెడ్డి, పీడీ మెప్మా ఇందిర, మున్సిపల్ కమిషనర్ వెంకటగోపాల్, డీడబ్ల్యూవో బ్రహ్మాజీ, తహసీల్దార్ కమలాద్రి, తూప్రాన్ డీఎస్పీ యాదగిరిరెడ్డి పాల్గొన్నారు.