అభివృద్ధి పరుగులు పెడుతున్నది. వేల కోట్లతో చేపట్టిన అభివృద్ధి పనులు కండ్ల ముందు కనిపిస్తున్నాయి. సీఎం కేసీఆర్ సహకారంతో మంత్రి హరీశ్రావు ప్రత్యేక కృషితో ఎమ్మెల్యే వొడితెల సతీశ్ కుమార్ హుస్నాబాద్ నియోజకవర్గంలో పెద్దఎత్తున అభివృద్ధి పనులు చేశారు. గత ప్రభుత్వాల హయాంలో మాటలకే పరిమితమైన పనులను కూడా పూర్తి చేసి అభివృద్ధి, సంక్షేమంలో ముందు వరుసలో ఉంచారు. ఇక్కడి ప్రాంత రైతుల చిరకాల కోరిక అయిన గౌరవెల్లి రిజర్వాయర్ ప్రాజెక్టును పూర్తి చేశారు. మహాసముద్రంగండి చెరువు పనులు పూర్తిచేయడంతో ఆ ఫలాలను రైతులు అందుకుంటున్నారు. శనిగరం మధ్యతరహా ప్రాజెక్టును ఆధునీకరించారు. మిషన్ కాకతీయతో చెరువులకు పూర్వవైభవం వచ్చింది. హుస్నాబాద్ పట్టణంలో సెంట్రల్ లైటింగ్, గౌరవెల్లి ప్రాజెక్టు భూనిర్వాసితులకు పరిహారం, హుస్నాబాద్ ఎల్లమ్మ చెరువు మినీ ట్యాంక్బండ్ సుందరీకరణ చేపట్టారు. రహదారులకు మహర్దశ వచ్చింది. దీంతో నియోజకవర్గ ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
సిద్దిపేట, అక్టోబర్ 13(నమస్తే తెలంగాణ ప్రతినిధి): హుస్నాబాద్ నియోజకవర్గంలో అభివృద్ధి పరుగులు పెడు తున్నది. వేల కోట్ల రూపాయలతో చేపట్టిన అభివృద్ధి పనులు కండ్ల ముందు కనిపిస్తున్నాయి. సీఎం కేసీఆర్ సహకారంతో మంత్రి హరీశ్రావు ప్రత్యేక కృషితో స్థానిక ఎమ్మెల్యే వొడితెల సతీశ్కుమార్ నియోజకవర్గాన్ని అభివృద్ధిలో ముందుంచారు. ఇక్కడి ప్రాంత ప్రజల కలను సాకారం చేశారు. గత ప్రభుత్వాల హయాంలో మాటలకే పరిమితమైన పనులను పూర్తి చేసి అభివృద్ధి, సంక్షేమంలో హుస్నాబాద్ను ముందు వరుసలో నిలిపారు. ఇక్కడి ప్రాంత రైతుల చిరకాల కోరిక అయిన గౌరవెల్లి రిజర్వాయర్ ప్రాజెక్టును పూర్తి చేశారు. దశాబ్దాల కాలంగా పెండింగ్లో ఉన్న మహాసముద్రంగండి చెరువు పూర్తి చేయడంతో ఆఫలాలు రైతులు అందుకుంటున్నారు. శనిగరం మధ్యతరహాప్రాజెక్టును ఆధునీకరించారు. మిషన్ కాకతీయతో చెరువులకు పూర్వవైభవం వచ్చింది. హుస్నాబాద్ పట్టణంలో సెంట్రల్ లైటింగ్, గౌరవెల్లి ప్రాజెక్టు భూనిర్వాసితులకు పరిహారం, హుస్నాబాద్ ఎల్లమ్మ చెరువు మినీ ట్యాంక్బండ్ సుందరీకరణ చేపట్టారు. రహదారులకు మహర్దశ వచ్చింది. సిద్దిపేట-ఎల్కతుర్తి జాతీయ రహదారి విస్తరణ పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి. నూతన గ్రామ పంచాయతీల ఏర్పాటు, కులవృత్తులకు జీవనోపాధి, ఇలా ఏరంగంలో చూసుకున్నా అభివృద్ధిలో ముందు వరుసలో నిలిచింది. ఒకనాడు ఎట్లున్న హుస్నాబాద్ ఎట్లయ్యింది. ఆ ఫలాలు ప్రజల ముందు కనిపిస్తున్నాయి.
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని హుస్నాబాద్ నియోజకవర్గం జిల్లాల పునర్విభజనలో సిద్దిపేట జిల్లాలో కలిసింది.సిద్దిపేట జిల్లాలో నియోజకవర్గ కేంద్రమైన హుస్నాబాద్తో పాటు అక్కన్నపేట, కోహెడ మండలాలు, కరీంనగర్ జిల్లాలో చిగురుమామిడి, సైదాపూర్ మండలాలు, హనుమకొండ జిల్లాలో ఎల్కతుర్తి, భీమదేవరపల్లి మండలాలు ఉన్నాయి. సిద్దిపేట, కరీంనగర్, హనుమకొండ జిల్లాలో విస్తరించి ఉంది. 2014, 2018లో వరుసగా రెండు సార్లు ఇక్కడి నుంచి వొడితెల సతీశ్కుమార్ ప్రాతినిథ్యం వహిస్తున్నారు. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థిగా సతీశ్కుమార్నే గులాబీ అధినేత సీఎం కేసీఆర్ నిలబెట్టారు. ఈసారి విజయం సాధించి హ్యాట్రిక్ కొట్టాలనే లక్ష్యంగా పార్టీ శ్రేణులు పని చేస్తున్నారు. 2014 నుంచి 2023 వరకు నియోజకవర్గంలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లేలా ప్రణాళిక సిద్ధం చేసుకొని బీఆర్ఎస్ క్యాడర్ ముందుకు పోతుంది.హుస్నాబాద్ నియోజకవర్గంలో ఈ తొమ్మిదేండ్లలో అభివృద్ధి, సంక్షేమ పథకాలకు కలిపి సుమారు రూ. 9,076 కోట్లు వెచ్చించారు. వీటిలో నుంచి ఒక అభివృద్ధి పనులకే రూ. 5,649 కోట్లు ఖర్చు చేయగా రూ.3,427 కోట్లు సంక్షేమ పథకాలకు వెచ్చించారు.