చేర్యాల, ఆగస్టు 4 : కేంద్ర ప్రభుత్వం నుంచి తెలంగాణకు రావాల్సిన నిధులను బీజేపీ, కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్, రేవంత్రెడ్డి తీసుకురావాలని, లేదంటే గ్రామాల్లో వారిని తిరగనివ్వమని ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి హెచ్చరించారు. మండలంలోని ఆకునూరు గ్రామంలో రూ.4.60 కోట్ల వ్యయంతో బీటీ రోడ్డు పునరుద్ధరణ (చేర్యాల ప్రభుత్వ డిగ్రీ కళాశాల నుంచి ధూళిమిట్ట వరకు), ఆకునూరులో కిలో మీటర్ సీసీ రోడ్డు నిర్మాణ పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. అనంతరం సర్పంచ్ రేఖామల్లేశ్యాదవ్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఎమ్మెల్యే పాల్గొని మాట్లాడుతూ పార్లమెంట్లో తెలంగాణ అభివృద్ధికి కోసం కొట్లాడుతున్న టీఆర్ఎస్ ఎంపీలతో కలిసి రేవంత్రెడ్డి, బండి సంజయ్ ఎందుకు కేంద్రాన్ని నిలదీయడం లేదని ప్రశ్నించారు. తెలంగాణకు సమకూరుతున్న నిధులతో సీఎం కేసీఆర్ ప్రాజెక్టులు నిర్మించి రైతులకు సాగు, తాగునీరు అందిస్తున్నారని తెలిపారు. తెలంగాణ పన్నుల రూపంలో కేంద్రానికి చెల్లించి డబ్బుల్లో న్యాయపరంగా రావాల్సిన రూ.లక్షా 40 వేల కోట్లను బీజేపీ ఇవ్వకుండా వారి పార్టీ అధికారంలో ఉన్న రాష్ర్టాలకు కేటాయిస్తూ తెలంగాణ అభివృద్ధిని అడ్డుకుంటుందని తెలిపారు. దళితబంధు పథకాన్ని అన్ని నియోజకవర్గాలో త్వరలో ప్రారంభించేందుకు సీఎం కేసీఆర్ చర్యలు తీసుకుంటున్నారని చెప్పారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి ఉల్లెంగల ఏకానందం, పీఏసీఎస్ చైర్మన్ వంగ చంద్రారెడ్డి, ఎంపీపీ వుల్లంపల్లి కరుణాకర్, జడ్పీటీసీ మల్లేశం, మార్కెట్ కమిటీ చైర్మన్ మల్లేశం, మార్కెట్ వైస్ చైర్మన్ పుర్మ వెంకట్రెడ్డి, ఎంపీటీసీ సుంకరి శ్రీధర్, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మల్లేశం, గ్రామశాఖ అధ్యక్షుడు శ్రీకాంత్రెడ్డి, మల్లన్న ఆలయ డైరెక్టర్ దినేశ్తివారి, ఉపసర్పంచ్ పద్మ, మాజీ ఎంపీటీసీ వేణుగోపాల్, రైతుబంధు సమితి గ్రామ అధ్యక్షుడు మహేందర్, టీఆర్ఎస్వీ మండల ఉపాధ్యక్షుడు సదానందం, టీఆర్ఎస్ యూత్ గ్రామశాఖ అధ్యక్షుడు లక్ష్మణ్, మాజీ ఉపసర్పంచ్ కోతి దాసు, సత్యనారాయణ, రాజు, ప్రశాంత్, వార్డు సభ్యులు పాల్గొన్నారు.