మెదక్ మున్సిపాలిటీ, జూలై 16: పట్టణ ప్రగతి మూడో విడుత మెదక్ లో విజయవంతమైంది. ప్రజాప్రతినిధులు, అధికారులు వార్డుల్లో పర్యటించి సమస్యలను తెలుసుకోని మౌలిక వసతులు కల్పించారు. డ్రైనేజీల్లో పేరుకుపోయిన చెత్త తొలిగించి శుభ్రం చేశారు. ఇంటింటికీ ఆరు మొక్కలు పంపిణీ చేశారు. మెదక్ మున్సిపాలిటీలో మొత్తం 32 వార్డులు ఉన్నాయి. జూలై 1 నుంచి 10వరకు పది రోజుల పాటు ప్రజాప్రతినిధులు, అధి కారులు ప్రజా సమస్యలు తెలుసుకుని పరిష్కరించారు. పట్టణ ప్రగతి కార్యక్రమం, హరితహారంలో భాగంగా మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి, కలెక్టర్ హరీశ్, జిల్లా అదనపు కలెక్టర్ ప్రతిమాసింగ్తో పాటు మున్సిపల్ చైర్మన్, కౌన్సిలర్లు పాల్గొన్ని విజయవంతం చేశారు.
పది రోజుల్లో పరిశుభ్రం..
మెదక్ పట్టణ ప్రగతిలో పది రోజుల్లో అనేక పనులు చేపట్టారు. పది రోజుల్లో 277.79 టన్నుల చెత్త, 82.63 టన్నుల శిథిలాలను తొలిగించారు.89. 6కి.మీ మేర మురుగు కాల్వల్లో పూడిక తీశారు. శిథిలావస్థలో ఉన్న 13 ఇండ్లను తొలిగించారు. 15 లోతట్టు ప్రాంతాలని గుర్తించి పూడ్చి వేశారు. 111 ప్రాంతాల్లో ఫాగింగ్ చేశారు. పట్టణంలోని 8 ఓహెచ్ఎస్ఆర్, జీఎల్ఎస్ఆర్, ఈఎల్ఎస్ఆర్ వాటర్ ట్యాంకులను శుభ్రం చేశారు.
11 పార్కులను శుభ్రం చేశారు. పని చేయని 9 బోర్లను మూసివేశారు. 8 బోరు మోటర్లకు కొత్త కేపాసీటర్ల అమర్చారు. 137 మతపరమైన ప్రదేశాలు, విద్యాసంస్థలను శుభ్రం చేశారు. 9 దళిత వాడలను సందర్శించి పలు సమస్యలు పరిష్కరించారు.
విద్యుత్ మరమ్మతులు..
పట్టణ ప్రగతిలో వివిధ వార్డుల్లో 9 స్తంభాలను సరిచేశారు. తుప్పు పట్టిన 5 స్తంభాలను తొలిగించి నూతన స్తంభాలను ఏర్పాటు చేశారు. విద్యుత్ తీగలను గుర్తించి సరి చేశారు.
హరితహారంలో 5,994 మొక్కలు నాటాం
పట్టణ ప్రగతి, హరితహారంలో భాగంగా పట్టణంలో రోడ్డు , డివైడర్ మధ్యలో ఈనెల 16 వరకు 5,994 మొక్కలు నాటారు. ఇంటింటికీ15,750 మొక్కలు పంపిణీ చేశారు.
నేటి నుంచి మున్సిపాలిటీల్లో హరితహారం
హరితహారంలో భాగంగా జిల్లాలోని నాలు గు మున్సిపాలిటీల్లో నేటి నుం చి ఆగస్టు వరకు జిల్లా అదనపు కలెక్టర్ ప్రతిమాసింగ్ ఆధ్వర్యంలో ప్రత్యే క కార్యక్రమం నిర్వహించనున్నారు. మున్సిపల్ పరిధిలో వార్డుల్లో ఖాళీ స్థలాలను గుర్తించి మొక్కలను నాటానున్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్లు, కౌన్సిలర్లు, వార్డు కమిటీ సభ్యులతో పాటు ప్రజలు భాగస్వాములు కావాలని ప్రతి మా సింగ్ ఇదివరకే ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే.
ప్రజా సమస్యల కోసమే ‘పట్టణ ప్రగతి’
ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్ర భుత్వం పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని చేపట్టింది. పట్టణ ప్రగతిలోభాగస్వాములమై అన్ని వార్డుల్లో పర్యటించాం. ప్రజలు సమస్యలను అడిగి తెలుసుకొని పరిష్కరించాం
– మున్సిపల్ చైర్మన్,చంద్రపాల్
సమస్యలు పరిష్కరించారు.
పట్టణ ప్రగతిలో భాగంగా మున్సిపల్ చైర్మన్, కౌన్సిలర్లు మున్సిపల్ అధికారులు వార్డుకు రావడంతో స మస్యలను తెలిపాం. సమస్యలు అక్కడికక్కడే పరిష్కరించారు. పట్టణ ప్రగతిలో సమస్యలను పరిష్కార మయ్యేలా కృషి చేస్తున్న ముఖ్య మంత్రి కేసీఆర్ కృతజ్ఞతలు
-నగేశ్