పటాన్చెరు, నవంబర్ 28 : పటాన్చెరు నియోజకవర్గం విద్యుత్ వెలుగులతో వెలిగిపోతుందని ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి అన్నారు. సబ్స్టేషన్లు మంజూరు చేయాలని మంత్రి తన్నీరు హరీశ్రావును కోరగా, ఆయన సూచన మేరకు సోమవారం టీఎస్ఎస్పీడీసీఎల్ సీఎండీ కార్యాలయం ఆపరేషన్స్ డైరెక్టర్ శ్రీనివాస్రెడ్డిని ఎమ్మెల్యే కలిశారు. ఈ సందర్భంగా కొత్త సబ్స్టేషన్లు అవసరం ఉన్నాయని విన్నవించారు. అమీన్పూర్ చక్రపురికాలనీ, పటాన్చెరు జీఎంఆర్ ఫంక్షన్హాల్, సింఫనీ పార్క్, తెల్లాపూర్ మున్సిపాలిటీ, అమీన్పూర్ గోశాల పరిధిలో ఈ సబ్స్టేషన్లు అవసరమని తెలిపారు. సానుకూలంగా స్పందించిన శ్రీనివాస్రెడ్డి వారం రోజుల్లో ఇందుకు సంబంధించిన పనులు ప్రారంభిస్తామని తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మంత్రి సహకారంతో ఐదు సబ్స్టేషన్లు నియోజకవర్గానికి వస్తున్నాయన్నారు. నాణ్యమైన విద్యుత్ను ప్రజలకు అందజేసేందుకు ఈ సబ్స్టేషన్లు ఎంతగానో ఉపయోగపడుతాయన్నారు.
అభివృద్ధి పథంలో పటాన్చెరు డివిజన్ ముందున్నదని ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి అన్నారు. సోమవారం పటాన్చెరు మున్సిపాలిటీ డివిజన్ 113లో ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి, కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్తో కలిసి గౌతమ్నగర్లో రూ. 65లక్షల వ్యయంతో చేపట్టనున్న సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు. పటాన్చెరు డివిజన్లో రూ. 5 కోట్ల నిధులతో పనులు చేపట్టామన్నారు. ప్రజా అవసరాలను గుర్తించి వాటిని తక్షణమే పూర్తి చేస్తున్నామని ఎమ్మెల్యే అన్నారు. కార్పొరేటర్ మెట్టు కుమార్యాదవ్ మాట్లాడుతూ ఎమ్మెల్యే సహకారంతో డివిజన్ను అభివృద్ధి చేస్తున్నామన్నారు. వారివెంట టీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు అఫ్జల్, నాయకులు ఉన్నారు.