వట్పల్లి, డిసెంబర్ 5 : డ్రైవర్ నిర్లక్ష్యం, అతివేగంగా నడపడంతో జోగిపేటలోని ఆక్స్ఫర్డ్ స్కూల్ బస్సు బోల్తాపడింది. సోమవారం మండలంలోని బిజీలిపూర్, మర్వేల్లి గ్రామం నుంచి జోగిపేట స్కూల్కు విద్యార్థులకు తీసుకువేళుతున్న సమయంలో బిజీలిపూర్ గ్రామ శివారులోని ములమలుపులో బోల్తాపడింది. బస్సులో ప్రయాణిస్తున్న 16 మంది విద్యార్థులకు గాయలయ్యారు.
స్థానికుల సాయం తో విద్యార్థులను బస్సులో నుంచి బయటకు తీసి ప్రథమ చికిత్స అందించారు. విషయం తెలుసుకున్న వట్పల్లి ఎస్సై అంబార్యా, ఎమ్మర్వో రాధాబాయ్ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. చికిత్స నిమి త్తం విద్యార్థులకు ప్రభుత్వ దవాఖానకు తరలించారు. యాజమన్యంపై తగిన చర్యలు తీసుకుంటామని ఎస్సై పేర్కొన్నారు.