గజ్వేల్, ఫిబ్రవరి 17: మున్సిపల్ ఎన్నికలో గజ్వేల్ పట్టణ ప్రజలు అభివృద్ధి చేసిన బీఆర్ఎస్కు ఓటేశారని, రేవంత్రెడ్డి ప్రభు త్వం అబద్ధాలను నమ్మలేదని బీఆర్ఎస్ గజ్వే ల్ నియోజకవర్గ ఇన్చార్జి వంటేరు ప్రతాప్రెడ్డి అన్నారు. మంగళవారం గజ్వేల్లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. గజ్వేల్లో కేసీఆర్ సీసీ రోడ్లు, మురుగుకాల్వలు, యూజీడీ, మహతి ఆడిటోరియం, అద్భుతమైన ఎడ్యుకేషన్ హబ్, ఇంటింటి మిషన్ భగీరథ తాగునీళ్లు, ఇంటిగ్రేటెడ్ మార్కెట్, ప్రభుత్వ దవాఖానలు నిర్మించారన్నారు. సర్పంచ్ ఎన్నికల్లో 10 గ్రామాలను ఏకగ్రీవం చేసుకోగా, వందకు పైగా గ్రామాల్లో బీఆర్ఎస్ మద్దతుదారులు గెలుపొందినట్లు తెలిపారు.
గజ్వేల్లో 12మంది, తూప్రాన్లో 9మంది కౌన్సిలర్లు బీఆర్ఎస్ తరపున గెలుపొంది రెండింటిలో గులాబీ జెండా ఎగురవేశామన్నారు. తూప్రాన్ మున్సిపాలిటీలో ముగ్గురు బీజేపీ కౌన్సిలర్లను ఎంపీ రఘునందన్ కాంగ్రెస్కు అమ్ముకున్నారని ఆరోపించారు. దమ్ముంటే రఘునందన్ దీనిపై చర్చ కు రావాలని సవాల్ విసిరారు. ప్రజలు బీజేపీకి ఓటేస్తే కాంగ్రెస్కు కౌన్సిలర్లను అమ్ముకున్నారని, దీనిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. బీజేపీ నైతికత కోల్పోయిందని, ప్రజలు తగిన బుద్ధి చెప్పుతారని అన్నారు. ఆర్అండ్ఆర్ కాలనీలో అడ్డదారిలో ప్రజలను నమ్మించి గెలిచారని, గెలిచిన కౌన్సిలర్లు ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి, నెల రోజుల్లో సమస్యను పరిష్కరించకపోతే ఉద్యమం చేస్తామని హెచ్చరించారు.
త్వరలో జరగబోయే జిల్లా పరిషత్ ఎన్నికల్లో అన్ని స్థానాలను గెలుస్తామని వంటేరు ప్రతాప్రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా నూతన మున్సిపల్ చైర్పర్సన్ చందనారవీందర్ మాట్లాడుతూ.. అందరి సహకారంతో మున్సిపల్ అభివృద్ధికి కృషి చేస్తామన్నారు. సమావేశంలో వైస్ చైర్పర్సన్ పద్మాబాయినర్సింగరావు, మాజీ మున్సిపల్ చైర్మన్ రాజమౌళి, మండల పార్టీ అధ్యక్షులు మధు, నవాజ్, కౌ న్సిలర్లు మమత, మమతాసంతోష్, స్వప్న, మురళి, శ్రీధర్, బాపురాజు పాల్గొన్నారు.