తూప్రాన్ రూరల్, జూలై 25 : మొక్కలను నాటడటంతో పాటు వాటిని సంరక్షించే బాధ్యత ప్రజలపై ఉందని తూప్రాన్ మున్సిపల్ చైర్మన్ రాఘవేందర్గౌడ్ సూ చించారు. పట్టణంలోని రోడ్డు డివైడర్ మధ్యలో ఆదివారం వైస్ చైర్మన్ శ్రీనివాస్తో కలిసి మొక్కలను నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..16 వార్డుల్లో ఇంటింటికీ తిరుగుతూ పండ్లు, పూల మొక్కలను అందజేస్తున్నామని వాటిని నాటి సంరక్షించాల్సిన బాధ్యత మహిళలపై ఉందన్నారు. ఆయన వెంట కౌన్సిలర్లు శ్రీశైలంగౌడ్, కుమ్మరి రఘుపతి, మామిడి వెంకటేశ్, మామిండ్ల జ్యోతికృష్ణ, ఉమాసత్యలింగం, అరుణావెంకట్గౌడ్, రాజు, దుర్గారెడ్డి, టీఆర్ఎస్ తూప్రాన్ మండలాధ్యక్షుడు బా బుల్రెడ్డి, పట్టణ అధ్యక్షుడు సతీష్చారి పా ల్గొన్నారు.
జోరుగా హరితహారం .
మండలంలోని పలు గ్రామాల్లో హరితహారం మొక్కల పెంపకం ఊపందుకున్నాయి.ఇమాంపూర్, యావాపూ ర్, గుండ్రరెడ్డిపల్లి, ఇస్లాంపూర్తో పాటు పలు గ్రామాల్లో సర్పంచ్లు, ఎంపీటీసీలు, ప్రజాప్రతినిధుల ఆధ్వర్యంలో గ్రా మస్తులు,ఉపాధిహామీ కూలీలు మొక్కల పెంపకాన్ని చేపడుతున్నారు.
రామాయంపేటలో…
పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ ఇంటి ఎదుట ఆరు మొక్కలు నాటి సంరక్షించాలని సర్పంచ్ రాణమ్మ, ఎంపీటీసీ నాగులు, ఉపసర్పంచ్ బాలకృష్ణ, టీఆర్ఎస్ నాయకుడు భూలింగం అన్నారు. ఆదివారం హరితహారంలో భాగంగా గ్రామ శివారులోని హనుమాన్ దేవాలయం వద్ద పూజలు నిర్వహించి మొక్కలు నాటారు. నాటిన మొక్కలను దేవస్థాన కమిటీ సభ్యులు కాపాడాలన్నారు.