పెద్దశంకరంపేట,ఆగస్టు 4: పచ్చదనాన్ని పెంపొదించడానికి ప్రభుత్వం మండలానికో బృహత్ ప్రకృతి వనాన్ని ఏర్పాటు చేస్తున్నదని నారాయణఖేడ్ ఎమ్మెల్యే భూపాల్రెడ్డి అన్నారు. బుధవారం మండలంలోని ఆరెపల్లిలో పది ఎకరాల విస్తీర్ణంలో బృహత్ ప్రకృతి వనాన్ని శంకుస్థాపన చేసిన అనంతరం మాట్లాడారు. ప్రతి గ్రామం లో పల్లె ప్రకృతి వనం ఏర్పాటు చేసినప్పటికీ ప్రతి మండలానికో బృహత్ పల్లెప్రకృతి (మెగా పార్కు) వనం ఏర్పాటు చేస్తున్నామన్నారు. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం ముందుకు సాగుతుందన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ జంగం శ్రీనివాస్, జడ్పీటీసీ విజయరామరాజు, సర్పంచ్ల ఫోరం మండల అధ్యక్షుడు రాములు, సర్పంచ్లు సత్యనారాయణ, శంకర్, రైతు బంధు మండల అధ్యక్షుడు సురేశ్గౌడ్, ఎంపీటీసీ సుభాశ్గౌడ్, నాయకులు మాణిక్రెడ్డి, కిషన్, గంగారం, సాయిలు, ఎంపీడీవో రామ్నారాయణ, ఎంపీవో రియాజొద్దీన్, ఉన్నారు.
మొక్కలను సంరక్షించాలి
నాటిన మొక్కలను సంరక్షించే బాధ్యత మనందరిపై ఉందని మున్సిపల్ కమిషనర్ శ్రీహరి అన్నారు. బుధవారం పట్టణంలోని పలు వార్డుల్లో హరితహారంలో భాగంగా నాటిన మొక్కలను పరిశీలించా రు. ట్రీగార్డు ఏర్పాటు చేయని మొక్కలకు ఏర్పాటు చేయించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ పట్టణంలోని 32 వార్డులతో పాటు గుర్తించిన ఖాళీ స్థలంలో మొక్కలు నా టారు. నాటిన మొక్కలను సంరక్షించే విధంగా చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన అన్నారు. ముఖ్యంగా పశువులు, మేకలు మొక్కలను తినకుండా మొక్కలకు ట్రీగార్డులు ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు.