టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి
దౌల్తాబాద్, మే 22 : యాసంగి సీజన్లో రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేస్తూ సీఎం కేసీఆర్ రైతులకు అండగా నిలిచారని టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి అన్నారు. ఆదివారం దౌల్తాబాద్లో ఐకేపీ ఆధ్వర్యంలో కొనసాగుతున్న వడ్ల కొనుగోలు కేంద్రాన్ని సందర్శించి రైతులతో మాట్లాడారు. అనంతరం పెద్దమ్మ దేవి విగ్రహ ప్రతిష్ఠ ఉత్సవాల్లో పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా కొత్త ప్రభాకర్రెడ్డి మాట్లాడుతూ ధాన్యానికి రూ.1960 మద్దతు ధర చెల్లించి కొనుగోలు చేస్తున్నదన్నారు. రాష్ట్రంలో సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో రైతు ప్రభుత్వం నడుస్తున్నదని తెలిపారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు రణం శ్రీనివాస్గౌడ్, జిల్లా కో-అప్టెడ్ సభ్యుడు రహీమొద్దీన్, ఎంపీటీసీల ఫోరం మండల అధ్యక్షుడు దేవేందర్, టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు నర్సింహారెడ్డి, నాయకులు తదితరులు ఉన్నారు.